అగ్రనేతల గడ్డపై ఎవరిదో విజయం?
బళ్లారి లోక్సభ నియోజకవర్గం నుంచి 1999లో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, భాజపా నుంచి ఫైర్బ్రాండ్గా ప్రత్యేక గుర్తింపు పొందిన దిల్లీ మాజీ ముఖ్యమంత్రి సుష్మాస్వరాజ్ బరిలో నిలిచారు.
సోనియాకు పట్టం కట్టిన చరిత్ర
భాజపాకు పునాది వేసిన సుష్మా
బళ్లారి, న్యూస్టుడే: బళ్లారి లోక్సభ నియోజకవర్గం నుంచి 1999లో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, భాజపా నుంచి ఫైర్బ్రాండ్గా ప్రత్యేక గుర్తింపు పొందిన దిల్లీ మాజీ ముఖ్యమంత్రి సుష్మాస్వరాజ్ బరిలో నిలిచారు. అగ్రనేతల మధ్య పోటీ బళ్లారికి ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న బళ్లారి జిల్లాలో భాజపా జెండా ఎగురవేయాలని జాతీయ స్థాయి నేతలు విశ్వ ప్రయత్నాలు చేశారు. కన్నడిగుల మనసు గెలవడానికి భాజపా అభ్యర్థి సుష్మాస్వరాజ్ కన్నడ అధ్యాపకులతో ప్రత్యేక శిక్షణ పొంది..కన్నడంలో మాట్లాడటం నేర్చుకున్నారు. సోనియాగాంధీ హిందీలోనే మాట్లాడేవారు.
తిష్టవేసిన పార్టీ నాయకత్వం
1999లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో సోనియాగాంధీ తరఫున అప్పటి కేపీసీసీ అధ్యక్షుడు ఎస్.ఎం.కృష్ణతో పాటు గులాం నబీ ఆజాద్, తదితర నేతలు బళ్లారిలోనే మకాం వేసి ప్రచారం చేశారు. అప్పట్లో ప్రియాంకాగాంధీ, వై.ఎస్.రాజశేఖర్రెడ్డి సైతం ప్రచారం చేశారు. భాజపా అభ్యర్థి సుష్మాస్వరాజ్ తరఫున అటల్ బిహారీ వాజపేయీ, ఎల్.కె.అద్వానీ, వెంకయ్యనాయుడు, ఆంధ్రప్రదేశ్ తెదేపా అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికల్లో సోనియాకు 4,14,650 ఓట్లు రాగా, సుష్మాస్వరాజ్కు 3,58,550 ఓట్లు వచ్చాయి. సుష్మాస్వరాజ్పై సోనియా 56,100 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందడమే కాకుండా జిల్లాలోని విధానసభ నియోజకవర్గాల్లో మొత్తం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. అనంతరం సోనియాగాంధీ బళ్లారి లోక్సభ స్థానానికి రాజీనామా చేసి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అమేథి పార్లమెంట్ సభ్యురాలిగా కొనసాగారు. అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కోళూరు బసవనగౌడ గెలుపొందారు.
కమల వికాసానికి సుష్మాస్వరాజ్ పునాది
నాటి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన సుష్మాస్వరాజ్ ఓడిపోయినా..బళ్లారి జిల్లాలో భాజపాకు గట్టి పునాది వేశారు. 2004 నుంచి జిల్లాను భాజపాకు కంచుకోటగా మార్చారు. ఆమెకు తోడుగా బళ్లారి రెడ్డి బ్రదర్స్, బి.శ్రీరాములు శ్రమించారు. 1991లో మొదటిసారిగా బళ్లారి లోక్సభ నియోజకవర్గం నుంచి ప్రముఖ ఇంజినీర్ కె.నాగభూషణం పోటీ చేశారు.ఈ ఎన్నికల్లో భాజపాకు కేవలం 84,837 ఓట్లు మాత్రమే వచ్చాయి. 1996లో జరిగిన ఎన్నికల్లో భాజపా అభ్యర్థిగా ప్రముఖ న్యాయవాది ఇందుశేఖర్ పోటీ చేసి 43,286 ఓట్లు సాధించారు. 1999లో సుష్మాస్వరాజ్ 3,58,550 ఓట్లు సాధించి బళ్లారి జిల్లాలో భాజపాకు పునాది వేశారు.
వికసించిన కమలం
1999లో సుష్మాస్వరాజ్ ఓటమి పాలైనా ప్రాణాలు ఉన్నంత వరకు ఏటా బళ్లారికి వరమహాలక్ష్మి వ్రతానికి వస్తానని ప్రకటించారు. దానికి అనుగుణంగా ఏటా వరమహాలక్ష్మీ వ్రతానికి రావడంతోపాటు రెడ్డి బ్రదర్స్, బి.శ్రీరాములు సామూహిక వివాహాలు చేయడం ప్రారంభించారు. భాజపా జనంలోకి వెళ్లింది. మొదటి సారిగా 2004లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో భాజపా అభ్యర్థిగా పోటీ చేసిన గాలి కరుణాకర్రెడ్డి గెలుపొందారు. 2009లో జె.శాంత కాంగ్రెస్ అభ్యర్థి ఎన్.వై.హనుమంతప్పపై 2243 ఆధిక్యతతో గెలుపొందారు. 2014లో బి.శ్రీరాములు, 2018లో ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వి.ఎస్.ఉగ్రప్ప, 2019లో భాజపా అభ్యర్థి వై.దేవేంద్రప్ప గెలుపొందారు. జిల్లాలో గ్రామ పంచాయతీ స్థాయి నుంచి లోక్సభ వరకు అభ్యర్థులను గెలిపించుకుని బళ్లారి జిల్లాను భాజపాకు కంచుకోటగా మార్చారు. ప్రస్తుతం జరిగే లోక్సభ ఎన్నికల్లో భాజపా అభ్యర్థి బి.శ్రీరాములు, కాంగ్రెస్ అభ్యర్థి ఇ.తుకారాం బరిలో నిలిచారు. ఇద్దరు మధ్య గట్టి పోటీ నెలకొంది.
1999లో జరిగిన లోక్సభ ఎన్నిక దేశంలోనే బళ్లారి లోక్సభ స్థానం ప్రత్యేక గుర్తింపు పొందింది. తాజా ఎన్నికల్లో ఈ స్థానం నుంచి బి.శ్రీరాములు, ఇ.తుకారం ప్రధాన పార్టీల నుంచి బరిలోకి దిగారు. పోటాపోటీగా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. విజయం ఎవరిని వరిస్తుందోనని సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హాసనలో మానహననం?.. ప్రజ్వల్ విచారణ దారెటు?
[ 02-05-2024]
ఎన్నికల వేళ రాష్ట్ర రాజకీయాల చూపంతా హాసనవైపు మళ్లింది. ప్రచార సంబంధంలేని వ్యవహారం.. అందరి సామాజిక మాధ్యమాలనూ ముంచెత్తుతోంది. కొందరు మహిళలతో స్థానిక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ వ్యవహరించిన తీరే చర్చకు కారణం. -
నేతల దూకుడు.. మాటల చెడుగుడు
[ 02-05-2024]
మరో నాలుగు రోజుల్లో బహిరంగ ప్రచారం ముగుస్తుండటంతో జాతీయ నేతలు ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. కొద్ది సమయంలోనే ఎక్కువ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ అభ్యర్థుల తరఫున ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. -
ఆ పాస్పోర్ట్ రద్దు చేయండి
[ 02-05-2024]
మహిళలపై లైంగిక దౌర్జన్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ రాజకీయ పాస్పోర్ట్ను రద్దు చేయాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బుధవారం ఓ లేఖ రాశారు. -
ఉమేశ్ జాదవ్కు అస్వస్థత
[ 02-05-2024]
కలబురగి-బెంగళూరు రహదారిపై బుధవారం ధర్నా చేస్తున్న సమయంలో లోక్సభ సభ్యుడు ఉమేశ్ జాదవ్ కళ్లుతిరిగి పడిపోయారు. చికిత్స కోసం ఆయనను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. -
తల్లీ, కుమారుడి సన్యాసదీక్ష
[ 02-05-2024]
రాజధాని నగరంలో ప్రముఖ వ్యాపారి మనీశ్ భార్య, కుమారుడు ఇద్దరూ జైన సన్యాస దీక్ష స్వీకరించారు. ఆయన భార్య స్వీటీ (30), కుమారుడు హృధన్ జైన్ (11)లకు జైన గురువులు దీక్ష ఇచ్చారు. -
పూర్వ గోవింద ‘కీర్తన’
[ 02-05-2024]
శ్రీరామ కోటి తరహాలో బెంగళూరుకు చెందిన కీర్తన (17) అనే బాలిక ‘గోవింద కోటి’ని రాసి తిరునగరి తిరుమలలో ఓ మెరుపు మెరిసిన వేళ.. కన్నడిగుల అభినందనలు వెల్లువెత్తాయి. -
‘సిద్ధు నాకు మద్దతిచ్చారు’
[ 02-05-2024]
శాసనసభ ఎన్నికల్లో సిద్ధరామయ్య, డి.కె.శివకుమార్ గంగావతి, బళ్లారిలో తనతో చేతులు కలిపి మద్దతు ఇచ్చారని శాసనసభ్యుడు గాలి జనార్దన్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వారు ఆ ఎన్నికల్లో ఇక్కడికి ప్రచారానికి రాలేదన్నారు. -
ఆ వ్యాఖ్యలు సలసలా ‘కాగె’
[ 02-05-2024]
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘లేకుంటే’ మరో వ్యక్తి ఆ స్థానాన్ని భర్తీ చేయలేడన్నట్లు భాజపా ప్రచారం చేసుకుంటోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజు కాగె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
పాకిస్థానీ యువత.. మోదీలాంటి నేతనే కోరుతోంది
[ 02-05-2024]
పాకిస్థానీ యువత సైతం ప్రధాని నరేంద్రమోదీ లాంటి నేతను కోరుకుంటోందని భాజపా నేత సి.టి.రవి పేర్కొన్నారు. ఆయన బుధవారం గంగావతిలో భాజపా అభ్యర్థి ప్రచారసభలో పాల్గొని మాట్లాడారు. -
విజయం.. ఓ వెన్నదోసె!
[ 02-05-2024]
దావణగెరె.. కన్నడిగుల మాంచెస్టర్ నగరిగా ఒకనాడు ప్రసిద్ధి! లెక్కకు మించిన వస్త్ర పరిశ్రమలతో.. వేలాది కార్మికులతో.. నిత్యం ఎర్రజెండాల రెపరెపలతో కళకళలాడిన నగరి నేడు ఆధునికీకరణ దిశగా అడుగులు వేసింది. ఇప్పుడు దావణగెరె పేరుచెబితే.. కన్నడిగులు లొట్టలేసుకుంటారు.
తాజా వార్తలు (Latest News)
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
-
8న ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ.. ధరల శ్రేణి ఇదే..
-
TS ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు
-
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
-
ఫొటోషూట్లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా