logo

బండి సంజయ్ గెలిస్తే సామాన్యుడు గెలిచినట్లే

జమ్మికుంటలో భారతీయ జనతా మోర్చా ఆధ్వర్యంలో యువ సమ్మెళనం నిర్వహించారు.

Updated : 06 May 2024 17:08 IST

జమ్మికుంట: జమ్మికుంటలో భారతీయ జనతా మోర్చా ఆధ్వర్యంలో యువ సమ్మెళనం నిర్వహించారు. తమిళనాడు భాజపా అధ్యక్షుడు అన్నామలై మాట్లాడుతూ.. బండి సంజయ్ పోరాటాలను, నాయకత్వాన్ని కొనియాడారు. ప్రధాని మోదీ గుండెలో బండి సంజయ్‌కు ప్రత్యేక స్థానం ఉందన్నారు. దక్షిణ భారత దేశంలో భాజపాను బలోపేతం చేసేందుకు బండి సంజయ్‌కు జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారని చెప్పారు. బండి సంజయ్ చేసిన పోరాటాలు దేశానికే ఆదర్శమయ్యాయన్నారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ.. భారతదేశ సింగమలై మన అన్నామలై అత్యున్నతమైన ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి భాజపాలో చేరి ప్రజాసమస్యలపై యుద్దం చేస్తున్న నేత అని పేర్కొన్నారు. నిరంతరం పాదయాత్ర చేస్తూ కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా ఉన్న నాయకుడని, తమిళనాడులో భాజపా శక్తివంతంగా తయారు కావడంలో అన్నామలై కీలక పాత్ర పోషించారన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని