ఖమ్మం గుమ్మంలో రాజకీయ వేఢీ
శాసనసభ ఎన్నికలకు గడువు సమీపిస్తున్నకొద్దీ రాజకీయ వేడి రాజుకుంటోంది. ప్రధాన పార్టీలు ప్రజాక్షేత్రంలో తలమునకలవుతున్నాయి. ఇందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లా వేదికవుతోంది.
ఈ టీవీ,ఖమ్మం
శాసనసభ ఎన్నికలకు గడువు సమీపిస్తున్నకొద్దీ రాజకీయ వేడి రాజుకుంటోంది. ప్రధాన పార్టీలు ప్రజాక్షేత్రంలో తలమునకలవుతున్నాయి. ఇందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లా వేదికవుతోంది. భాజపా, కాంగ్రెస్ అగ్రనేతలు ఖమ్మం దారి పడుతుండటం, వామపక్ష పార్టీలు సైతం ఇక్కడి నుంచే ఎన్నికల క్షేత్రంలోకి దిగేలా కార్యాచరణ రూపొందించుకోవడంతో రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంటోంది.
చంద్రబాబు రాకతో తెలుగు తమ్ముళ్లలో జోష్
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు గతేడాది ఆఖరులో ఖమ్మంలో జరిగిన భారీ బహిరంగ సభకు హాజరై పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. రాబోయే ఎన్నికలకు సన్నద్ధం కావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అనంతరం సీపీఎం ఆధ్వర్యంలో వ్యవసాయ కార్మిక సంఘం మహాసభలు జరిగాయి. కేరళ సీఎం పినరయి విజయన్ హాజరై సమరోత్సాహం నూరిపోశారు.
భారాస ఆవిర్భావ సభతో మొదలు..
జాతీయ రాజకీయాల్లో సత్తా చాటాలన్న లక్ష్యంతో ఈ ఏడాది ఆరంభంలోనే తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మారుస్తూ.. ఆవిర్భావ సభను ఖమ్మంలో నిర్వహించారు. ఉద్యమాల గుమ్మం ఖమ్మంలో పురుడు పోసుకున్న భారాస.. జాతీయ రాజకీయాల్లో రాణిస్తుందని ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. కొత్తగూడెం వేదికగా ప్రజాగర్జన పేరిట ఆదివారం నిర్వహించిన భారీ బహిరంగ సభతో సీపీఐ.. ఎర్రదండును కదనరంగంలోకి దింపింది.
భాజపా అగ్రనేతల రాక..
ఖమ్మంలో గురువారం జరిగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా బహిరంగ సభను కమలదళం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. పార్టీకి బలం లేదన్న చోటే సత్తా చాటాలనే తలంపుతో ఉంది. సభకు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, పొరుగున ఉన్న జిల్లాల నుంచి జనాలను సమీకరించేందుకు ఆపార్టీ నాయకులు వ్యూహాలు పన్నుతున్నారు. జులైలో కొత్తగూడెంలో మరో భారీ బహిరంగ సభ నిర్వహించాలని యోచిస్తున్నారు. ఆ సభకు ప్రధాని మోదీని ఆహ్వానించేందుకు కసరత్తు చేస్తున్నారు. నెల వ్యవధిలోనే ఇద్దరు అగ్రనేతల పర్యటనతో పార్టీ నాయకులు, శ్రేణుల్ని ఎన్నికల క్షేత్రంలోకి దించేలా భాజపా ప్రణాళికలు రచిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఖాతాకమామీషు
[ 17-05-2024]
సైబర్ నేరగాళ్ల అక్రమ లావాదేవీలకు బ్యాంకు ఖాతాలు సమకూర్చుతున్న ముఠాల మూలాలు ఉమ్మడి ఖమ్మం జిల్లా చుట్టూ విస్తరించి ఉంటున్నాయి. -
చిల్లిగవ్వ రాలే..
[ 17-05-2024]
ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు మెరుగుపరిచేందుకు తీసుకొచ్చిన కార్యక్రమమే ఎన్క్వాస్. -
కాసులు కురిపించిన తల్లాడ చెక్పోస్టు
[ 17-05-2024]
ఖమ్మం జిల్లా తల్లాడలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ చెక్పోస్టు ఆదాయంలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. -
గర్భిణులూ.. జాగ్రత్త
[ 17-05-2024]
అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత సాధారణ జనాన్నే ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. -
సమస్యల పరిష్కారంపైప్రత్యేక దృష్టి: జడ్పీ ఛైర్మన్ కంచర్ల
[ 17-05-2024]
జిల్లాలో నెలకొన్న ప్రధాన సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జడ్పీ ఛైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు అన్నారు. -
వైభవంగా సీతారామ కల్యాణం
[ 17-05-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
తెలంగాణ ఉద్యమంలో రాందాస్ది కీలక పాత్ర
[ 17-05-2024]
తెలంగాణ తొలితరం ఉద్యమంలో కొలిశెట్టి రాందాస్నాయక్ కీలక పాత్ర పోషించారని ఉద్యమకారుల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేజీఎస్ మాథ్యూస్ అన్నారు. -
మీ పిల్లలతో కథలు చదివిస్తారా..!
[ 17-05-2024]
ప్రస్తుత స్మార్ట్ ప్రపంచంలో నేటితరం విద్యార్థులు ఖాళీ సమయాల్లో ఎక్కువగా ఆన్లైన్ గేమ్స్ ఆడేందుకే పరిమితం అవుతున్నారు. -
వ్యవసాయ విద్యకు... సాంకేతిక దన్ను
[ 17-05-2024]
ప్రస్తుతం అన్ని రంగాల్లో సాంకేతికతకు పెద్దపీట వేస్తున్నారు. విద్యా రంగంలో సాంకేతికతను ప్రవేశ పెట్టడం విద్యార్థులకు మేలుచేసే అంశమే. -
నెల రోజుల్లో అందుబాటులోకి నూతన విద్యుత్తు ప్లాంటు
[ 17-05-2024]
అశ్వారావుపేట పామాయిల్ పరిశ్రమ ఆవరణలో నిర్మాణంలో ఉన్న 2.5మెగావాట్ విద్యుత్తు ప్లాంటు మరో నెల రోజుల్లో అందుబాటులోకి రానుందని టీజీ ఆయిల్ఫెడ్ జనరల్ మేనేజర్ బి.వి.సుధాకరరెడ్డి తెలిపారు. -
రాయలకు కడసారి వీడ్కోలు
[ 17-05-2024]
భారాస నేత, డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్ రాయల వెంకటశేషగిరిరావు అంత్యక్రియలు ఆయన స్వగ్రామం తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామంలో గురువారం పూర్తయ్యాయి. -
నీటితొట్టిలో పడి రెండేళ్ల బాలుడు మృతి
[ 17-05-2024]
నీటితొట్టిలో పడి రెండేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన సత్తుపల్లిలో గురువారం చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
వివేకా హత్య కేసు.. నాంపల్లి కోర్టులో విచారణకు హాజరైన ఎంపీ అవినాష్రెడ్డి
-
నువ్వు కొత్త ప్లేయర్వి కాదు.. వరల్డ్ కప్లో సత్తా చాటాలి: గంభీర్
-
సైలెంట్గా ఓటీటీలోకి ‘కృష్ణమ్మ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
-
కొత్తవలసలోని జిందాల్ పరిశ్రమ మూసివేత
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!
-
ఆ బాలుడి మృతి ‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లేనా?.. ఇంతకీ ఏంటీ సవాల్?