దావణగెరెలో మోదీ సభ
ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన కోసం కన్నడిగుల ‘మాంచెస్టర్ నగరం’.. దావణగెరె సర్వాంగ సుందరంగా మారిపోతోంది
దావణగెరె వీధుల్లో మోదీ రాకకోసం రెపరెపలాడుతున్న కాషాయ పతాకాలు
దావణగెరె, న్యూస్టుడే : ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన కోసం కన్నడిగుల ‘మాంచెస్టర్ నగరం’.. దావణగెరె సర్వాంగ సుందరంగా మారిపోతోంది. నగర ప్రధాన వీధులన్నీ కాషాయ పతాకాల రెపరెపలతో తులతూగుతున్నాయి. మోదీ ఈ నెల 12న మైసూరు- బెంగళూరు మధ్య కొత్తగా నిర్మించిన జాతీయ రహదారిని ప్రారంభించిన విషయం తెలిసిందే. మరోసారి శనివారం రాష్ట్రానికి విచ్చేస్తున్నారు. బెంగళూరులో మహదేవపురం-కేఆర్పురం మధ్య కొత్తగా నిర్మించిన మెట్రో రైలు సేవలను ఆయన ఉదయమే ప్రారంభించి.. రైల్లో ప్రయాణిస్తూ, కొందరు ప్రయాణికులతో ముఖాముఖి మాట్లాడతారు. సత్యసాయి ఆశ్రమం నుంచి మహదేవపుర మెట్రో స్టేషన్ వరకు రోడ్షో నిర్వహిస్తారు. చిక్కబళ్లాపుర సమీపంలోని ముద్దేనహళ్లిలో కొత్తగా నిర్మించిన వైద్య కళాశాలనూ ప్రారంభిస్తారు. అక్కడి నుంచి దావణగెరెకు కదలివెళతారు. వెన్నెనగరిగా పేరొందిన ఈ వాడలో రోడ్షో నిర్వహించే ప్రధాని.. విజయ సంకల్ప రథయాత్ర ముగింపు సమావేశాలు ‘మహా సంగమ’లో పాల్గొంటారని కమలనాథులు తెలిపారు. దావణగెరెలో సమావేశాన్ని నిర్వహించే మైదానంలో పార్టీ నాయకులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. మహా సంగమకు వచ్చే వారికి ఆసనాలు, భోజన సదుపాయాలు, హోమాలను నిర్వహించేందుకు ప్రత్యేక వేదికలను పూర్తి చేశారు. ఈ నెలాఖరులోగా కేంద్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో అన్ని కార్యక్రమాలను కమలనాథులు చకచకా పూర్తి చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటరన్న దిగ్విజయ యాత్ర
[ 27-04-2024]
ప్రజాస్వామ్య పండగలో ఓటర్లు తమ బాధ్యతను విజయవంతంగా నిర్వర్తించారు. -
పోలింగ్.. శాంతియుతం
[ 27-04-2024]
చెదురుమదురు ఘటనలు మినహా 14 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ శాంతియుతంగా ముగిసింది. -
భాజపాది ఖాళీ చెంబు పార్టీ
[ 27-04-2024]
భాజపా ఖాళీ చెంబు పార్టీ. ఖాళీ చెంబుతో రాష్ట్రానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ ఓటర్లకు పిలుపునిచ్చారు. -
పెట్టుబడిదారులకే మోదీ ఊతం
[ 27-04-2024]
రైతుల రుణాలు మాఫీˆ చేయడం కన్నా, శ్రీమంతులు, పారిశ్రామికవేత్తల రుణాలను రద్దు చేయడంపైనే ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆసక్తి ఎక్కువని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విమర్శించారు. -
ప్చ్.. నగరం.. తీరు మారలేదు
[ 27-04-2024]
విద్యావంతులు అధికంగా ఉండే బెంగళూరు నగరవాసులు ఆశించిన స్థాయిలో ఓటు హక్కు వినియోగించుకోలేదు. -
సకుటుంబ సమేతంగా..!
[ 27-04-2024]
రాష్ట్రంలో తొలి విడత లోక్సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు కీలక నాయకులు తమ కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి సందడి చేయడం ఆసక్తికరంగా సాగింది. -
బౌండరీ దాటిన ఓటు బంతి!
[ 27-04-2024]
లోకసభ ఎన్నికల పోలింగ్ ఘట్టాన్ని క్రీడాకారులు ఆసక్తికరంగా మార్చారు. -
ఎందరో మహానుభావులు..
[ 27-04-2024]
ఎండ తీవ్రత పెరగకనే ఓటేయాలని బెంగళూరు వాసులు ఉత్సాహంగా కదలడం శుక్రవారం ఉదయమే కనిపించింది. -
విధి నిర్వహణలోనే తుదిశ్వాస వదిలి..
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల విధులు నిర్వహిస్తూ ఓ అధికారిణి మృతి చెందిన ఘటన చెళ్లకెర తాలూకాలో శుక్రవారం జరిగింది. -
వేర్వేరు ప్రాంతాల్లో బాలికలపై లైంగికదాడి
[ 27-04-2024]
రాష్ట్రంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు బాలికలపై లైంగిక దాడి దిగ్భ్రాంతి కలిగించింది.