లక్ష ఓట్ల ఆధిక్యం కాంగ్రెస్ లక్ష్యం
‘ప్రతి ఇంటికి వెళ్లండి.. చేసిన ప్రగతిని చెప్పండి.. కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావుకు లక్ష ఓట్ల ఆధిక్యతను అందించాలి’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
జమ్మికుంట సభలో సీఎం రేవంత్
రాజేందర్రావును గెలిపించాలని కోరుతున్న రేవంత్రెడ్డి
కరీంనగర్ (ఈనాడు), జమ్మికుంట, హుజూరాబాద్, గ్రామీణం, పట్టణం (న్యూస్టుడే) : ‘ప్రతి ఇంటికి వెళ్లండి.. చేసిన ప్రగతిని చెప్పండి.. కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావుకు లక్ష ఓట్ల ఆధిక్యతను అందించాలి’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మంగళవారం హుజూరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంటలో నిర్వహించిన జనజాతర బహిరంగ సభకు సీఎం హాజరవడం హస్తం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. సీఎం హోదాలో తొలిసారి రేవంత్రెడ్డి రావడంతో నాయకులు, కార్యకర్తలు సభను విజయవంతం చేసేందుకు శ్రమించారు. ఎండలు మండుతుండటంతో జనాల తరలింపుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. జమ్మికుంటలో దారి పొడుగునా స్వాగత తోరణాలతోపాటు పెద్దఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. సభాస్థలిలో భారీ కటౌట్లు ప్రత్యేకాకర్షణగా నిలిచాయి.
సభకు హాజరైన జనం
సైడ్లైట్స్
- హెలికాప్టర్లో జమ్మికుంటకు వచ్చిన సీఎం సభా వేదికపైకి సాయంత్రం 4 గంటలకు వచ్చారు.
- నియోజకవర్గ ఇన్ఛార్జి వొడితల ప్రణవ్తోపాటు వేదికపై ఉన్నవారు సీఎంకు కండువాలు కప్పారు.
- సీపీఐ, సీపీఎం నాయకులు, మహిళా కాంగ్రెస్ నేతలు సీఎంకు పుష్పగుచ్ఛాలనిచ్చారు.
- బిజిగిరిషరీఫ్ దర్గా, ఇల్లందకుంట సీతారామాలయాల అభివృద్ధికి నిధులివ్వాలని ప్రణవ్ సీఎంని కోరారు.
- స్థానిక ఎమ్మెల్యే అనుచరులు కబ్జాలకు పాల్పడుతున్నారని సమ్మిరెడ్డి వినతిని అందించారు.
- కనుగులకు చెందిన న్యాయవాది సంజీవరెడ్డి సీఎం సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
- మానకొండూర్ ఎమ్మెల్యేగా కవ్వంపల్లి సత్యనారాయణ బదులుగా ఆరెపల్లి మోహన్ అని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొనడంతో సభికులు ఆశ్చర్యపోయారు.
చేసిన అభివృద్ధిని చెప్పి ఓట్లడగండి
భాజపా అభ్యర్థి బండి సంజయ్ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని చెప్పి ఓట్లు అడగాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. తాను ఎంపీగా ఉన్న సమయంలోనే అభివృద్ధి జరిగిందన్నారు. భార్య పుస్తెల తాడును అమ్మి ఎన్నికల్లో గెలిచానని చెప్పిన సంజయ్కు కోట్లాది రూపాయలు ఎలా వచ్చాయో చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టిన నాయకుడు రేవంత్రెడ్డి అని కొనియాడారు. భాజపా పదేళ్ల పాలనలో సామాన్యుడికి ఒరిగిందేమీ లేదన్నారు. మోదీ పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకాయన్నారు. బండి సంజయ్ను ఓడించి తనను గెలిపించాలని ప్రజలను ఆయన కోరారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ను గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, నాయకులు కేకే మహేందర్రెడ్డి, ఆరెపల్లి మోహన్, సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి, సీపీఎం జిల్లా క్యారదర్శి వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పత్తి విత్తనాలకు కృత్రిమ కొరత!
[ 22-05-2024]
పత్తి విత్తనాల కృత్రిమ కొరత కర్షకులను ఆగం చేస్తోంది.. వ్యాపారుల ఇష్టారాజ్యం రైతుల జేబుకు చిల్లు పెడుతోంది.. సాధారణ ధరలకు పత్తి విత్తనాలు లభించే పరిస్థితే కనిపించడం లేదు. -
ఇంటర్ ప్రవేశాలకు వేళాయె
[ 22-05-2024]
వచ్చే విద్యాసంవత్సరంలో జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలు పెంచేందుకు అధికారులు కార్యాచరణ చేపట్టారు. -
వలస జీవులకు రైతన్న అండ!
[ 22-05-2024]
ఒకప్పటి కరవు నేల సాగునీటి ప్రాజెక్టులతో కోనసీమగా మారింది. తెలంగాణకే ధాన్యాగారంగా మారిన జిల్లాలో వరిధాన్యం సిరులు కురిపిస్తోంది. -
మళ్లీ.. ఇన్ఛార్జి వీసీ
[ 22-05-2024]
శాతవాహన విశ్వవిద్యాలయ ఇన్ఛార్జి వీసీ (వైస్ ఛాన్స్లర్)గా సురేంద్ర మోహన్ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. దీంతో మరోమారు ఇన్ఛార్జి పర్యవేక్షణ కొనసాగనుంది. -
చెరువు మట్టి.. చేనుకు పుష్టి
[ 22-05-2024]
జిల్లాలో రైతులు చెరువుల్లో పూడికమట్టిని తోటలు, పొలాలకు పెద్దఎత్తున తరలిస్తున్నారు. -
వైభవంగా నారసింహుడి జయంతి ఉత్సవాలు
[ 22-05-2024]
ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో మంగళవారం రాత్రి స్తంభోద్భవ సమయంలో శ్రీ నృసింహ జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. -
విడుదలకు ఉత్తర్వులు... అందని ప్రోత్సాహకాలు
[ 22-05-2024]
ప్రభుత్వ ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో వసతులను మెరుగుపరుస్తూ ప్రజలకు కార్పొరేట్ తరహా వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో దేశవ్యాప్తంగా జాతీయ ఆరోగ్య మిషన్ ఆధ్వర్యంలో ఎన్క్వాస్(నేషనల్ క్వాలిటీ అష్యూరెన్సు స్టాండర్డ్స్) పోటీలను 2013 నుంచి నిర్వహిస్తోంది. -
రైతుల కల నెరవేరేదెన్నడో..?
[ 22-05-2024]
మెట్ట ప్రాంతమైన రాజన్న సిరిసిల్ల జిల్లాలో గొట్టపుబావులు, బావులే వ్యవసాయానికి ప్రధాన ఆధారం. సాగునీటి కొరత నెలకొనడం ఈ ప్రాంతంలో సర్వసాధారణం. -
ఏళ్ల తరబడి అపరిష్కృతం
[ 22-05-2024]
ఎన్నికల ప్రచారంలో నాయకులు రాష్ట్ర, జాతీయ సమస్యలకే ప్రాధాన్యం ఇస్తుండటంతో స్థానిక అవసరాలు తీరడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గ పరిధిలో పలు సమస్యలు ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉంటున్నాయి. -
మానేరులో ఇసుక తవ్వకాలపై ఎన్జీటీ కొరడా!
[ 22-05-2024]
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మానేరు నది పరీవాహక ప్రాంతాల్లో పర్యావరణ అనుమతి (ఈసీ) లేకుండా నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఇసుక తవ్వకాలపై జాతీయ హరిత ట్రెబ్యునల్ (ఎన్జీటీ) కొరడా ఝళిపించింది. -
100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తే లక్ష్యం
[ 22-05-2024]
2029-30 ఆర్థిక సంవత్సరం నాటికి 100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించే విధంగా ఇప్పటి నుంచే ప్రణాళికలు చేసుకోవాలని సింగరేణి సంచాలకులు వెల్లడించారు. -
దోస్త్ యాప్తో దరఖాస్తు సులభతరం
[ 22-05-2024]
డిగ్రీ ప్రవేశాల కోసం ‘డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ’(దోస్త్) విధానాన్ని పాటిస్తున్న విషయం విదితమే. దోస్త్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. -
మట్టి పెళ్లలు పడి ఉపాధి కూలీ మృతి
[ 22-05-2024]
కుటుంబ పోషణకోసం ఉపాధి పనులకు వెళ్లిన కూలీలను దురదృష్టం వెంటాడింది. పని చేస్తున్న ప్రదేశంలో సేదతీరుతున్న తరుణంలో మట్టి పెళ్లలు కూలీల మీద పడటంతో ఒకరు మృతిచెందగా ఆరుగురికి గాయాలయ్యాయి. -
రైతుల బిడ్డలు.. ప్రథమ ర్యాంకులు
[ 22-05-2024]
శంకరపట్నం మండలం కరీంపేట్కు చెందిన విద్యార్థిని మేడిశెట్టి నవ్యశ్రీ సోమవారం వెలువరించిన ఈసెట్ ఫలితాల్లో సత్తా చాటింది.
తాజా వార్తలు (Latest News)
-
ఎక్స్లో పూర్తి నిడివి సినిమాలు
-
గొంతుపై కాలుతో తొక్కి.. భార్య ప్రాణం తీసిన భర్త
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
ఐపీఎల్లో ‘ఎలిమినేట్’ అయ్యేదెవరు? ‘రాయల్’గా ముందుకెళ్లేదెవరు?
-
5 నిమిషాల్లో 6 వేల అడుగుల కిందకి.. సింగపూర్ విమానంలో భయానక దృశ్యాలు
-
సీబీఐలో లంచాధికారులు.. ఒక్కో కాలేజీ నుంచి రూ.2-10లక్షలు వసూలు