కనుల ముందుకు కలల లోకం
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
రామోజీ ఫిల్మ్సిటీలో సందడి షురూ
హాలిడే కార్నివాల్లో కోలాహలం
యురేకా వేదిక వద్ద కళాకారుల నృత్య ప్రదర్శన
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే : ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. సెలవు రోజుల్లో ప్రకృతి రమణీయ అందాల ఫిల్మ్సిటీలో సరదా సరదాగా గడిపేందుకు తరలివచ్చిన పర్యాటకులతో కోలాహలం గురువారం ప్రారంభమైంది. బంధుమిత్రులు, కుటుంబ సభ్యులతో కలిసి ఫిల్మ్సిటీకి తరలివచ్చిన సందర్శకులు వినోదాలను ఆస్వాదిస్తూ ఆనందతీరాలను చవిచూస్తున్నారు. సంభ్రమాశ్చర్యానికి గురిచేసేలా తొలిసారి వర్చువల్ షూట్ అనుభూతిని పర్యాటకులకు అందుబాటులో ఉంచడంతో ఆబాలగోపాలం ఆ అనుభూతిని ప్రత్యక్షంగా వీక్షించి ఆనందిస్తున్నారు. ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు రోజంతా మైమరపించే ఫిల్మ్సిటీ అందాల మధ్య ఆనందడోలికల్లో తేలియాడుతూ వినోదం, విహారం కలగలిసిన హాలిడే కార్నివాల్లో పర్యాటకులు ఉత్సాహంగా పాలుపంచుకుంటున్నారు.
ప్రత్యేకతలెన్నో
రామోజీ ఫిల్మ్సిటీలో హాలిడే కార్నివాల్లో ప్రత్యేకతలెన్నో పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. సినీ ప్రేక్షకుల మదినిదోచే ఆధునిక సాంకేతికత.. మోషన్ క్యాప్చర్, వర్చువల్ షూట్ను ఆసక్తిగా వీక్షిస్తున్నారు. ఫిల్మ్సిటీలోని వర్చువల్ ప్రొడక్షన్ సెట్లోకి అడుగుపెట్టి ఆ క్షణాలను ప్రతి ఒక్కరూ మధుర జ్ఞాపకాలుగా మలుచుకుంటున్నారు. అంతేకాదండోయ్ రెయిన్ డ్యాన్స్ ఫ్లోర్పై వేసవితాపం దరిచేరకుండా జల్లుల్లో తడిసిముద్దవుతూ సందర్శకులు ఆనందతీరాలను చేరుతున్నారు. ఉత్సాహం, ఉత్తేజం నింపే సంగీతానికి అనుగుణంగా డ్యాన్స్ చేస్తూ సరికొత్త ఆనందాల్లో మునిగితేలుతున్నారు. యురేకా వేదికపై కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి. ఫిల్మ్సిటీలో మునుపెన్నడూ చూడని మ్యాజికల్ గ్లో గార్డెన్ అందాలను కళ్లారా వీక్షిస్తూ కలల లోకంలోకి వచ్చిన అనుభూతిని పొందుతున్నారు. మిరుమిట్లు గొలిపే రంగురంగుల విద్యుత్తు దీపకాంతుల్లో మెరిసే గార్డెన్లో శిల్పాలు, వివిధ జంతు ఆకృతులు ఆకట్టుకుంటున్నాయి. కనువిందుగా సాగే కార్నివాల్ పరేడ్లో డీజే బీట్లకు ఆడుతూ సంతోషాల్లో తేలియాడుతున్నారు.
ప్రత్యేక ప్యాకేజీలు
హాలిడే కార్నివాల్లో పాలుపంచుకోవాలనుకునే వారి కోసం ప్రత్యేక ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 గంటల వరకు వివిధ ప్యాకేజీలున్నాయి. ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు వేడుకలను ఆస్వాదించేందుకు వచ్చే పర్యాటకులు స్టూడియో టూర్ను నాన్ ఏసీ బస్సులో తిరిగి వీక్షించవచ్చు. ప్రీమియం ప్యాకేజీని ఎంచుకొనే పర్యాటకులకు ఏసీ బస్సులో స్టూడియో టూర్, ప్రత్యేక షోలకు ఎక్స్ప్రెస్ ఎంట్రీ అవకాశం, బఫెట్ లంచ్ అందిస్తారు. మరో ప్యాకేజీలో స్టూడియో టూర్తో పాటు పరిమితమైన కాంబో డిన్నర్ అందిస్తారు. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 గంటల వరకు ప్యాకేజీని ఎంచుకుంటే స్టూడియో టూర్, పరిమితమైన కాంబో డిన్నర్ అందిస్తారు. ప్రీమియం ఈవినింగ్ ప్యాకేజీని ఎంచుకొనే వారికి ఏసీ బస్సులో స్టూడియో టూర్, ప్రత్యేక షోలకు ఎక్స్ప్రెస్ ఎంట్రీ అవకాశం ఉంటుంది. బఫే డిన్నర్ అందిస్తారు. చిన్నారులకు స్పెషల్ సమ్మర్ ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి.
మరిన్ని వివరాలకు..:www.ramojifilmcity.com కు లాగిన్ అవ్వండి. లేదా 76598 76598కు ఫోన్ చేయండి.
కార్నివాల్ పరేడ్
రెయిన్ డ్యాన్స్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నడివీధిలో ఆమెను స్తంభానికి కట్టేసి..
[ 04-05-2024]
కర్ణాటకలోని బెళగావి జిల్లా వంటెమూరి గ్రామంలో గత ఏడాది డిసెంబరులో చోటుచేసుకున్న ఓ అమానుష ఘటన ప్రజలు మరచిపోకనే.. హావేరి జిల్లాలో అదే తరహా ఘటన కలకలం రేపింది. -
అంతేలేని ప్రజ్వల్ రేవణ్ణ ఆగడాలు..
[ 04-05-2024]
కర్ణాటకలో ఓ వైపు ఎన్నికల కోలాహలం కొనసాగుతుండగా.. మరోవైపు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ, ఆయన తండ్రి ఎమ్మెల్యే హెచ్డీ రేవణ్ణ తాలూకూ అశ్లీల వీడియోలు, వాటి ఆధారంగా నమోదైన కేసులు రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి. -
అ‘ద్వితీయ’ ఫలితం ఎవరికో
[ 04-05-2024]
కన్నడనాట రెండో విడత ఎన్నికల కోసం కొనసాగుతున్న ప్రచారంలో జాతీయ నేతల సందడి క్రమంగా తగ్గనుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్ షా, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇప్పటికే ఉత్తర ప్రాంతంలోని అన్ని నియోజకవర్గాలనూ చుట్టేశారు. -
మోదీ నాటకాలు చెల్లవ్
[ 04-05-2024]
ప్రధానమంత్రి నరేంద్రమోదీ చక్కని నాటక కళాకారుడని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎద్దేవా చేశారు. ‘ఈవెంట్ మేనేజరు’గా కూడా ఆయన చక్కగా పని చేస్తారని విమర్శించారు. -
తల్లి హత్యకేసు.. సామాజిక శిక్ష ఖరారు
[ 04-05-2024]
తల్లిని కొట్టి హత్య చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న అనిల్ (35) అనే నిందితుడికి కర్ణాటక ఉన్నత న్యాయస్థానం ఆరు నెలలు సమాజ సేవను శిక్షగా విధించింది. -
దేశద్రోహులతో ముప్పు
[ 04-05-2024]
ఈ ఎన్నికల్లో మేమంతా ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని సైన్యంగా మారడం పూర్వజన్మ సుకృతం..నా సంకల్పం రాష్ట్రంలోని 28 స్థానాల్లో విజయం సాధించి మోదీకి శక్తినందించడం అని రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బి.వై.విజయేంద్ర పేర్కొన్నారు. -
రాహుల్గాంధీ వద్ద ఆధారాలు ఉన్నాయా..!
[ 04-05-2024]
ప్రజ్వల్ అశ్లీల వీడియోల కేసు ఇంకా దర్యాప్తులో ఉంది. నేరం నిరూపణ కాలేదు..అవి నిజమైనవో కాదో..అయితే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ మాత్రం ప్రజ్వల్ రేవణ్ణవి దాదాపు 400 వీడియోలు ఉన్నట్లు చెబుతున్నారు. -
కేంద్రమే ప్రజ్వల్ను రక్షిస్తోంది: సిద్ధు
[ 04-05-2024]
లైంగిక దౌర్జన్యానికి పాల్పడిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను కేంద్ర ప్రభుత్వం రక్షిస్తోందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆరోపించారు. ప్రజ్వల్ వద్ద ఉన్న దౌత్య పాస్పోర్టును రద్దు చేస్తే అతను ఏ దేశంలోనూ ఉండేందుకు అవకాశం ఉండన్నారు. -
శిరసిలో ఐటీ దాడులు
[ 04-05-2024]
పీసీసీ సభ్యుడు, శిరసిలో పారిశ్రామికవేత్త దీపక్ దొడ్డూరు, ఆయన ఆప్తులు శివరాం హెగ్డే, అనిల్ ముష్టగిల నివాసాలపై ఆదాయ పన్ను శాఖ అధికారులు శుక్రవారం ఉదయం దాడులు నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
-
కిడ్నాప్ కేసు.. సిట్ అదుపులో హెచ్డీ రేవణ్ణ
-
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
-
భాజపా నేతను చెప్పుతో కొట్టిన డిప్యూటీ సీఎం.. అనకాపల్లిలో వైకాపా అరాచకం
-
సందేశ్ఖాలీ ఘటనలు.. భాజపా ముందస్తు కుట్రే: మమతా బెనర్జీ
-
జై షాకు బ్యాట్ పట్టుకోవడం తెలుసా..?: ఆప్ విమర్శలు