కల్యాణ వేదిక.. శ్మశాన మౌనం
మరికొన్ని గంటలు గడిస్తే.. అక్కడ కల్యాణ వైభోగమే! విధి వారిపై చిన్నచూపుచూసింది. శుక్రవారం సాయంత్రం నిర్వహించిన రిసెప్షన్కు సింగారించిన మల్లెలు ఇంకా తాజాగా ఉండగానే అవి శాశ్వతంగా వాడిపోయేలా పెళ్లి నిలిచిపోయింది.
ఆత్మీయుల మృతితో శోకసంద్రం
తొమ్మిది మందిని పొట్టన పెట్టుకుని శిథిలమై మిగిలిన జీపు ఇదే
ప్రమాదంలో సన్నిహితులను, ఆత్మీయులను కోల్పోయిన వరుడు మంజునాథ్ తీవ్రంగా కుంగిపోయారు. ధార్వాడ సమీపంలోని నిగది గ్రామంలో ఆయన ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రమాదం గురించి ఆయన నోట మాట పెగల్లేదు క్షతగాత్రులు చికిత్స పొందుతున్న కిమ్స్ ఆసుపత్రి ప్రాంగణం బంధువుల రోదనలతో హృదయ విదారకంగా మారింది.
ధార్వాడ జిల్లా పోలీసు అధికారి కృష్ణకాంత్ ఇతర ఉన్నతాధికారులు దుర్ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంత్రి శంకర పాటీల మునేనకొప్ప పరామర్శించారు.
అతివేగం వద్దని వారించాను. శరవేగంగా వెళ్లడం మంచిది కాదని తాను డ్రైవర్ను వారించినట్లు వాహనంలో మూడో వరుసలో కూర్చున్న మహాదేవి హులమని అనే బంధువు తెలిపారు. తాను ఎన్నిసార్లు హెచ్చరించినా డ్రైవర్ వినలేదని వాపోయారు. భీకర శబ్దం వినిపించిందని.. ఆపై ఏమి జరిగిందో తనకు తెలియదన్నారు. స్పృహ వచ్చేసరికి ఆసుపత్రిలో ఉన్నానని వివరించారు.
వరుడు మంజునాథ్ మాట్లాడుతూ రిసెప్షన్కు తమ గ్రామం నుంచి వివిధ వాహనాల్లో 40 మంది బంధువులు వెళ్లామని, అనుకోని దుర్ఘటన సంభవించి తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారని కన్నీరు మున్నీరయ్యారు. తాము ముందు బయలుదేరిన వాహనంలో క్షేమంగా ప్రయాణించినట్లు చెప్పారు. ప్రమాదం జరిగిందని తెలుసుకుని బాడ గ్రామానికి వెళ్తే ఆ ప్రాంతమంతా తమవారి శవాలు కనిపించాయని వాపోయారు.
ధార్వాడ తాలూకా బాడ గ్రామం వద్ద క్రూసర్ జీపు చెట్టును
ఢీకొనడంతో గాయపడిన వారికి హుబ్బళ్లి ఆస్పత్రిలో వైద్యసేవలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్