logo

Hyderabad techie suicide: దారుణం.. భార్యాపిల్లలను చంపేసి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య!

ఆ ఇంటి పెద్ద ఆగ్రహం.. నలుగురి ఊపిరి ఆగిపోయేలా చేసింది. భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేసిన ఆ వ్యక్తి చివరికి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బెంగళూరు కాడుగోడి పోలీసుఠాణా పరిధిలో గురువారం వెలుగులోకి వచ్చింది.

Updated : 04 Aug 2023 18:46 IST

భార్యభర్తలు వీరాంజనేయ, హేమావతి (పాతచిత్రం)

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : ఆ ఇంటి పెద్ద ఆగ్రహం.. నలుగురి ఊపిరి ఆగిపోయేలా చేసింది. భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేసిన ఆ వ్యక్తి చివరికి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బెంగళూరు కాడుగోడి పోలీసుఠాణా పరిధిలో గురువారం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన జులై 31న చోటుచేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతులను హైదరాబాద్‌ నివాసులుగా పోలీసులు గుర్తించారు.

సీగేనహళ్లిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న వీరాంజనేయ (31), ఆయన భార్య హేమావతి (29) వారి ఇద్దరు బిడ్డలు (ఏడాదిన్నర, ఎనిమిది నెలల వయస్సు) మరణించినట్లు అధికారులు ప్రకటించారు. భార్య, పిల్లలను హత్యచేసిన ఆయన చివరికి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో వారుంటున్న అపార్ట్‌మెంట్‌ వాసులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు గురువారం తలుపులు తెరచి చూస్తే.. పడకపై ముగ్గురు, ఫ్యాన్‌కు వేలాడుతున్న వీరాంజనేయ శవాలు కనిపించాయి. మృతుడు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. హత్య, ఆత్మహత్యలకు కారణాలు తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని