logo

భాజపా నాయకులు చర్చకు రావాలి

అవినీతి ఆరోపణలు చేస్తున్న భాజపా నాయకులు ఆధారాలతో సహా చర్చకు రావాలని, నిరాధార ఆరోపణలు చేస్తే ఊరుకోబోమని పీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎం.రోహిత్‌రావు డిమాండ్‌ చేశారు.

Updated : 02 May 2024 14:00 IST

సుభాష్‌నగర్‌: అవినీతి ఆరోపణలు చేస్తున్న భాజపా నాయకులు ఆధారాలతో సహా చర్చకు రావాలని, నిరాధార ఆరోపణలు చేస్తే ఊరుకోబోమని పీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎం.రోహిత్‌రావు డిమాండ్‌ చేశారు. కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. భాజపా నేత రాణి రుద్రమదేవి, మంత్రి పొన్నం ప్రభాకర్‌ తనపై ఆరోపణలు చేశారని.. మరి ఆధారాలు ఎందుకు చూపడంలేదని ప్రశ్నించారు. మల్లికేశ్వర స్వామి బొమ్మతో తాను ప్రమాణం చేస్తున్నానని.. అవినీతి జరిగిందని నిరూపించడానికి వారిని కూడా ప్రమాణం చేయాలని డిమాండ్‌ చేశారు. నగరంలోని ఏ కూడలిలోనైనా, లేదా ఆలయం వద్దకైనా చర్చకు రావాలని డిమాండ్‌ చేశారు. అభివృద్ధిపై మాట్లాడకుండా వ్యక్తిగత విమర్శలు చేయడం సరైంది కాదని రాణిరుద్రమదేవి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని