ఓటు యంత్రాలకు గట్టి భద్రత
కర్ణాటకలో రెండో విడత ఎన్నికలు జరిగిన 14 లోక్సభ నియోజకవర్గాల నుంచి ఈవీఎంలు, వీవీ ప్యాట్లు స్ట్రాంగ్ రూమ్లకు చేరుకున్నాయి.
బీదర్లోని బీవీబీ కళాశాలలోని ఓ స్ట్రాంగ్రూంకు గట్టి భద్రత
బెంగళూరు (గ్రామీణం), న్యూస్టుడే : కర్ణాటకలో రెండో విడత ఎన్నికలు జరిగిన 14 లోక్సభ నియోజకవర్గాల నుంచి ఈవీఎంలు, వీవీ ప్యాట్లు స్ట్రాంగ్ రూమ్లకు చేరుకున్నాయి. గతంలో జరిగిన ఎన్నికలతో పోల్చితే సుమారు మూడు శాతం అధికంగా 70.43 శాతం పోలింగ్ నమోదైంది. ఆయా జిల్లా కేంద్రాల్లోని స్ట్రాంగ్ రూమ్ల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు కల్పించారు. ఎన్నికల్లో తమ నియోజకవర్గాల పరిధిలో సుడిగాలి పర్యటనలు, ఓటర్లను మెప్పించేందుకు ఇంటింటి ప్రచారాన్ని చేసిన నాయకులంతా కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం విశ్రాంతి తీసుకున్నారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మూడు రోజుల విశ్రాంతి కోసం తమిళనాడులోని ఊటీకి వెళ్లారు. మంత్రి డాక్టర్ హెచ్సీ మహదేవప్ప ఊటీ బాటే పట్టారు. పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి చిక్కమగళూరుకు వెళ్లారు. మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప, భాజపా అద్యక్షుడు బీవై విజయేంద్ర బెంగళూరులోని తమ నివాసంలో విశ్రాంతి తీసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి బుధవారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించిన అనంతరం బిడదిలోని తన వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, మాజీ ముఖ్యమంత్రులు బసవరాజ బొమ్మై, జగదీశ్ శెట్టర్, వివిధ నియోజకవర్గాల అభ్యర్థులు మృణాల్ హెబ్బాళ్కర్ (బెళగావి), వినోద్ అసోటి (హుబ్బళ్లి), ప్రభా మల్లికార్జున్ (దావణగెరె), రాధాకృష్ణ (కలబురగి), సంయుక్త పాటిల్ (బాగల్కోటె), ప్రియాంక జార్ఖిహొళి (చిక్కోడి) తదితరులు తమ కుటుంబ సభ్యులతో కలిసి పూర్తిగా విశ్రాంతి తీసుకున్నారు. కొందరు అభ్యర్థులు ఆలయాలకు వెళ్లి పూజలు చేసుకుని, ఇతర ప్రాంతాల పర్యటనకు వెళ్లారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శివరామయ్యల జయకేతనం
[ 20-05-2024]
కర్ణాటకలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి నేటికి ఏడాది పూర్తి కానుంది. లోక్సభ ఎన్నికల నియమావళి జారీలో ఉండడంతో వార్షికోత్సవ నిర్వహణ, సాధన సమావేశాన్ని నిర్వహించడం సాధ్యం కావడం లేదు. -
ప్చ్.. కానరాని ప్రజ్వల్ జాడ
[ 20-05-2024]
లైంగిక దౌర్జన్యాలకు పాల్పడిన ఆరోపణలు వెలుగులోకి వచ్చిన అనంతరం డిప్లమ్యాటిక్ పాస్పోర్టుతో గత నెల 26న జర్మనీకి వెళ్లిన హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను భారత్కు తీసుకు వచ్చేందుకు సిట్ అధికారులు అన్ని ప్రయత్నాలను ముమ్మరం చేశారు. -
హోం శాఖను హైజాక్ చేశారు
[ 20-05-2024]
హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ కేసు మూసి వేసేందుకు సిట్ సన్నాహాలు చేసుకుంటోందని విపక్ష నాయకుడు ఆర్. అశోక్ ఆరోపించారు. కేసు దర్యాప్తు కొనసాగిస్తే తమకు ముప్పు వాటిల్లుతుందని కొందరు మంత్రులు గుర్తించారని పేర్కొన్నారు. హోం శాఖను ఎవరో హైజాక్ చేయడంతో, ప్రభుత్వమే నిందితుని స్థానంలో నిలబడిందని వ్యాఖ్యానించారు. -
కొండకోనల్లో ఎన్నెన్నో అందాలు
[ 20-05-2024]
వానలు ప్రారంభం కావడంతో బండీపుర జాతీయ ఉద్యానవన అందాల వీక్షణకు పర్యాటకులు మునిగాళ్లపై నిలిచారు. వేసవి సెలవులు ఇంకా కొనసాగుతున్న క్రమంలో కుటుంబ సమేతంగా తరలివచ్చే వారు పెరుగుతున్నారు. -
వంతెనపై జాలీ రైడ్
[ 20-05-2024]
యలహంక ఉపరితల వంతెనపై తన స్నేహితురాలిని బైకు ముందు భాగంలోని పెట్రోల్ ట్యాంకుపై కూర్చోబెట్టుకుని ఒక యువకుడు బైకుపై జాలీరైడ్కు వెళ్లాడు. -
నకిలీ సిమ్కార్డులతో సైబర్ నేరాలు
[ 20-05-2024]
భారతీయ సిమ్ కార్డులను ఉపయోగించి, విదేశాల నుంచి సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారికి సహకరిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నానికి చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తిని కర్ణాటక రాష్ట్రం బెంగళూరు ఈశాన్య విభాగం సైబర్ క్రైం ఠాణా పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. -
తల్లి మృతదేహంతో నాలుగు రోజుల జాగారం
[ 20-05-2024]
తల్లి చనిపోయిందన్న అవగాహన లేకుండా శవం పక్కనే ఒక మహిళ నాలుగు రోజులు జాగారం చేసిన ఘటన ఇది. వారి ఇంటి నుంచి దుర్వాసన వస్తుండడంతో చుట్టుపక్కల వారు అక్కడికి వచ్చి చూడగా విషయం వెలుగులోకి వచ్చింది. -
యశోద ఆత్మహత్యాయత్నం
[ 20-05-2024]
తన అక్క అంజలి అంబిగేర హత్యకు గురి కావడంతో వ్యధకు గురైన ఆమె సోదరి యశోద శనివారం రాత్రి రసాయన ద్రావణం తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. తక్షణమే ఆమెను చికిత్స కోసం కిమ్స్లో చేర్పించారు. చికిత్స అనంతరం ఆమె కోలుకుంది. -
ఆకట్టుకున్న దేశీయ బియ్యం మేళా
[ 20-05-2024]
కనుమరుగైపోతున్న వడ్ల రకాలు, బియ్యాన్ని, ఇతర దేశవాళీ విత్తనాలను నంజరాజ బహద్దూరు ఛత్రంలో శనివారం ప్రదర్శించారు. ఆదివారం సాయంత్రం వరకు ప్రదర్శన, విక్రయాలు కొనసాగాయి. కొన్ని దశాబ్దాల నుంచి మార్కెట్లో విక్రయానికి రాని బియ్యం, వడ్లను రైతులు మేళాకు తీసుకు వచ్చారు. -
పోలీసులను బెదిరించిన భాజపా ఎమ్మెల్యే
[ 20-05-2024]
అక్రమ క్వారీయింగ్ను పోలీసులు అడ్డుకున్నారని ఆరోపిస్తూ భాజపా ఎమ్మెల్యే హరీశ్ పూంజా బెళ్తంగడి ఠాణాకు శనివారం రాత్రి వచ్చారు. మీరు నా వాహనాలను, నా మనుషులను ఎలా అడ్డుకుంటారంటూ పోలీసులను బెదిరించారు.
తాజా వార్తలు (Latest News)
-
బ్యాన్ చేస్తామని బెదిరిస్తున్నారు.. లీగల్ యాక్షన్కు సిద్ధమైన పాయల్ రాజ్పుత్
-
రైసీ తర్వాత ఇప్పుడు అధికారం ఎవరు చేపడతారు..?
-
హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం
-
కొనసాగుతోన్న ఐదో విడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
ఆ లోటు ఎప్పటికీ ఉంటుంది: ఎన్టీఆర్ గురించి ఈ సంగతులు తెలుసా?
-
మల్లారెడ్డి ఆస్తులపై విచారణ కోరతాం: ప్రభుత్వ విప్ లక్ష్మణ్కుమార్