రైతుల చెంతకు రాజన్న కోడెలు
దక్షిణకాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామికి భక్తులు సమర్పించే కోడెలను అర్హులైన రైతులకు ఉచితంగా అందించేందుకు ఆలయ అధికారులు కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు.
కార్యాచరణ రూపొందిస్తున్న ఆలయ అధికారులు
తిప్పాపూర్లోని రాజన్న గోశాలలో కోడెలు
న్యూస్టుడే, వేములవాడ: దక్షిణకాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామికి భక్తులు సమర్పించే కోడెలను అర్హులైన రైతులకు ఉచితంగా అందించేందుకు ఆలయ అధికారులు కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఈ విషయమై ఆలయ అధికారులు దేవాదాయశాఖ కమిషనర్కు ప్రతిపాదనలు పంపారు. ఇందుకు సంబంధించిన నియమ నిబంధనలను ఆలయ అధికారులు రూపకల్పన చేస్తున్నారు.
రాజన్న ఆలయం కోడె మొక్కులకు ప్రసిద్ధి. స్వామివారిని దర్శించుకున్న భక్తుల్లో ఎక్కువ మంది కోడె మొక్కులు చెలించుకుంటారు. కొందరు ఇంటి వద్ద పెంచినవి, ఇతరుల వద్ద కొనుగోలు చేసిన కోడెలను స్వామివారికి సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. వీటిని ఆలయానికి చెందిన తిప్పాపూర్ గోశాలలో సిబ్బంది సంరక్షిస్తుంటారు. ప్రస్తుతం గోశాలలో వేయికి పైగా కోడెలు, ఆవులున్నాయి. జనవరికి ముందు ఈ గోశాల నుంచి రాష్ట్రంలోని వివిధ గోశాలలకు కోడెలను రాష్ట్ర గోశాల ఫెడరేషన్ ద్వారా అందజేసేవారు. ఈ గోశాల నుంచి ఇతర గోశాలలకు పంపిణీ చేస్తున్న కోడెలు పక్కదారి పడుతున్నాయనే ఆరోపణలు వచ్చాయి. జనవరిలో మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలంలో దుబ్బతండా గోశాలకు వ్యాన్లో తరలిస్తున్న 20 కోడెలకు బదులు 24 కోడెలు ఉండటంతో అవి పక్కదారి పడుతున్నాయనేది స్పష్టమైంది. అప్పటి నుంచి రాజన్న కోడెలను అర్హులైన రైతులకు అందించాలనే డిమాండ్ ప్రజల నుంచి వచ్చింది. మరోవైపు రాజన్న గోశాల నుంచి ఇతర గోశాలలకు కోడెలను అందజేసే కార్యక్రమాన్ని ఆలయ అధికారులు నిలిపివేశారు. దీంతో గోశాలలో కోడెల సంఖ్య భారీగా పెరిగిపోయింది. దీంతో మేత, వసతి, వైద్యం వంటివి పూర్తి స్థాయిలో అందక చాలా వరకు బక్కచిక్కిపోయాయి. కొన్ని అనారోగ్యంతో మృతి చెందిన సంఘటనలు ఉన్నాయి. ఇటీవల దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతురావు గోశాలలను పరిశీలించి వాటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆలయ అధికారులను ఆదేశించడంతో ప్రత్యేక చర్యలకు అధికారులు ఉపక్రమించారు.
అధికారులతో కమిటీ ఏర్పాటు
భక్తులు రాజన్నకు సమర్పించిన కోడెలను అర్హులైన రైతులు, ఇతర గోశాలలకు పంపిణీ చేసేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఇందులో రెవెన్యూ, పోలీస్, పశు సంవర్థకశాఖ, ఆలయ అధికారితో ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించి అర్హులైన వారికి పంపిణీ చేసేందుకు ఈ కమిటీ రైతుకు సంబంధించిన పూర్తి వివరాలను క్షేత్ర స్థాయిలో సేకరించనుంది. తరవాత అర్హులైన వారిని గుర్తించి ఎంపిక చేసిన రైతుల ఆధార్ కార్డు, సంతకాలు సేకరించిన తరవాత కోడెలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు విక్రయించకుండా ఒప్పందం పూర్తి చేసిన తరవాత అందజేయనున్నారు. పంపిణీ చేసే ప్రతి కోడెకు ట్యాగ్ తప్పనిసరిగా అమర్చి రైతులకు పంపిణీ చేసేందుకు కార్యాచరణను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. రైతులు తీసుకెళ్లిన తరవాత వాటి పర్యవేక్షణపై నిఘా పెట్టనున్నారు. దీంతో పాటు తక్కువ మొత్తంలో నిబంధనలకు లోబడి ఉన్న ఇతర గోశాలలకు అగ్రిమెంట్ ప్రకారం కోడెలను అందజేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. త్వరలోనే ఈ కార్యక్రమం కార్యరూపం దాల్చనుందని ఆలయ అధికారులు పేర్కొంటున్నారు.
ఆదేశాలు రాగానే...
- కృష్ణ ప్రసాద్, రాజన్న ఆలయం, వేములవాడ
దేవాదాయశాఖ కమిషనర్ నుంచి ఆదేశాలు రాగానే అర్హులైన రైతులకు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే రైతులకు ఉచితంగా కోడెలు పంపిణీకి సంబంధిత కమిషనర్కు ప్రతిపాదనలు పంపించాం. పూర్తి స్థాయిలో గైడ్లెన్స్ రాగానే పంపిణీ కార్యక్రమం జరుగుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగిత్యాల జిల్లాలో విషాదం.. అన్నదమ్ములను బలిగొన్న భూ తగాదా
[ 17-05-2024]
భూ తగాదాల నేపథ్యంలో జరిగిన గొడవ ఓ కుటుంబంలో విషాదం నింపింది. -
ఇక ‘స్థానికం’!
[ 17-05-2024]
లోక్సభ ఎన్నికల్లో ఓటర్ల తీర్పు ఈవీఎంలో పదిలమైందో లేదో.. అటు నాయకులు, ఇటు అధికారులు స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారిస్తున్నారు. -
పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక చర్యలు
[ 17-05-2024]
వర్షాకాలంలో దోమలతో మలేరియా, టైఫాయిడ్, విషజ్వరాలు, సీజనల్ వ్యాధులతో ప్రజలు అనారోగ్యాల బారిన పడుతుంటారు. దీనికి కారణం పారిశుద్ధ్యం లోపించడం, తాగునీరు కలుషితం కావడం. -
కళల మెరుపులు.. నైపుణ్యానికి మెరుగులు
[ 17-05-2024]
కరీంనగర్ బాలభవన్ వేసవి శిక్షణ శిబిరం సందడిగా మారింది. గతంతో పోల్చితే ఈసారి అధిక మంది శిక్షణ పొందుతున్నారు. పిల్లలంతా స్వేచ్ఛగా తమకు నచ్చిన అంశాలు నేర్చుకుంటున్నారు. -
హామీల అమల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
[ 17-05-2024]
రాష్ట్రంలో రైతులను మోసం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగిస్తోందని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ గురువారం చొప్పదండిలో భారాస నేతలతో కలిసి నిరసన తెలియజేసి మాట్లాడారు. -
ఉప కులపతిగా అవకాశం దక్కేదెవరికో?
[ 17-05-2024]
రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల ఉపకులపతుల పదవీకాలం ఈనెల 21తో ముగియనుండంతో నియామక ప్రక్రియ చేపట్టేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. -
ఓట్ల పండుగ.. ఆర్టీసీకి ఆదాయం దండిగా!
[ 17-05-2024]
లోక్సభ ఎన్నికలు.. వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో అధిక మంది వారివారి స్వస్థలాలకు బయలుదేరారు. పిల్లలకు కూడా వేసవి సెలవులు కావడంతో తమ ప్రాంతాలకు వెళ్లడానికి ఆసక్తి చూపారు. -
నారసింహుడి కోవెలలో నగదు రహిత సేవలకు శ్రీకారం
[ 17-05-2024]
దేవాదాయశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో నగదు రహిత సేవలకు శ్రీకారం చుట్టారు. -
పెరిగిన గడువు.. అవకాశం మెరుగు
[ 17-05-2024]
సింగరేణిలో ఉద్యోగ నియామకాలకు మరి కొంత మంది దరఖాస్తు చేసుకునే అవకాశం ఏర్పడింది. మే 4 వరకు దరఖాస్తులకు చివరి గడువు విధించిన యాజమాన్యం తాజాగా జూన్ 4 వరకు పెంచింది. -
అకాల వర్షాలతో అన్నదాతల్లో ఆందోళన
[ 17-05-2024]
అకాల వర్షాలు, ఈదురు గాలులు అన్నదాతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. జిల్లాలో గురువారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. -
‘పల్లె’వించిన చైతన్యం..
[ 17-05-2024]
ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగంలో పల్లెలు స్ఫూర్తి చాటాయి. నగర వాసుల కంటే గ్రామీణ ఓటర్లు ఆదర్శంగా నిలిచారు. -
సహజ వనరులను కొల్లగొడుతున్నారు
[ 17-05-2024]
ఇసుక, మట్టి అక్రమ రవాణాతో జిల్లాలోని సహజవనరులను అక్రమార్కులు ధ్వంసం చేస్తున్నారు. మానేరు వాగు నుంచి ఇసుక రవాణాపై చెన్నైలోని జాతీయ హరిత ట్రైబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను అధికారులు గాలికి వదిలేయడంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. -
అనుసంధాన మార్గం పూర్తయ్యేనా!
[ 17-05-2024]
నిత్యం రద్దీగా ఉండే గ్రామాలతో రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి అనుసంధానంగా ఉన్న ప్రధాన రహదారి నిర్మాణం ఆది నుంచీ నిర్లక్ష్యానికి గురవుతోంది.నిత్యం రద్దీగా ఉండే గ్రామాలతో రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి అనుసంధానంగా ఉన్న ప్రధాన రహదారి నిర్మాణం ఆది నుంచీ నిర్లక్ష్యానికి గురవుతోంది. -
ప్రారంభించారు... తాళం వేశారు
[ 17-05-2024]
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం ఆరోగ్య ఉప కేంద్రాలకు నూతన భవనాలు నిర్మించింది. రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన భవనాలను పాలకులు ఆర్భాటంగా ప్రారంభించారు. -
రూ.500 బోనస్ ఇవ్వాల్సిందే
[ 17-05-2024]
పార్లమెంటు ఎన్నికల తర్వాత ధాన్యానికి క్వింటాల్కు రూ.500 బోనస్ చెల్లిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే బోనస్ చెల్లిస్తామనడం రైతాంగాన్ని మరోసారి మోసం చేయడమేనని భారాస జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పేర్కొన్నారు. -
ముందుకు సాగని ఆలయ విస్తరణ పనులు
[ 17-05-2024]
దక్షిణకాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి అనుబంధ ఆలయమైన శ్రీబద్దిపోచమ్మ ఆలయ విస్తరణ పనులు ముందుకు సాగడం లేదు. -
లైసెన్స్ లేకుండా మందులు విక్రయించిన వ్యక్తికి ఏడాది జైలు
[ 17-05-2024]
లైసెన్స్ లేకుండా అల్లోపతి మందులు నిల్వచేయడంతోపాటు అమ్మకాలు చేపట్టిన ఓ వ్యక్తికి కోరుట్ల న్యాయస్థానం ఏడాది జైలు శిక్షతోపాటు రూ.50 వేల జరిమానా విధించింది. -
ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఎక్కడంటే...!
[ 17-05-2024]
రాష్ట్రంలోని లోక్సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఎన్నికల సంఘం ఖరారు చేసింది. 17 స్థానాలకు సోమవారం పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. -
రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి
[ 17-05-2024]
పెద్దపల్లిలోని రైల్వేస్టేషన్లో రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందినట్లు రామగుండం జీఆర్పీ హెడ్కానిస్టేబుల్ తిరుపతి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
జగిత్యాల జిల్లాలో విషాదం.. అన్నదమ్ములను బలిగొన్న భూ తగాదా
-
బెంగళూరు గెలిచినా.. చెన్నైకే ‘ప్లే ఆఫ్స్’ ఛాన్స్.. అదెలాగంటే?
-
స్టాక్ మార్కెట్లలో కొనసాగిన లాభాలు
-
అజ్ఞాతంలోకి మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరులు
-
వైకాపా నేతల నుంచి ప్రాణహాని.. రక్షణ కల్పించాలని ఎస్పీని కోరిన సుధాకర్
-
స్టార్లు ఉన్నంత మాత్రాన సినిమా హిట్టవుతుందని చెప్పలేం: సెహ్వాగ్