క్షణం క్షణం... భయం భయం
ఇళ్లలో ఉంటే విద్యుత్తు తీగలు ఎప్పుడు కింద పడుతాయోననే భయం.. ఆరుబయటికి వస్తే పిల్లలు తెలియక తక్కువ ఎత్తులో ఉన్న ట్రాన్స్ఫార్మర్లను తాకి ప్రమాదాల బారిన పడుతారేమోననే ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది.
ఇళ్లపై యమపాశాలతో ఆందోళన
తక్కువ ఎత్తులో ట్రాన్స్ఫార్మర్లు
న్యూస్టుడే, జమ్మలమడుగు, బద్వేలు, గోపవరం
జమ్మలమడుగులో ఎమ్మెల్యే కార్యాలయం వెనక వీధిలో ఇంట్లోనే ఇనుప విద్యుత్తు స్తంభం
ఇళ్లలో ఉంటే విద్యుత్తు తీగలు ఎప్పుడు కింద పడుతాయోననే భయం.. ఆరుబయటికి వస్తే పిల్లలు తెలియక తక్కువ ఎత్తులో ఉన్న ట్రాన్స్ఫార్మర్లను తాకి ప్రమాదాల బారిన పడుతారేమోననే ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితి అటు జమ్మలమడుగు నగర పంచాయతీలోని లక్ష్మీనగర్, చక్కడిపో వీధుల్లో, ఇటు బద్వేలు పురపాలక సంఘం పరిధిలోని బద్వేలు, గోపవరం ప్రాంతాల్లో నెలకొంది. ఇళ్ల మధ్య నుంచి 33 కేవీ లైను తీగలు వెళ్తుండడంతో అక్కడి ప్రజలకు దిన దినగండంలా మారింది. ఒక ఇంట్లో ఏకంగా ఇనుప విద్యుత్తు స్తంభమే ఉంది. వానా కాలం వచ్చిందంటే ఆ కుటుంబ సభ్యులకు కంటిమీద కునుకు ఉండదు. విద్యుత్తు సరఫరా అవుతున్న శబ్ధంతో నిద్ర కూడా పట్టదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. వారు 24 గంటలు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే కార్యాలయం వెనక వీధిలో చాలా వరకు ఇలాంటి సమస్యే వేధిస్తోంది. వీధిలో ఒక వైపు తక్కువ ఎత్తులో విద్యుత్తు తీగలు వేలాడుతూ ఉండడంతో స్థానికులు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. నాల్గో వార్డులో లక్ష్మీనగర్ వీధులు ఉన్నాయి. కొన్ని కాలనీల్లో డ్రైనేజీ లేక పోవడంతో మురుగు పారడంలేదు. ఇంకొన్ని చోట్ల మురుగు కాలువలు ఉన్నా అవి పూడికతో నిండిపోయాయి. బద్వేలు పట్టణంలోని అబ్బరాతివీధి దిగువ, ఎగువ బ్రాహ్మణవీధులు, మార్కెట్టువీధి, పోరుమామిళ్ల మెయిన్ బజార్, దూళ్లవీధి, పాతపోస్టాఫీసు వీధిలో మురుగు కాల్వల వ్యవస్థ సరిలేదు. మురుగుకాల్వలు పూడికతో నిండి దర్గంధం వెదజల్లుతోంది. పోరుమామిళ్ల రోడ్డులో విద్యుత్తు నియంత్రికకు రక్షణ కంచె లేదు. పిల్లలు ఆడుకుంటూ ఎప్పుడు ఏప్రమాదం జరుగుతుందోనని భయపడుతున్నారు.
పోరుమామిళ్లరోడ్డులో ప్రమాదకరంగా విద్యుత్తు నియంత్రిక
భయంతో ఇంటి నిర్మాణం పూర్తి చేయలేదు
మా ఇంటిలోనే ఇనుప విద్యుత్తు స్తంభం ఉండడంతో మాకు దిన దిన గండంలా మారింది. 33 కేవీ లైను తీగలు ఉన్నందున ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయలేకపోతున్నాం. లేకుంటే స్లాబ్ వేయాల్సి ఉంది, అది వేయాలంటే ఇంటి పైన పని జరగాలి, చేతికందే ఎత్తులో విద్యుత్తు తీగలు ఉన్నందున భవన నిర్మాణ కార్మికులు సైతం పనికి రావడంలేదు.
హరి, జమ్మలమడుగు
దిగువనే విద్యుత్తు నియంత్రిక
పోరుమామిళ్లరోడ్డులో విద్యుత్తు నియంత్రిక అందె ఎత్తులో ఉంది. పిల్లలు ఆడుకుంటున్నప్పుడు ఏ ప్రమాదానికి గురవుతారోనని భయపడుతున్నాం. మురుగు కాల్వలు పూడికతో నిండి దుర్గంధం వస్తోంది. అధికారులకు తెలిపినా పట్టించుకోలేదు.
ఈశ్వరమ్మ. పోరుమామిళ్ల రోడ్డు మెయిన్ బజారు, బద్వేలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యమే ఉండదన్నావ్.. మధ్యలోనే చంపేస్తున్నావ్..!
[ 08-05-2024]
దశల వారీగా మద్యనిషేధం చేస్తానని ఎన్నికల హామీ ఇచ్చిన సీఎం జగన్ అధికార పీఠం ఎక్కాక మోసం చేశారు. కొత్త విధానం పేరుతో ప్రభుత్వ మద్యం దుకాణాలు.. బార్లు తెరిచి లెక్కకు మించిన విక్రయాలతో పేదలను పిండేస్తూ జేబులు నింపుకొంటున్నారు. -
కొనసాగిన పోస్టల్ బ్యాలట్ పోలింగ్
[ 08-05-2024]
పోస్టల్ బ్యాలట్ పోలింగ్ మూడోరోజు మంగళవారం కొనసాగింది. కడప ఆర్డీవో కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కేంద్రానికి ఉద్యోగులు భారీ సంఖ్యలోనే తరలివచ్చారు. -
పట్టపగలు కాదు...అర్ధరాత్రి మెరుపుల వెలుగు
[ 08-05-2024]
ఈ చిత్రం చూస్తే ఇదేదో పట్టపగలు తీసిందని అనుకుంటారు... కానీ చిమ్మచీకట్లో తీసిన చిత్రమిది... మెరుపు తీగలు నగరానికి నగలా మారగా ఆ వెలుగులు పట్టపగలును తలపించాయి. -
నేడు కలికిరిలో ప్రధాని మోదీ సభ
[ 08-05-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచార నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ జిల్లాకు తొలిసారిగా బుధవారం రానున్నారు. పీలేరు నియోజకవర్గం కలికిరిలో నిర్వహించనున్న ప్రజాగళం బహిరంగసభను విజయవంతం చేయడానికి భాజపా, తెదేపా, జనసేన పార్టీల నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. -
కొలువుదీరావు... కొంప ముంచావు!
[ 08-05-2024]
నగరపాలక, పుర, నగర పంచాయతీల్లో మీకు సొంత ఇల్లుందా? పోనీ ఇంటి నిర్మాణానికి సెంటు స్థలమైనా ఉందా? వైకాపా ప్రభుత్వం విధించే ఆస్తిపన్నులు చెల్లించడానికి మీ ఆస్తులు సరిపోక పోవచ్చు. అద్దె ఇంట్లో ఉంటున్నామని సంబరపడే వారికి సంకటం తప్పదు. -
ఎన్డీఏ ప్రభుత్వంతోనే అభివృద్ధి, సంక్షేమం
[ 08-05-2024]
తెదేపా హయాంలో చేసిన అభివృద్ధి పనులే ముద్దనూరులో కనిపిస్తున్నాయని, వైకాపా ప్రభుత్వం చేపట్టింది ఏమీ కనిపించడంలేదని ఎన్డీఏ కడప ఎంపీ అభ్యర్థి చదిపిరాళ్ల భూపేష్రెడ్డి అన్నారు. -
మైనార్టీల హక్కులు కాపాడేది చంద్రబాబునాయుడే
[ 08-05-2024]
మైనార్టీల మతపరమైన సంరక్షణ, వారి హక్కులు కాపాడేది చంద్రబాబునాయుడే అని ముస్లిం సోదరులు అపోహలు వీడి నిశ్చింతగా ఉండాలని ఎమ్మెల్సీ ఇక్బాల్ అన్నారు. -
14 హామీలతో ప్రొద్దుటూరు తెదేపా మేనిఫెస్టో విడుదల
[ 08-05-2024]
ప్రొద్దుటూరు అభివృద్ధి కోరుతూ 14 రకాల ప్రధాన హామీలతో తెదేపా మేనిఫెస్టోను మంగళవారం ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజులురెడ్డి తన కార్యాలయంలో విడుదల చేశారు. -
గెలిపిస్తే.. ఉక్కు కర్మాగారం కోసం పోరాడుతాం
[ 08-05-2024]
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తనను గెలిపిస్తే కడప ఉక్కు కర్మాగారం సాధన కోసం కృషి చేస్తానని కడప తెదేపా ఎంపీ అభ్యర్థి భూపేష్రెడ్డి అన్నారు. -
అక్రమంగా దాచిన మద్యం స్వాధీనం
[ 08-05-2024]
మండల పరిధిలోని యాదవనగర్ సమీపంలో పంటపొలాల్లో దాచిన తెలంగాణా రాష్ట్రానికి చెందిన 2016 మద్యం సీసాలను సెబ్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
దివ్యాంగ ఓటర్లకు చక్రాల కుర్చీలు
[ 08-05-2024]
రానున్న ఎన్నికల్లో ఓటేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చే దివ్యాంగుల కోసం అధికారులు చక్రాల కుర్చీలు అందుబాటులోకి తీసుకురానున్నారు. -
తెదేపాలో భారీగా చేరికలు
[ 08-05-2024]
మైదుకూరు మండలం టి.కొత్తపల్లెకు చెందిన వైకాపా నాయకులు మంగళవారం ప్రొద్దుటూరులోని పార్టీ కార్యాలయంలో కూటమి అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ సమక్షంలో తెదేపాలో చేరారు. -
తెదేపాతో బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం
[ 08-05-2024]
తెదేపా ప్రభుత్వంలోనే కురబ సామాజిక వర్గానికి భరోసా లభిస్తుందని వారిని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చేసే బాధ్యత చంద్రబాబు తీసుకుంటారని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్బాషా అన్నారు. -
1950కు ఎస్ఎంఎస్ చేస్తే పోలింగ్ కేంద్రం వివరాలు
[ 08-05-2024]
మీ నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రం స్లిప్పుల కోసం ఎవరి వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఎస్ఎంఎస్ ద్వారా తెలుసుకునేందుకు వెసులుబాటు కల్పించింది ఎన్నికల కమిషన్. -
యజమాని వేధింపులతో చేనేత కార్మికుడి బలవన్మరణం
[ 08-05-2024]
మగ్గాల యజమాని వేధింపులు భరించలేక ఓ చేనేత కార్మికుడు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. -
వడగండ్లు... రైతులకు కడగండ్లు
[ 08-05-2024]
మండలంలోని బూడిదవేడులో సోమవారం రాత్రి భారీ గాలులతో కూడిన వడగండ్ల వానకు పంటలన్నీ నేలమట్టమయ్యాయి. దాదాపు 30 ఎకరాల్లో బొప్పాయి, టమాట, వరి తదితర పంటలన్నీ నేలకొరిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు.
తాజా వార్తలు (Latest News)
-
ఓటీటీలో ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
రైతులెవరూ అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం: మంత్రి తుమ్మల
-
ఓడితే ‘నాకౌట్’ కష్టాలు తప్పవు.. ‘ఉప్పల్’లో వరుణుడు ఏం చేసేనో?
-
‘ఆ 20 నిమిషాలు నా పిల్లలు ఏడుస్తూనే ఉన్నారు’: పూంఛ్ ఉగ్రదాడిపై ప్రత్యక్షసాక్షి
-
‘ఉద్యోగం ఉంటుందో?లేదో?’: ఎయిరిండియా విమానాల రద్దుపై ప్రయాణికుల ఆందోళన
-
వి.వి. వినాయక్ వల్లే ‘ఆర్య’ సాధ్యమైంది: అల్లు అర్జున్