logo

మద్యం తాగించి.. ఆమెను మట్టుబెట్టారు

తన ప్రేయసి ఎదురుగానే అలుమేలమ్మ (40) అనే మహిళను అత్యాచారం చేసి హత్య చేసిన సంజీవప్ప (42) అనే వ్యక్తిని, అతనికి సహకారాన్ని అందించిన ప్రియురాలు రామాంజినమ్మ (40)ను  గౌరీబిదనూరు గ్రామీణ ఠాణా పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.

Published : 09 May 2024 06:38 IST

చిక్కబళ్లాపుర, న్యూస్‌టుడే : తన ప్రేయసి ఎదురుగానే అలుమేలమ్మ (40) అనే మహిళను అత్యాచారం చేసి హత్య చేసిన సంజీవప్ప (42) అనే వ్యక్తిని, అతనికి సహకారాన్ని అందించిన ప్రియురాలు రామాంజినమ్మ (40)ను  గౌరీబిదనూరు గ్రామీణ ఠాణా పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. గౌరీబిదనూరు తాలూకా కూనగానహళ్లికి చెందిన బాధితురాలికి గత వారాంతంలో విపరీతంగా మద్యం తాగించి వీరు ఈ అకృత్యానికి పాల్పడ్డారు. తమ వివాహేతర సంబంధానికి అలుమేలమ్మ అడ్డుగా ఉందని హత్య చేసి, ఊరి శివార్లలోని అటవీ ప్రాంతంలో ఆమె మృతదేహాన్ని పడేశారు. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు కార్యాచరణ నిర్వహించి నిందితులను అరెస్టు చేసి విచారణ చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని