ఫిబ్రవరిలో ఆనెగుంది ఉత్సవం
ఆనెగుంది ఉత్సవాలను ఫిబ్రవరిలో నిర్వహించనున్నట్లు గంగావతి శాసనసభ్యుడు పరణ్న మునవళ్ళి తెలిపారు
తిరుమలాపురలో సముదాయ భవనానికి శంకుస్థాపన చేస్తున్న శాసనసభ్యుడు పరణ్ణ
గంగావతి,న్యూస్టుడే: ఆనెగుంది ఉత్సవాలను ఫిబ్రవరిలో నిర్వహించనున్నట్లు గంగావతి శాసనసభ్యుడు పరణ్న మునవళ్ళి తెలిపారు. ఆయన శుక్రవారం తిరుమలాపురలో రూ.5లక్షలతో నిర్మిస్తున్న సముదాయ భవనానికి శంకుస్థాపన చేసి మాట్లాడారు. హంపీ ఉత్సవాల అనంతరం ఆనెగుంది ఉత్సవం నిర్వహించాలని తీర్మానించినట్లు చెప్పారు. అంజనాద్రి రహదారి వెడల్పు పనులకు ప్రభుత్వం రూ.246కోట్లు మంజూరు చేసిందన్నారు. హిట్నాళ క్రాస్ నుంచి గంగావతి సాయిబాబా ఆలయం దాకా రెండు వరుసల రహదారిని నిర్మిస్తారన్నారు. కరెమ్మగడ్డ, విరుపాపురగడ్డ వాసులకు త్వరలో హక్కుపత్రాలు ఇవ్వనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ సభ్యుడు సిద్దరామస్వామి, న్యాయవాది హనుమేశ్ యాదవ్, హనుమంతయ్య, గాంధిబాబు, పంచాయితీ అధ్యక్షురాలు దురుగమ్మ, ఉపాధ్యక్షుడు షేర్ఖాన్, సభ్యులు సంతోషమ్మ నాగేశ్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్