ఉక్కపోతతో తల్లీబిడ్డల ఉక్కిరిబిక్కిరి
భానుడి భగభగలకు ఉదయం 9 గంటలు దాటితే ఇళ్ల నుంచి బయటకు రావడానికి జనం భయపడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఎండలు 40 డిగ్రీల కంటే అధికంగానే ఉంటున్నాయి.
కరీంనగర్ ఎంసీహెచ్లో ఇబ్బందులు
దాతలు ముందుకొస్తే ఉపశమనం
ఇంటి నుంచి తెచ్చుకున్న ఫ్యాన్లతో బాలింతలు
న్యూస్టుడే, కరీంనగర్ సంక్షేమ విభాగం: భానుడి భగభగలకు ఉదయం 9 గంటలు దాటితే ఇళ్ల నుంచి బయటకు రావడానికి జనం భయపడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఎండలు 40 డిగ్రీల కంటే అధికంగానే ఉంటున్నాయి. కరీంనగర్ మాతా, శిశు ఆసుపత్రిలో పరిస్థితి దారుణంగా ఉంది. బాలింతలు శిశువులు ఉక్కపోతతో తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఒక్కో బాలింత వద్దకు బంధువులు ఇద్దరు, ముగ్గురు వస్తుండడంతో వార్డు మొత్తం ఉక్కపోతతో శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా మారుతోంది. వార్డులలో రెండు పడక మంచాలకు కలిపి ఒక్క ఫ్యాన్ ఉండడంతో అది సరిపోక ఇంటి నుంచి పంకాలు తెచ్చుకుంటున్నారు. నల్గొండ జిల్లా ఆసుపత్రిలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఏసీలు బిగించారు. మన వద్ద పాలకులు, దాతలు స్పందించి ఏసీలు, కూలర్లు అందిస్తే బాగుంటుందని గర్భిణులు, బాలింతలు కోరుతున్నారు.
స్వచ్ఛమైన గాలి లేకపోతే..
కరీంనగర్ మాతా, శిశు ఆరోగ్య కేంద్రానికి ప్రతి రోజు 200కు పైగా గర్భిణులు ఓపీకి వస్తుంటారు. ఇక్కడ స్థలం తక్కువగా ఉండడం ఓపీ ఎక్కువగా ఉండటంతో ఫ్యాన్ల గాలి సరిపోవడం లేదు. ఆసుపత్రి ఫైల్నే విసనకర్రలా వాడుతున్నారు. గర్భిణులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడుతుంటారు. అందులో స్వచ్ఛమైన గాలి చల్లగా లేకపోతే వారి పరిస్థితి తీవ్రంగా ఉంటుంది. నాలుగు బాలింతల వార్డులలో ఎప్పుడు 100 మందికిపైగా ఉంటారు. సాధారణ ప్రసవమైన వారు మూడు రోజులకు ఇంటికి వెళ్తుండడంతో వాళ్లకు ఇబ్బంది ఏమి ఉండదు. శస్త్రచికిత్స చేసిన మహిళలు ఏడు రోజులు ఆసుపత్రిలో ఉండాలి. ఉక్కపోతకు వార్డులో తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఉక్కపోత కారణంగా కుట్లు మానకపోగా, చెమటతో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదముంది.
నల్గొండ కావాలి ఆదర్శం
నల్గొండ జిల్లా మాతా, శిశు ఆరోగ్య కేంద్రంలో ఎండ వేడికి బాలింతల ఇబ్బందులకు గురవుతున్న విషయాన్ని గుర్తించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బాలింతల వార్డులకు 32 ఏసీలను ఏర్పాటు చేయించారు. ఇక్కడి పాలకులు, స్వచ్ఛంద సంస్థలు నాయకులు స్పందిస్తే ఇక్కడ గర్భిణులు, బాలింతలకు కొంత ఉపశమనంగా ఉంటుంది. ప్రస్తుతానికి ఆసుపత్రిలోని వార్డులలో నాలుగు ఏసీలతోపాటు పది కూలర్లు అవసరం ఉన్నాయి.
చిన్నారుల అవస్థలు
వార్డుల్లో బాలింతలతోపాటు ముక్కుపచ్చలారని శిశువులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రెండు మంచాలకు కలిపి ఒక ఫ్యాన్ ఉండడంతో పలువురు ఇళ్ల నుంచి తెచ్చుకుంటున్నారు. విపరీతమైన వేడితో శిశువులు ఇబ్బందిపడుతున్నారు. బాలింతలకు ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని దాతలెవరైనా ముందుకొస్తే ఏసీలు, కూలర్లు ఏర్పాటు చేస్తామని ఆసుపత్రి సూపరింటెండెంట్ వీరారెడ్డి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపా నాయకులు చర్చకు రావాలి
[ 02-05-2024]
అవినీతి ఆరోపణలు చేస్తున్న భాజపా నాయకులు ఆధారాలతో సహా చర్చకు రావాలని, నిరాధార ఆరోపణలు చేస్తే ఊరుకోబోమని పీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎం.రోహిత్రావు డిమాండ్ చేశారు. -
రెండేళ్లలో ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు
[ 02-05-2024]
ఓ యువకుడు రెండేళ్లలో ఏకంగా ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఆదర్శంగా నిలిచాడు. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని తుంగూర్కు చెందిన బెత్తపు -
కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్!
[ 02-05-2024]
నిత్యం ప్రజల మధ్య ఉండే జీవన్రెడ్డిని ఎంపీగా గెలిపించాలని.. ఈ ప్రాంత అభివృద్ధికి అవసరమైన నిధులు వస్తాయని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. -
హస్తాన్ని నమ్మొద్దు.. కమలం మాయలో పడొద్దు
[ 02-05-2024]
కాంగ్రెస్ను నమ్మొద్దని, భాజపా మాయలో పడొద్దని కరీంనగర్ భారాస ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. -
ఆ పార్టీలకు డిపాజిట్లు రావు
[ 02-05-2024]
కరీంనగర్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్, భారాసలకు డిపాజిట్లు కూడా రావని, రెండో స్థానం కోసం పోటీ పడుతున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. -
నేటి కేసీఆర్ బస్సు యాత్ర రద్దు
[ 02-05-2024]
భారాస అధినేత కేసీఆర్ 48 గంటల పాటు ప్రచారంలో పాల్గొనకుండా ఎన్నికల సంఘం నిషేధం విధించడంతో గురు, శుక్రవారాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరగాల్సిన బస్సు యాత్రపై ప్రభావం పడింది. -
సమష్టి కృషితో స్వయం ప్రతిపత్తి
[ 02-05-2024]
కరీంనగర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు స్వయం ప్రతిపత్తి హోదా దక్కింది. ప్రస్తుతం కరీంనగర్లో ఎస్సారార్ డిగ్రీ కళాశాలకు మాత్రమే ఆ హోదా ఉంది. -
కార్మిక క్షేత్రం.. తీర్పు విలక్షణం
[ 02-05-2024]
కార్మిక క్షేత్రమైన పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం.. ఆది నుంచి ప్రజా తీర్పులో ప్రత్యేకత చాటుకుంటోంది. ఇక్కడి ఓటర్లు ప్రతి పార్టీకి వరుసగా రెండు సార్లు అధికారమిస్తూ, తర్వాత కొత్త వారికి అవకాశమిస్తున్నారు. -
కీలక సంస్కరణల వెనుక..
[ 02-05-2024]
‘పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్’ కేసుకు సంబంధించి 2013లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ‘నోటా’ను ప్రవేశపెట్టారు. వ్యక్తి భావ ప్రకటనా స్వేచ్ఛలో ‘నోటా’ భాగమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. -
పురపాలికలకు ముందస్తుగా కాసుల జమ
[ 02-05-2024]
నగర, పురపాలికల్లో ఆస్తిపన్ను ఎర్లీబర్డ్ పథకం ద్వారా ముందస్తుగానే కాసుల గలగల కనిపించింది. గత నెల 1 నుంచి 30 వరకు పట్టణాలు, నగరాల్లో ఉన్న పన్ను చెల్లింపుదారులకు అయిదు శాతం రాయితీ ఇచ్చారు. -
మామ చేతిలో కోడలి హతం
[ 02-05-2024]
కుటుంబ పరువు కోసం కోడలి గొంతుకోసి మామ హత్య చేశాడు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలంలోని రేచపల్లి శివారులోని కొత్తపల్లి తండాలో బుధవారం చోటుచేసుకుంది. -
ఇంటింటికీ ఓటరు చీటీలు
[ 02-05-2024]
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం అన్ని రకాలుగా సమాయత్తమవుతోంది. పోలింగ్ శాతం పెంచడంతో పాటు ఓటర్లు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా సర్వం సిద్ధం చేస్తున్నారు. -
ఓటుకు.. తప్పని దూరాభారం
[ 02-05-2024]
ప్రతి ఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలని ప్రచారం చేస్తున్నా.. పోలింగ్ కేంద్రాలు దూరంగా ఉండడంతో తండావాసులకు ఇబ్బందిగా మారుతోంది.. -
కాంగ్రెస్కు భయపడే మోదీని తీసుకొస్తున్నారు
[ 02-05-2024]
రాష్ట్రంలో కాంగ్రెస్ పట్ల ప్రజలు ఆకర్షితులవుతున్నారని, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఎదుర్కోవడానికి -
ఇరవై శాఖలతో.. అభ్యర్థుల ప్రచారంపై నిఘా
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ముగియడంతో బరిలో నిలిచిన అభ్యర్థులు తమ ప్రచారాలకు పదునుపెడుతున్నారు. -
భానుడి ప్రతాపం.. కార్మికుల బేజారు
[ 02-05-2024]
రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. భానుడి ప్రతాపంతో ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తకి విఘాతం ఏర్పడుతోంది. -
మేమే వస్తాం.. ఓటు అభ్యర్థిస్తాం
[ 02-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారం ఊపందుకోవడంతో అంతటా రాజకీయం వేడెక్కింది. మరోవైపు ఎండ 45 డిగ్రీలకు చేరువవుతుండటంతో ఉదయం 9 గంటలకే గడప దాటలేనంతగా మండుతోంది. -
అయిదేళ్లు.. పెరిగిన ఓటర్లు 41,930
[ 02-05-2024]
జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 4,66,836 మంది ఓటర్లు ఉన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అదరగొట్టిన హైదరాబాద్.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్పై విజయం
-
బ్యాంకు ఖాతాల్లో పింఛన్ జమకాని వారికి.. మే 4న ఇస్తాం: శశి భూషణ్
-
97.76% రూ.2వేల నోట్లు వెనక్కి: ఆర్బీఐ
-
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!