ఆపు నీ డప్పు... ఇవ్వు మా డబ్బు!
జిల్లాలో గతేడాది మిగ్జాం తుపాను ప్రభావంతో పంటలు కోల్పోయిన రైతులకు పరిహారం అందే అవకాశాలు కనిపించట్లేదు.
మిగ్జాం నష్టపరిహారానికి రైతుల ఎదురుచూపులు
సంక్రాంతికి చెల్లిస్తామంటూ ఏమార్చిన సీఎం జగన్
చిట్వేలి మండలం నాగవరంలో నేలకొరిగిన అరటి తోట (పాత చిత్రం)
చెప్పే మాటలకు చేసే చేతలకు పొంతనే కుదరదు... హామీల అమలు కనిపించదు.... వెంటనే చేసేద్దామని ఊదరగొడతారే గానీ ఆ ఊసే ఉండదు... సాయం చేస్తామంటే ఎదురు చూపులు తప్పవు.... ఇదీ సీఎం జగన్ సర్కారు మార్కు దగాకు తార్కాణం ... అన్నమయ్య జిల్లాలో గతేడాది డిసెంబరు మిగ్జాం తుపాను ఉద్యాన రైతులను చిదిమేసినా ప్రభుత్వానికి పట్టని వైనానికి నిదర్శనం.
ఈనాడు, కడప, న్యూస్టుడే, రాజంపేట గ్రామీణ, చిట్వేలి, ఓబులవారిపల్లె
జిల్లాలో గతేడాది మిగ్జాం తుపాను ప్రభావంతో పంటలు కోల్పోయిన రైతులకు పరిహారం అందే అవకాశాలు కనిపించట్లేదు. జిల్లాలో అరటి, బొప్పాయి, టమాట, కూరగాయలు, బంతిపూలు, చామంతి తదితర పంటలకు జరిగిన నష్టంపై వ్యవసాయ, ఉద్యాన, రెవెన్యూ శాఖల సిబ్బందితో కూడిన బృందాలు తయారు చేశాయి. జాబితా ఆధారంగా బాధితులను ఎంపిక చేశారు. జిల్లా వ్యాప్తంగా తుపాను ప్రభావంతో 5,863 మంది రైతులను రూ.9.20 కోట్లు ఇవ్వాలని నివేదిక రూపొందించారు. గత నెల 6న పంట నష్ట పరిహారం అందిస్తున్నామంటూ సీఎం జగన్ బటన్ నొక్కారు. ఇప్పటికే నెలన్నర దాటినా ఇప్పటికీ రైతుల ఖాతాలకు నగదు జమ కాలేదు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో నగదు జమవుతుందా? లేదా? అని బాధిత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో 1,954 మంది రైతులు 4,153 ఎకరాల్లో సాగు చేసిన పంటలకు నష్టం వాటిల్లినట్లు ఉద్యానశాఖ అధికారులు గుర్తించారు. మదనపల్లె డివిజన్లోనూ పంటలకు అపార నష్టం జరిగినట్లు తేల్చారు. చిట్వేలి మండలంలో 359 ఎకరాల్లో అరటి, చామంతి, బొప్పాయి, రైల్వేకోడూరులో 360 ఎకరాల్లో అరటి, ఓబులవారిపల్లి మండలంలో 534 ఎకరాల్లో అరటి, 93 ఎకరాల్లో తమలపాకు, 72 ఎకరాల్లో బొప్పాయి, పెనగలూరులో 23 ఎకరాల్లో అరటి, పుల్లంపేటలో 1,326 ఎకరాల్లో అరటి, రామాపురం మండలంలో అయిదెకరాల్లో టమాట పంటలకు నష్టం జరిగినట్లు గుర్తించారు. ఓబులవారిపల్లె మండలంలో 682 మంది రైతులకు చెందిన 510.4 హెక్టార్ల ఉద్యాన పంటలకు నష్టం జరిగింది. దాదాపు రూ.40 కోట్లకుపైగా నష్టం వాటిల్లితే కేవలం రూ.9.20 కోట్లు మాత్రమే విడుదల చేశారు. ఆ నగదూ ఇప్పటికీ జమ కాక పోవడం గమనార్హం.
సీఎం బటన్ నొక్కినా సాయం అందలేదు
సీఎం జగన్ గత నెల 6న నష్టపరిహారం ఇస్తున్నట్లుగా బటన్ నొక్కినా ఇప్పటి వరకు డబ్బులు జమ కాలేదు. పంట నష్టం జరిగి నెలలు గడుస్తున్నా ఒక్క రూపాయి కూడా రాలేదు. పదెకరాల్లో అరటి సాగు చేశాం. దాదాపు రూ.10 లక్షల మేర నష్టపోయాం.
ఎ.రామరాజు, రైతు, చెర్లోపల్లి
డబ్బుల్లేక సాగే మానుకున్నాం
12 ఎకరాల్లో అరటి సాగు చేశాం. మిగ్జాం తుపాను ప్రభావంతో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. రూ.20 లక్షల మేర నష్టం వాటిల్లింది. నాలుగు నెలలుగా ఎదురు చూస్తున్నా పరిహారం ఒక్క రూపాయి రాలేదు. పొలంలో పాడైన పంటను తొలగించే స్థోమత లేక వదిలేశాం.
ఎస్.శివరామరాజు, రైతు హస్తవరం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యమే ఉండదన్నావ్.. మధ్యలోనే చంపేస్తున్నావ్..!
[ 08-05-2024]
దశల వారీగా మద్యనిషేధం చేస్తానని ఎన్నికల హామీ ఇచ్చిన సీఎం జగన్ అధికార పీఠం ఎక్కాక మోసం చేశారు. కొత్త విధానం పేరుతో ప్రభుత్వ మద్యం దుకాణాలు.. బార్లు తెరిచి లెక్కకు మించిన విక్రయాలతో పేదలను పిండేస్తూ జేబులు నింపుకొంటున్నారు. -
కొనసాగిన పోస్టల్ బ్యాలట్ పోలింగ్
[ 08-05-2024]
పోస్టల్ బ్యాలట్ పోలింగ్ మూడోరోజు మంగళవారం కొనసాగింది. కడప ఆర్డీవో కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కేంద్రానికి ఉద్యోగులు భారీ సంఖ్యలోనే తరలివచ్చారు. -
పట్టపగలు కాదు...అర్ధరాత్రి మెరుపుల వెలుగు
[ 08-05-2024]
ఈ చిత్రం చూస్తే ఇదేదో పట్టపగలు తీసిందని అనుకుంటారు... కానీ చిమ్మచీకట్లో తీసిన చిత్రమిది... మెరుపు తీగలు నగరానికి నగలా మారగా ఆ వెలుగులు పట్టపగలును తలపించాయి. -
నేడు కలికిరిలో ప్రధాని మోదీ సభ
[ 08-05-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచార నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ జిల్లాకు తొలిసారిగా బుధవారం రానున్నారు. పీలేరు నియోజకవర్గం కలికిరిలో నిర్వహించనున్న ప్రజాగళం బహిరంగసభను విజయవంతం చేయడానికి భాజపా, తెదేపా, జనసేన పార్టీల నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. -
కొలువుదీరావు... కొంప ముంచావు!
[ 08-05-2024]
నగరపాలక, పుర, నగర పంచాయతీల్లో మీకు సొంత ఇల్లుందా? పోనీ ఇంటి నిర్మాణానికి సెంటు స్థలమైనా ఉందా? వైకాపా ప్రభుత్వం విధించే ఆస్తిపన్నులు చెల్లించడానికి మీ ఆస్తులు సరిపోక పోవచ్చు. అద్దె ఇంట్లో ఉంటున్నామని సంబరపడే వారికి సంకటం తప్పదు. -
ఎన్డీఏ ప్రభుత్వంతోనే అభివృద్ధి, సంక్షేమం
[ 08-05-2024]
తెదేపా హయాంలో చేసిన అభివృద్ధి పనులే ముద్దనూరులో కనిపిస్తున్నాయని, వైకాపా ప్రభుత్వం చేపట్టింది ఏమీ కనిపించడంలేదని ఎన్డీఏ కడప ఎంపీ అభ్యర్థి చదిపిరాళ్ల భూపేష్రెడ్డి అన్నారు. -
మైనార్టీల హక్కులు కాపాడేది చంద్రబాబునాయుడే
[ 08-05-2024]
మైనార్టీల మతపరమైన సంరక్షణ, వారి హక్కులు కాపాడేది చంద్రబాబునాయుడే అని ముస్లిం సోదరులు అపోహలు వీడి నిశ్చింతగా ఉండాలని ఎమ్మెల్సీ ఇక్బాల్ అన్నారు. -
14 హామీలతో ప్రొద్దుటూరు తెదేపా మేనిఫెస్టో విడుదల
[ 08-05-2024]
ప్రొద్దుటూరు అభివృద్ధి కోరుతూ 14 రకాల ప్రధాన హామీలతో తెదేపా మేనిఫెస్టోను మంగళవారం ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజులురెడ్డి తన కార్యాలయంలో విడుదల చేశారు. -
గెలిపిస్తే.. ఉక్కు కర్మాగారం కోసం పోరాడుతాం
[ 08-05-2024]
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తనను గెలిపిస్తే కడప ఉక్కు కర్మాగారం సాధన కోసం కృషి చేస్తానని కడప తెదేపా ఎంపీ అభ్యర్థి భూపేష్రెడ్డి అన్నారు. -
అక్రమంగా దాచిన మద్యం స్వాధీనం
[ 08-05-2024]
మండల పరిధిలోని యాదవనగర్ సమీపంలో పంటపొలాల్లో దాచిన తెలంగాణా రాష్ట్రానికి చెందిన 2016 మద్యం సీసాలను సెబ్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
దివ్యాంగ ఓటర్లకు చక్రాల కుర్చీలు
[ 08-05-2024]
రానున్న ఎన్నికల్లో ఓటేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చే దివ్యాంగుల కోసం అధికారులు చక్రాల కుర్చీలు అందుబాటులోకి తీసుకురానున్నారు. -
తెదేపాలో భారీగా చేరికలు
[ 08-05-2024]
మైదుకూరు మండలం టి.కొత్తపల్లెకు చెందిన వైకాపా నాయకులు మంగళవారం ప్రొద్దుటూరులోని పార్టీ కార్యాలయంలో కూటమి అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ సమక్షంలో తెదేపాలో చేరారు. -
తెదేపాతో బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం
[ 08-05-2024]
తెదేపా ప్రభుత్వంలోనే కురబ సామాజిక వర్గానికి భరోసా లభిస్తుందని వారిని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చేసే బాధ్యత చంద్రబాబు తీసుకుంటారని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్బాషా అన్నారు. -
1950కు ఎస్ఎంఎస్ చేస్తే పోలింగ్ కేంద్రం వివరాలు
[ 08-05-2024]
మీ నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రం స్లిప్పుల కోసం ఎవరి వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఎస్ఎంఎస్ ద్వారా తెలుసుకునేందుకు వెసులుబాటు కల్పించింది ఎన్నికల కమిషన్. -
యజమాని వేధింపులతో చేనేత కార్మికుడి బలవన్మరణం
[ 08-05-2024]
మగ్గాల యజమాని వేధింపులు భరించలేక ఓ చేనేత కార్మికుడు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. -
వడగండ్లు... రైతులకు కడగండ్లు
[ 08-05-2024]
మండలంలోని బూడిదవేడులో సోమవారం రాత్రి భారీ గాలులతో కూడిన వడగండ్ల వానకు పంటలన్నీ నేలమట్టమయ్యాయి. దాదాపు 30 ఎకరాల్లో బొప్పాయి, టమాట, వరి తదితర పంటలన్నీ నేలకొరిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు.
తాజా వార్తలు (Latest News)
-
మంత్రి పెద్దిరెడ్డి వీర విధేయులపై వేటు
-
నారు పోశావా.. నీరు పెట్టావా.. మా భూములపై నీ పెత్తనం ఏంటీ?
-
ప్రైవేటు బస్సు బోల్తా.. పది మందికి గాయాలు
-
దక్షిణ చైనా సముద్రంలోకి భారత యుద్ధనౌకలు
-
తోటి పిటిషనర్గా హనుమాన్ పేరు.. కక్షిదారుకు రూ.లక్ష జరిమానా
-
దేశంలో తొలి ప్రైవేట్ రైలు జూన్ 4 నుంచి చుక్ చుక్