రెండో రోజు నలుగురు నామినేషన్
కరీంనగర్, పెద్దపల్లి లోక్సభ స్థానాలకు రెండో రోజు శుక్రవారం కేవలం నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. కరీంనగర్ స్థానం కోసం భాజపా అభ్యర్థి బండి సంజయ్ తరఫున ఆ పార్టీ నాయకులు ఎన్నికల అధికారికి నామపత్రాలను అందజేశారు.
కాంగ్రెస్ పెద్దపల్లి అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్న గడ్డం వంశీకృష్ణ, చిత్రంలో ఎమ్మెల్యే విజయరమణారావు, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు తదితరులు
ఈనాడు, కరీంనగర్ న్యూస్టుడే, పెద్దపల్లి కలెక్టరేట్: కరీంనగర్, పెద్దపల్లి లోక్సభ స్థానాలకు రెండో రోజు శుక్రవారం కేవలం నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. కరీంనగర్ స్థానం కోసం భాజపా అభ్యర్థి బండి సంజయ్ తరఫున ఆ పార్టీ నాయకులు ఎన్నికల అధికారికి నామపత్రాలను అందజేశారు. మరోవైపు పెద్దపల్లి లోక్సభ స్థానం కోసం ముగ్గురు నామినేషన్లు వేశారు. భారాస తరపున కొప్పుల ఈశ్వర్, కాంగ్రెస్ తరపున గడ్డం వంశీకృష్ణ నామినేషన్ దాఖలు చేశారు. కరీంనగర్లో భాజపా అభ్యర్థి బండి సంజయ్కుమార్ తరపున భాజపా కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల అధ్యక్షులు గంగిడి కృష్ణారెడ్డి, ప్రతాప రామకృష్ణ, మాజీ మేయర్ శంకర్, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, నాయకుడు రమణారెడ్డిలు వెళ్లి కలెక్టర్ పమేలా సత్పతికి పత్రాలను అందజేశారు. దీంతో ఈ స్థానం కోసం శుక్రవారం కేవలం ఒక్క నామినేషన్ మాత్రమే దాఖలైంది. పెద్దపల్లి స్థానం నుంచి భారాస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణలు తమ నామపత్రాలు రిటర్నింగ్ అధికారి ముజమ్మిల్ ఖాన్కు అందజేశారు. ఈశ్వర్ రెండు సెట్ల నామినేషన్లు మాజీ ఎమ్మెల్యేలు మనోహర్రెడ్డి, కోరుకంటి చందర్; దుర్గం చిన్నయ్యలతో కలిసి దాఖలు చేశారు. గడ్డం వంశీకృష్ణ ఒక సెట్ నామపత్రాలు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్, ఎమ్మెల్యే విజయరమణారావు, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుతో కలిసి రిటర్నింగ్ అధికారి అందించగా, రెండో సెట్ తండ్రి చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్, కుటుంబ సభ్యులతో కలిసి వేశారు. భారాస అభ్యర్థిగా కొంకటి లింగమూర్తి అనే వ్యక్తి కూడా నామినేషన్ వేశారు. రెండు రోజులపాటు స్వీకరించిన నామినేషన్లలో కరీంనగర్ స్థానం కోసం మూడు, పెద్దపల్లి స్థానం కోసం ఏడు నామినేషన్లు ఇప్పటి వరకు దాఖలయ్యాయి. భారాస కరీంనగర్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ తరపున నాయకులు శనివారం నామినేషన్ వేసేందుకు ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నారు. పెద్దపల్లిలో భాజపా అభ్యర్థి గోమాసె శ్రీనివాస్ ఈ నెల 22న నామినేషన్ వేయనున్నారు. కరీంనగర్లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థిత్వం విషయంలో ఇంకా ఉత్కంఠ వీడలేదు. ఖమ్మం స్థానంతోపాటు ఈ స్థానాన్ని శనివారం అధికారికంగా ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతోంది.
నిజామాబాద్ భారాస అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్న బాజిరెడ్డి గోవర్దన్.. చిత్రంలో మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్కుమార్, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ సతీమణి ఆయేషా, జగిత్యాల జడ్పీ ఛైర్పర్సన్ వసంత
నిజామాబాద్ స్థానానికి ఆరుగురు
నిజామాబాద్ కలెక్టరేట్ : నిజామాబాద్ లోక్సభ స్థానానికి రెండో రోజైన శుక్రవారం ఆరు నామపత్రాలు దాఖలయ్యాయి. ఇందులో ప్రధాన పార్టీలు భారాస, భాజపా అభ్యర్థులున్నారు. భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ రెండు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. మొదటి సెట్ బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు కేఆర్.సురేష్రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్, మాజీ ఎమ్మెల్యే గణేశ్గుప్తాతో కలిసి రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతుకు అందజేశారు. రెండో సెట్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జగిత్యాల జడ్పీ ఛైర్పర్సన్ వసంత, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ సతీమణి ఆయేషా ఫాతిమాతో కలిసి వేశారు. భాజపా అభ్యర్థి ధర్మపురి అర్వింద్ పసుపు రైతులతో కలిసి నామపత్రాలు దాఖలు చేశారు. మెడలో పసుపుతో అల్లిన దండ వేసుకున్నారు. స్వతంత్ర అభ్యర్థులుగా రాపెల్లి శ్రీనివాస్, రాగి అనిల్, బహుజన్ ముక్తి పార్టీ తరఫున దేవతి శ్రీనివాస్, ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థిగా కండెల సుమన్ నామినేషన్ వేసిన వారిలో ఉన్నారు. నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన రెండు రోజుల్లో ఎనిమిది మంది నామినేషన్లు వేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపా నాయకులు చర్చకు రావాలి
[ 02-05-2024]
అవినీతి ఆరోపణలు చేస్తున్న భాజపా నాయకులు ఆధారాలతో సహా చర్చకు రావాలని, నిరాధార ఆరోపణలు చేస్తే ఊరుకోబోమని పీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎం.రోహిత్రావు డిమాండ్ చేశారు. -
రెండేళ్లలో ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు
[ 02-05-2024]
ఓ యువకుడు రెండేళ్లలో ఏకంగా ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఆదర్శంగా నిలిచాడు. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని తుంగూర్కు చెందిన బెత్తపు -
కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్!
[ 02-05-2024]
నిత్యం ప్రజల మధ్య ఉండే జీవన్రెడ్డిని ఎంపీగా గెలిపించాలని.. ఈ ప్రాంత అభివృద్ధికి అవసరమైన నిధులు వస్తాయని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. -
హస్తాన్ని నమ్మొద్దు.. కమలం మాయలో పడొద్దు
[ 02-05-2024]
కాంగ్రెస్ను నమ్మొద్దని, భాజపా మాయలో పడొద్దని కరీంనగర్ భారాస ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. -
ఆ పార్టీలకు డిపాజిట్లు రావు
[ 02-05-2024]
కరీంనగర్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్, భారాసలకు డిపాజిట్లు కూడా రావని, రెండో స్థానం కోసం పోటీ పడుతున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. -
నేటి కేసీఆర్ బస్సు యాత్ర రద్దు
[ 02-05-2024]
భారాస అధినేత కేసీఆర్ 48 గంటల పాటు ప్రచారంలో పాల్గొనకుండా ఎన్నికల సంఘం నిషేధం విధించడంతో గురు, శుక్రవారాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరగాల్సిన బస్సు యాత్రపై ప్రభావం పడింది. -
సమష్టి కృషితో స్వయం ప్రతిపత్తి
[ 02-05-2024]
కరీంనగర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు స్వయం ప్రతిపత్తి హోదా దక్కింది. ప్రస్తుతం కరీంనగర్లో ఎస్సారార్ డిగ్రీ కళాశాలకు మాత్రమే ఆ హోదా ఉంది. -
కార్మిక క్షేత్రం.. తీర్పు విలక్షణం
[ 02-05-2024]
కార్మిక క్షేత్రమైన పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం.. ఆది నుంచి ప్రజా తీర్పులో ప్రత్యేకత చాటుకుంటోంది. ఇక్కడి ఓటర్లు ప్రతి పార్టీకి వరుసగా రెండు సార్లు అధికారమిస్తూ, తర్వాత కొత్త వారికి అవకాశమిస్తున్నారు. -
కీలక సంస్కరణల వెనుక..
[ 02-05-2024]
‘పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్’ కేసుకు సంబంధించి 2013లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ‘నోటా’ను ప్రవేశపెట్టారు. వ్యక్తి భావ ప్రకటనా స్వేచ్ఛలో ‘నోటా’ భాగమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. -
పురపాలికలకు ముందస్తుగా కాసుల జమ
[ 02-05-2024]
నగర, పురపాలికల్లో ఆస్తిపన్ను ఎర్లీబర్డ్ పథకం ద్వారా ముందస్తుగానే కాసుల గలగల కనిపించింది. గత నెల 1 నుంచి 30 వరకు పట్టణాలు, నగరాల్లో ఉన్న పన్ను చెల్లింపుదారులకు అయిదు శాతం రాయితీ ఇచ్చారు. -
మామ చేతిలో కోడలి హతం
[ 02-05-2024]
కుటుంబ పరువు కోసం కోడలి గొంతుకోసి మామ హత్య చేశాడు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలంలోని రేచపల్లి శివారులోని కొత్తపల్లి తండాలో బుధవారం చోటుచేసుకుంది. -
ఇంటింటికీ ఓటరు చీటీలు
[ 02-05-2024]
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం అన్ని రకాలుగా సమాయత్తమవుతోంది. పోలింగ్ శాతం పెంచడంతో పాటు ఓటర్లు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా సర్వం సిద్ధం చేస్తున్నారు. -
ఓటుకు.. తప్పని దూరాభారం
[ 02-05-2024]
ప్రతి ఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలని ప్రచారం చేస్తున్నా.. పోలింగ్ కేంద్రాలు దూరంగా ఉండడంతో తండావాసులకు ఇబ్బందిగా మారుతోంది.. -
కాంగ్రెస్కు భయపడే మోదీని తీసుకొస్తున్నారు
[ 02-05-2024]
రాష్ట్రంలో కాంగ్రెస్ పట్ల ప్రజలు ఆకర్షితులవుతున్నారని, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఎదుర్కోవడానికి -
ఇరవై శాఖలతో.. అభ్యర్థుల ప్రచారంపై నిఘా
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ముగియడంతో బరిలో నిలిచిన అభ్యర్థులు తమ ప్రచారాలకు పదునుపెడుతున్నారు. -
భానుడి ప్రతాపం.. కార్మికుల బేజారు
[ 02-05-2024]
రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. భానుడి ప్రతాపంతో ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తకి విఘాతం ఏర్పడుతోంది. -
మేమే వస్తాం.. ఓటు అభ్యర్థిస్తాం
[ 02-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారం ఊపందుకోవడంతో అంతటా రాజకీయం వేడెక్కింది. మరోవైపు ఎండ 45 డిగ్రీలకు చేరువవుతుండటంతో ఉదయం 9 గంటలకే గడప దాటలేనంతగా మండుతోంది. -
అయిదేళ్లు.. పెరిగిన ఓటర్లు 41,930
[ 02-05-2024]
జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 4,66,836 మంది ఓటర్లు ఉన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
-
8న ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ.. ధరల శ్రేణి ఇదే..
-
TS ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు
-
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
-
ఫొటోషూట్లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
-
హార్దిక్ అందుబాటులో ఉన్నంతకాలం జట్టులో ఉండాలి: అజిత్ అగార్కర్