ఉత్కంఠంగా విద్యావర్ధక సంఘం ఎన్నికలు
వీరశైవ విద్యావర్ధక సంఘం నూతన అధ్యక్షుడిగా అల్లం గురుబసవరాజ్, కార్యదర్శిగా అరవింద్ పాటీల్లు నాటకీయ పరిణామాల మధ్య ఎన్నికయ్యారు.
అధ్యక్షుడిగా అల్లం గురుబసవరాజ్
కార్యదర్శిగా అరవింద పాటీల్
నాటకీయ పరిణామాల మధ్య పోరు
బళ్లారి, న్యూస్టుడే : వీరశైవ విద్యావర్ధక సంఘం నూతన అధ్యక్షుడిగా అల్లం గురుబసవరాజ్, కార్యదర్శిగా అరవింద్ పాటీల్లు నాటకీయ పరిణామాల మధ్య ఎన్నికయ్యారు. పూర్తి ఆధిక్యత సాధించినా యువకుల బృందం అధ్యక్ష స్థానం కోల్పోవడంతో నిరుత్సాహానికి గురయ్యారు. వి.వి.సంఘం అధ్యక్ష, సభ్యులు ఎన్నిక బుధవారం ఉదయం గాంధీనగర్ మొదటి రహదారిలోని వి.వి.సంఘం కార్యాలయంలో నిర్వహించారు. సభ్యులు ఆశ్చర్యపోయే విధంగా సీనియర్ బృందానికి తక్కువ కార్యవర్గ సమితి సభ్యులున్నా యువకుల సంఘంలో అంతర్గత విభేదాల కారణంగా అధ్యక్ష స్థానం సీనియర్ బృందం కైవసం చేసుకొంది.
రహస్య ఓటింగ్ పద్ధతి
నగరంలోని వీరశైవ విద్యావర్ధక సంఘం కార్యాలయంలో పూర్వ అధ్యక్షుడు రామనగౌడ అధ్యక్షతన సభ్యులు ఎన్నిక ప్రారంభమైంది. ఉదయం 11గంటలకు అధ్యక్ష స్థానానికి చేతులెత్తి ఎన్నుకోవాలని యువకుల బృందం కోరింది. దీనికి సీనియర్ బృందం తిరస్కరించింది. ఇరువురి మధ్య కొంత సేపు వాగ్వాదం జరిగింది. చివరికి రహస్య ఓటింగ్ పద్ధతిలో నిర్వహించాలని తీర్మానించారు. సీనియర్ బృందం నుంచి అధ్యక్ష స్థానానికి అల్లం గురుబసవరాజ్, యువకుల బృందం నుంచి మహంతేశ్ పోటీ పడ్డారు. రహస్య ఓటింగ్ పద్ధతిలో అల్లం గురుబసరాజ్కు 17 ఓట్లు, మహంతేశ్కు 12 ఓట్లు పడ్డాయి. ఉపాధ్యక్ష ప్థానం జానెకుంటె బసవరాజ్కు 16 ఓట్లు, యువకుల బృందం నుంచి ఉపాధ్యక్ష స్థానానికి పోటీ చేసిన సాహుకార్ సతీశ్బాబుకు 13 ఓట్లు పడ్డాయి.ఉపాధ్యక్షుడు జానెకుంటె బసవరాజ్ ఎన్నికయ్యారు. కార్యదర్శిగా సీనియర్ బృందం నుంచి పోటి చేసిన డా.అరవింద్ పాటీల్కు 16 ఓట్లు, యువకుల బృందం నుంచి రుద్రగౌడకు 13 ఓట్లు దక్కాయి. సహాయ కార్యదర్శి పంపనగౌడ, సీనియర్ బృందం నుంచి క్యాత్యాయిని మరిదేవయ్య పోటీ పడగా, పంపనగౌడ ఎన్నికయ్యారు. కోశాధికారి బైలువద్దిగేరి ఎర్రిస్వామి ఎంపికయ్యారు.
నిరుత్సాహంలో యువకుల బృందం
మూడేళ్ల తర్వాత వి.వి.సంఘం కార్యవర్గ సమితి సభ్యులు ఎన్నిక జరిగింది. మొత్తం 30 మంది కార్యవర్గ సభ్యులు ఎన్నిక కావల్సి ఉండగా, యువకుల బృందానికి 16, సీనియర్ బృందానికి 13, ఒకరు స్వతంత్రులుగా గెలుపొందారు. అధికారం కోసం యువకుల బృందంలో అంతర్గత విభేదాలు వచ్చాయి.ఆ బృందంలో అత్యధిక ఓట్లు సాధించిన భాగ్యలక్ష్మి, మహంతేశ్ అధ్యక్ష స్థానానికి పోటీ పడ్డారు. దీంతో వారి మధ్య అంతర్గత విభేదాలు వచ్చాయి. సీనియర్ బృందం సభ్యులు అధ్యక్ష, కార్యదర్శి తదితర స్థానాలు కైసవం చేసుకున్నారు. సీనియర్ బృందం నుంచి గెలుపొందడంతో సంబరాలు చేశారు. ఈ బృందంలో ప్రముఖ న్యాయవాది ఉడేద బసవరాజ్, ప్రభుస్వామి, ఎర్రిస్వామి బూదిహళ్ మఠ, ఎన్.వీరభద్రగౌడ, ప్యాట్యాల్ బసవరాజ్, యల్లనగౌడ శంకరబండ, ప్రతాపగౌడ, రూపనగుడి బసవరాజ్ తదితరులు ఉన్నారు. వి.వి.సంఘం కార్యవర్గ సమితిలో అత్యధిక ఓట్లు సాధించిన భాగ్యలక్ష్మి అధ్యక్ష స్థానం కోల్పోవడంతో నిరుత్సాహానికి గురయ్యారు. కార్యవర్గ సమితి స్థానానికి రాజీనామా చేయగా, ఆ రాజీనామా పత్రాన్ని అధ్యక్షుడు ఆమోదించలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటరన్న దిగ్విజయ యాత్ర
[ 27-04-2024]
ప్రజాస్వామ్య పండగలో ఓటర్లు తమ బాధ్యతను విజయవంతంగా నిర్వర్తించారు. -
పోలింగ్.. శాంతియుతం
[ 27-04-2024]
చెదురుమదురు ఘటనలు మినహా 14 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ శాంతియుతంగా ముగిసింది. -
భాజపాది ఖాళీ చెంబు పార్టీ
[ 27-04-2024]
భాజపా ఖాళీ చెంబు పార్టీ. ఖాళీ చెంబుతో రాష్ట్రానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ ఓటర్లకు పిలుపునిచ్చారు. -
పెట్టుబడిదారులకే మోదీ ఊతం
[ 27-04-2024]
రైతుల రుణాలు మాఫీˆ చేయడం కన్నా, శ్రీమంతులు, పారిశ్రామికవేత్తల రుణాలను రద్దు చేయడంపైనే ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆసక్తి ఎక్కువని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విమర్శించారు. -
ప్చ్.. నగరం.. తీరు మారలేదు
[ 27-04-2024]
విద్యావంతులు అధికంగా ఉండే బెంగళూరు నగరవాసులు ఆశించిన స్థాయిలో ఓటు హక్కు వినియోగించుకోలేదు. -
సకుటుంబ సమేతంగా..!
[ 27-04-2024]
రాష్ట్రంలో తొలి విడత లోక్సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు కీలక నాయకులు తమ కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి సందడి చేయడం ఆసక్తికరంగా సాగింది. -
బౌండరీ దాటిన ఓటు బంతి!
[ 27-04-2024]
లోకసభ ఎన్నికల పోలింగ్ ఘట్టాన్ని క్రీడాకారులు ఆసక్తికరంగా మార్చారు. -
ఎందరో మహానుభావులు..
[ 27-04-2024]
ఎండ తీవ్రత పెరగకనే ఓటేయాలని బెంగళూరు వాసులు ఉత్సాహంగా కదలడం శుక్రవారం ఉదయమే కనిపించింది. -
విధి నిర్వహణలోనే తుదిశ్వాస వదిలి..
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల విధులు నిర్వహిస్తూ ఓ అధికారిణి మృతి చెందిన ఘటన చెళ్లకెర తాలూకాలో శుక్రవారం జరిగింది. -
వేర్వేరు ప్రాంతాల్లో బాలికలపై లైంగికదాడి
[ 27-04-2024]
రాష్ట్రంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు బాలికలపై లైంగిక దాడి దిగ్భ్రాంతి కలిగించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఐదు రోజులుగా టీవీ నటుడు మిస్సింగ్.. కిడ్నాప్ అనుమానాలు..!
-
ఓటీటీలోకి ‘మంజుమ్మల్ బాయ్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్