logo

మంత్రి మల్లికార్జున ప్రచారం

బోవి గురుపీఠాన్ని సందర్శించిన రాష్ట్ర మంత్రి ఎస్‌ఎస్‌ మల్లికార్జున వివిధ పీఠాధిపతులను కలిసి లోక్‌సభ ఎన్నికల్లో దావణగెరె కాంగ్రెస్‌ అభ్యర్థి డా.ప్రభ మల్లికార్జునకు మద్దతు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

Published : 18 Apr 2024 02:45 IST

బోవి గురుపీఠాన్ని సందర్శించిన మంత్రి ఎస్‌.ఎస్‌.మల్లికార్జునను సత్కరించిన ఆధ్యాత్మిక గురువులు

చెళ్లకెర (చిత్రదుర్గం), న్యూస్‌టుడే: బోవి గురుపీఠాన్ని సందర్శించిన రాష్ట్ర మంత్రి ఎస్‌ఎస్‌ మల్లికార్జున వివిధ పీఠాధిపతులను కలిసి లోక్‌సభ ఎన్నికల్లో దావణగెరె కాంగ్రెస్‌ అభ్యర్థి డా.ప్రభ మల్లికార్జునకు మద్దతు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. బుధవారం పట్టణంలోని బోవి గురుపీఠంలో వెనుకబడిన వర్గాల జాతుల 12 మఠాలకు చెందిన ఆధ్యాత్మిక గురువులను కలిసి చర్చించారు. సభలో బోవి గురుపీఠాధిపతి ఇమ్మది సిద్ధరామ స్వామి, కుంచిటిగ పీఠాధిపతి డా.శాంతవీరస్వామి, వాల్మీకి పీఠాధిపతి వాల్మీకి ప్రసన్నానందస్వామి, భగీరథ పీఠాధిపతి పురుషోత్తమానందపురిస్వామి, యాదవ గురుపీఠాధిపతి శ్రీ కృష్ణ యాదవానందస్వామి, రజకుల గురుపీఠాధిపతి బసవ మాచిదేవ స్వామి ఈడిగ గురుపీఠాధిపతి రేణుకానందస్వామి, కుంబార పీఠాధిపతి బసవ కుంబార గుండయ్య స్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక గురువులు మంత్రిని సత్కరించారు. ప్రముఖులు హెచ్‌ జయణ్ణ, నాగరాజ్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని