జేఈఈలో జయకేతనం!
జేఈఈ మెయిన్, బీఈ, బీటెక్లో తొలి పేపర్ కోసం నిర్వహించిన పరీక్షల్లో కర్ణాటక విద్యార్థులు సత్తా చాటారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బుధవారం అర్ధరాత్రి వెల్లడించిన ఈ ఫలితాల్లో కర్ణాటక విద్యార్థులు ముగ్గురు వంద పర్సంటైల్ సాధించారు.
వంద పర్సంటైల్తో ముగ్గురు కన్నడిగుల మెరుపు
ఈనాడు, బెంగళూరు : జేఈఈ మెయిన్, బీఈ, బీటెక్లో తొలి పేపర్ కోసం నిర్వహించిన పరీక్షల్లో కర్ణాటక విద్యార్థులు సత్తా చాటారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బుధవారం అర్ధరాత్రి వెల్లడించిన ఈ ఫలితాల్లో కర్ణాటక విద్యార్థులు ముగ్గురు వంద పర్సంటైల్ సాధించారు. మరికొందరు కేటగిరీ స్థాయిల్లో జాతీయ రెండో ర్యాంకు, ఇతర విభాగాల్లో వందలోపు ర్యాంకులతో మెరిశారు. మొత్తం 56 మంది వంద పర్సంటైల్ సాధించగా అందులో ముగ్గురు రాష్ట్ర విద్యార్థులున్నారు. వీరిలో ఒక విద్యార్థిని ఉండటం విశేషం. గతేడాదితో పోలిస్తే వంద పర్సంటైల్ సాధించిన వారి సంఖ్య ఒకటి పెరిగినా 99 పర్సంటైల్లో ఎక్కువ సంఖ్యలో కర్ణాటక విద్యార్థులు ప్రతిభ కనబరచారు.
- ఈ పరీక్షల్లో నగర విద్యార్థులు సత్తా చాటారు. వీరిలో శ్రీచైతన్య విద్యా సంస్థలకు చెందిన అనిమేష్ సింగ్ రాథోడ్ కేటగిరీ విభాగంలో జాతీయ స్థాయిలో రెండో ర్యాంకు, మనోజ్ సోహాన్ 96, అర్మన్ సింఘాల్ 542, ఆయుష్ రై 552, చిరాగ్ గౌడ 572 ర్యాంకులతో పాటు మరో 15 మంది వెయ్యి లోపు ర్యాంకు సాధించగా, 810మంది ఈ పరీక్షలకు అర్హత సాధించినట్లు సంస్థల డైరెక్టర్ సీమా బోపణ్ణ, ఏజీఎం సతీశ్కుమార్లు ఇక్కడ తెలిపారు.
- అలెన్ కెరీర్ ఇన్స్టిట్యూట్కు చెందిన సాయి నవనీత్ ముకుంద్ 41వ ర్యాంకు సాధించగా, ఇదే సంస్థకు చెందిన షాన్ థామస్ కోషి 100వ ర్యాంకు, బాలకుమారన్ పుదుచ్చేరి యూటీ టాపర్గా నిలిచారు. ఈ సంస్థకు చెందిన 16మంది విద్యార్థులు 500లోపు, 35మంది వేయిలోపు ర్యాంకులు సాధించినట్లు సంస్థ దక్షిణ భారత జోనల్ హెడ్ మహేశ్ యాదవ్ తెలిపారు.
చిన్ననాటి నుంచే దృష్టి..
- నీట్, జేఈఈల కోసం 9వ తరగతి నుంచే శిక్షణ ప్రారంభించినట్లు వంద పర్సంటైల్ సాధించిన సాన్విజైన్ చెప్పారు. అప్పటి నుంచి పోటీ పరీక్షల్లో నెగ్గాలన్నదే తన లక్ష్యంగా ఉండేదని వివరించారు. రోజుకు ఐదు గంటల పాటు చదివేదానినని, ఏరోజు పాఠాలు ఆరోజే పూర్తిగా చదివినట్లు వివరించారు. జేఈఈ అడ్వాన్స్డ్ తర్వాత ఐఐటీ ముంబై లేదా ఐఐఎస్సీలో చేరాలన్నది లక్ష్యమని తెలిపారు.
అనుకున్నది సాధించా
వంద పర్సంటైల్ వస్తుందని ఊహించినట్లు రాష్ట్రంలో తొలి, జాతీయ స్థాయిలో 41వ ర్యాంకు సాధించిన నవనీత్ ముకుంద్ తెలిపారు. గంటలకొద్దీ చదవటం కంటే అవగాహనతో కొద్ది గంటలు చదివినా చాలు మంచి ర్యాంకులు సాధించవచ్చు. అడ్వాన్స్డ్లో మరింత మెరుగైన ర్యాంకు వస్తుందన్న అంచనా ఉందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నడివీధిలో ఆమెను స్తంభానికి కట్టేసి..
[ 04-05-2024]
కర్ణాటకలోని బెళగావి జిల్లా వంటెమూరి గ్రామంలో గత ఏడాది డిసెంబరులో చోటుచేసుకున్న ఓ అమానుష ఘటన ప్రజలు మరచిపోకనే.. హావేరి జిల్లాలో అదే తరహా ఘటన కలకలం రేపింది. -
అంతేలేని ప్రజ్వల్ రేవణ్ణ ఆగడాలు..
[ 04-05-2024]
కర్ణాటకలో ఓ వైపు ఎన్నికల కోలాహలం కొనసాగుతుండగా.. మరోవైపు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ, ఆయన తండ్రి ఎమ్మెల్యే హెచ్డీ రేవణ్ణ తాలూకూ అశ్లీల వీడియోలు, వాటి ఆధారంగా నమోదైన కేసులు రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి. -
అ‘ద్వితీయ’ ఫలితం ఎవరికో
[ 04-05-2024]
కన్నడనాట రెండో విడత ఎన్నికల కోసం కొనసాగుతున్న ప్రచారంలో జాతీయ నేతల సందడి క్రమంగా తగ్గనుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్ షా, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇప్పటికే ఉత్తర ప్రాంతంలోని అన్ని నియోజకవర్గాలనూ చుట్టేశారు. -
మోదీ నాటకాలు చెల్లవ్
[ 04-05-2024]
ప్రధానమంత్రి నరేంద్రమోదీ చక్కని నాటక కళాకారుడని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎద్దేవా చేశారు. ‘ఈవెంట్ మేనేజరు’గా కూడా ఆయన చక్కగా పని చేస్తారని విమర్శించారు. -
తల్లి హత్యకేసు.. సామాజిక శిక్ష ఖరారు
[ 04-05-2024]
తల్లిని కొట్టి హత్య చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న అనిల్ (35) అనే నిందితుడికి కర్ణాటక ఉన్నత న్యాయస్థానం ఆరు నెలలు సమాజ సేవను శిక్షగా విధించింది. -
దేశద్రోహులతో ముప్పు
[ 04-05-2024]
ఈ ఎన్నికల్లో మేమంతా ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని సైన్యంగా మారడం పూర్వజన్మ సుకృతం..నా సంకల్పం రాష్ట్రంలోని 28 స్థానాల్లో విజయం సాధించి మోదీకి శక్తినందించడం అని రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బి.వై.విజయేంద్ర పేర్కొన్నారు. -
రాహుల్గాంధీ వద్ద ఆధారాలు ఉన్నాయా..!
[ 04-05-2024]
ప్రజ్వల్ అశ్లీల వీడియోల కేసు ఇంకా దర్యాప్తులో ఉంది. నేరం నిరూపణ కాలేదు..అవి నిజమైనవో కాదో..అయితే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ మాత్రం ప్రజ్వల్ రేవణ్ణవి దాదాపు 400 వీడియోలు ఉన్నట్లు చెబుతున్నారు. -
కేంద్రమే ప్రజ్వల్ను రక్షిస్తోంది: సిద్ధు
[ 04-05-2024]
లైంగిక దౌర్జన్యానికి పాల్పడిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను కేంద్ర ప్రభుత్వం రక్షిస్తోందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆరోపించారు. ప్రజ్వల్ వద్ద ఉన్న దౌత్య పాస్పోర్టును రద్దు చేస్తే అతను ఏ దేశంలోనూ ఉండేందుకు అవకాశం ఉండన్నారు. -
శిరసిలో ఐటీ దాడులు
[ 04-05-2024]
పీసీసీ సభ్యుడు, శిరసిలో పారిశ్రామికవేత్త దీపక్ దొడ్డూరు, ఆయన ఆప్తులు శివరాం హెగ్డే, అనిల్ ముష్టగిల నివాసాలపై ఆదాయ పన్ను శాఖ అధికారులు శుక్రవారం ఉదయం దాడులు నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మనీ స్వైపింగ్ స్కామ్.. బ్యాంక్ మెసేజ్లతో కొత్త మోసం!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు
-
ఓటీటీలో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
భద్రతా బలగాలపై ఉగ్ర కాల్పులు.. అయిదుగురు జవాన్లకు గాయాలు