ఫిబ్రవరిలో ఆనెగుంది ఉత్సవం
ఆనెగుంది ఉత్సవాలను ఫిబ్రవరిలో నిర్వహించనున్నట్లు గంగావతి శాసనసభ్యుడు పరణ్న మునవళ్ళి తెలిపారు
తిరుమలాపురలో సముదాయ భవనానికి శంకుస్థాపన చేస్తున్న శాసనసభ్యుడు పరణ్ణ
గంగావతి,న్యూస్టుడే: ఆనెగుంది ఉత్సవాలను ఫిబ్రవరిలో నిర్వహించనున్నట్లు గంగావతి శాసనసభ్యుడు పరణ్న మునవళ్ళి తెలిపారు. ఆయన శుక్రవారం తిరుమలాపురలో రూ.5లక్షలతో నిర్మిస్తున్న సముదాయ భవనానికి శంకుస్థాపన చేసి మాట్లాడారు. హంపీ ఉత్సవాల అనంతరం ఆనెగుంది ఉత్సవం నిర్వహించాలని తీర్మానించినట్లు చెప్పారు. అంజనాద్రి రహదారి వెడల్పు పనులకు ప్రభుత్వం రూ.246కోట్లు మంజూరు చేసిందన్నారు. హిట్నాళ క్రాస్ నుంచి గంగావతి సాయిబాబా ఆలయం దాకా రెండు వరుసల రహదారిని నిర్మిస్తారన్నారు. కరెమ్మగడ్డ, విరుపాపురగడ్డ వాసులకు త్వరలో హక్కుపత్రాలు ఇవ్వనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ సభ్యుడు సిద్దరామస్వామి, న్యాయవాది హనుమేశ్ యాదవ్, హనుమంతయ్య, గాంధిబాబు, పంచాయితీ అధ్యక్షురాలు దురుగమ్మ, ఉపాధ్యక్షుడు షేర్ఖాన్, సభ్యులు సంతోషమ్మ నాగేశ్ పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Zelensky: ‘జెలెన్స్కీని చంపబోమని పుతిన్ హామీ ఇచ్చారు!’
-
India News
American Airlines: సాయం కోరినందుకు క్యాన్సర్ రోగిని విమానం నుంచి దించేసిన సిబ్బంది!
-
Sports News
Cheteshwar Pujara: నా కెరీర్లో అత్యుత్తమ సిరీస్ అదే: ఛెతేశ్వర్ పుజారా
-
Crime News
Cyber Crime: ఈ-కామర్స్ ఓటీపీ పేరుతో కొత్త పంథాలో సైబర్ మోసం!
-
Movies News
Social Look: వేదిక అలా.. మౌనీరాయ్ ఇలా.. శ్రద్ధాకపూర్?
-
General News
Anand Mahindra: కంపెనీలు ఇలాంటి ఉత్పత్తులను తయారు చేయాలి!