logo

గదగలో నలుగురి దారుణ హత్య

గదగ పట్టణంలోని చెన్నమ్మ కూడలి సమీపాన దాసర వీధిలో గురువారం రాత్రి దారుణం చోటుచేసుకుంది.

Published : 20 Apr 2024 04:08 IST

కొప్పళ భాగ్యనగర్‌లో విషాదం

హత్యకు గురైన పరశురాం, లక్ష్మి, ఆకాంక్ష

గంగావతి, శివాజీనగర, న్యూస్‌టుడే : గదగ పట్టణంలోని చెన్నమ్మ కూడలి సమీపాన దాసర వీధిలో గురువారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. గదగ, బెటగేరి నగరసభ ఉపాధ్యక్షురాలు సునంద బాకళే నివాసంలో నలుగురిని గుర్తు తెలియని వ్యక్తులు మారణాయుధాలతో కిరాతకంగా హత్య చేశారు. వీరిలో కొప్పళ భాగ్యనగర్‌కు చెందిన ముగ్గురు ఉన్నారు. సునందా బాకళే కుమారుడు కార్తిక్‌(27), కొప్పళకు చెందిన పరశురాం హాదిమని(55), ఆయన భార్య లక్ష్మీ(47), కూతురు ఆకాంక్ష(17) ఉన్నారు. కార్తిక్‌ నిశ్చితార్థం కోసం ఈ కుటుంబం ఈ నెల 17న గదగ వెళ్లింది. వీరంతా మొదటి అంతస్థులో నిద్రిస్తుండగా హత్యకు గురయ్యారు. శబ్దాలు విని కుటుంబ సభ్యులు పోలీసులుకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చేలోగా హంతకులు పరారయ్యారు. గదగ జిల్లా మంత్రి హెచ్‌.కె.పాటిల్‌, ఎస్పీ బి.ఎస్‌న్యామగౌడ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. హంతకులు దోపిడీ దొంగలా? లేదా రాజకీయ కారణాలేమైనా ఉన్నాయా అన్న కోణంలో దర్యాప్తు జరుగుతోంది. కొప్పళకు పరశురాం భాజపా నేత. భాగ్యనగర్‌ పట్టణ పంచాయితీకి రెండుసార్లు పోటీ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని