గవర్నర్ దత్తత గ్రామంలో.. సాగని చదువులు
ఆవరణంతా దట్టంగా పెరిగిన పిచ్చి మొక్కలతో అధ్వానంగా ఉన్న ఈ చిత్రాన్ని చూస్తే ఇదేదో మూసి వేసిన పాఠశాల భవనం అనుకుంటారు. కానీ ఈ భవనం ఉన్న గ్రామానికి రాష్ట్ర స్థాయిలో ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది.
అశ్వారావుపేట గ్రామీణం, న్యూస్టుడే : ఆవరణంతా దట్టంగా పెరిగిన పిచ్చి మొక్కలతో అధ్వానంగా ఉన్న ఈ చిత్రాన్ని చూస్తే ఇదేదో మూసి వేసిన పాఠశాల భవనం అనుకుంటారు. కానీ ఈ భవనం ఉన్న గ్రామానికి రాష్ట్ర స్థాయిలో ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. సాక్షాత్తు రాష్ట్ర గవర్నర్ తమిళిసై దత్తత గ్రామంలోని బడి దుస్థితి ఇది. మారుమూల అటవీ ప్రాంతాల్లో జీవనం సాగించే కొండరెడ్ల జీవన విధానాన్ని మెరుగుపర్చేందుకు రాష్ట్రంలో మూడు జిల్లాల్లో ఆరు కొండరెడ్ల గ్రామాలను రాష్ట్ర గవర్నర్ దత్తత తీసుకున్నారు. అందులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గోగులపూడి ఒకటి. ఈ గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలే ఇది.
ఉపాధ్యాయులను సర్దుబాటు చేసినా..
ఈ పాఠశాలలో ఒకటి నుంచి అయిదు తరగతులు చదువుతున్న 18 మంది విద్యార్థులున్నారు. వేసవి సెలవులకు ముందు ఇక్కడ పనిచేసిన ఉపాధ్యాయుడు 370 జీవోలో బదిలీపై సొంత జిల్లాకు వెళ్లారు. అప్పటి నుంచి ఇక్కడ ఉపాధ్యాయులను ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. ఈ గ్రామానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న పండువారిగూడెం ప్రాథమికోన్నత పాఠశాల నుంచి ముగ్గురు ఉపాధ్యాయులు నెలకు ఒకరు చొప్పున విధులు నిర్వహించే విధంగా స్థానిక ఎంఈవో కృష్ణయ్య సర్దుబాటు చేశారు. వారు సక్రమంగా విధులకు రాకపోవడంతో ఏ రోజు పాఠశాల తెరుస్తారో తెలియని పరిస్థితి నెలకొందని, వారంలో మూడు, నాలుగు రోజులు పాఠశాల మూసే ఉంటుందని గ్రామస్థులు తెలిపారు. దీంతో చదువులు సజావుగా సాగక విద్యార్థులు చదువుల్లో వెనుకబడుతున్నారు. అంతేకాదు పాఠశాల భవనం చుట్టూ పిచ్చి మొక్కలు, ఎండిపోయిన చెట్లు ఉండటంతో విషసర్పాలు గదుల్లోకి వచ్చే అవకాశం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు పట్టించుకుని శాశ్వతంగా ఉపాధ్యాయున్ని నియమించడంతోపాటు పాఠశాల ఆవరణను శుభ్రం చేయించాలని వారు కోరుతున్నారు.
* ఈ విషయమై ఎంఈవో కృష్ణయ్యను ‘న్యూస్టుడే’ వివరణ కోరగా.. ఉపాధ్యాయులను డిప్యుటేషన్పై నియమించామని, వారు సక్రమంగా విధులకు వెళ్తున్నామని చెపుతున్నారన్నారు. గైర్హాజరు విషయం తన దృష్టికి రాలేదని, పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
గోగులపూడిలోని బడి దుస్థితి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఖాతాకమామీషు
[ 17-05-2024]
సైబర్ నేరగాళ్ల అక్రమ లావాదేవీలకు బ్యాంకు ఖాతాలు సమకూర్చుతున్న ముఠాల మూలాలు ఉమ్మడి ఖమ్మం జిల్లా చుట్టూ విస్తరించి ఉంటున్నాయి. -
చిల్లిగవ్వ రాలే..
[ 17-05-2024]
ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు మెరుగుపరిచేందుకు తీసుకొచ్చిన కార్యక్రమమే ఎన్క్వాస్. -
కాసులు కురిపించిన తల్లాడ చెక్పోస్టు
[ 17-05-2024]
ఖమ్మం జిల్లా తల్లాడలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ చెక్పోస్టు ఆదాయంలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. -
గర్భిణులూ.. జాగ్రత్త
[ 17-05-2024]
అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత సాధారణ జనాన్నే ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. -
సమస్యల పరిష్కారంపైప్రత్యేక దృష్టి: జడ్పీ ఛైర్మన్ కంచర్ల
[ 17-05-2024]
జిల్లాలో నెలకొన్న ప్రధాన సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జడ్పీ ఛైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు అన్నారు. -
వైభవంగా సీతారామ కల్యాణం
[ 17-05-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
తెలంగాణ ఉద్యమంలో రాందాస్ది కీలక పాత్ర
[ 17-05-2024]
తెలంగాణ తొలితరం ఉద్యమంలో కొలిశెట్టి రాందాస్నాయక్ కీలక పాత్ర పోషించారని ఉద్యమకారుల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేజీఎస్ మాథ్యూస్ అన్నారు. -
మీ పిల్లలతో కథలు చదివిస్తారా..!
[ 17-05-2024]
ప్రస్తుత స్మార్ట్ ప్రపంచంలో నేటితరం విద్యార్థులు ఖాళీ సమయాల్లో ఎక్కువగా ఆన్లైన్ గేమ్స్ ఆడేందుకే పరిమితం అవుతున్నారు. -
వ్యవసాయ విద్యకు... సాంకేతిక దన్ను
[ 17-05-2024]
ప్రస్తుతం అన్ని రంగాల్లో సాంకేతికతకు పెద్దపీట వేస్తున్నారు. విద్యా రంగంలో సాంకేతికతను ప్రవేశ పెట్టడం విద్యార్థులకు మేలుచేసే అంశమే. -
నెల రోజుల్లో అందుబాటులోకి నూతన విద్యుత్తు ప్లాంటు
[ 17-05-2024]
అశ్వారావుపేట పామాయిల్ పరిశ్రమ ఆవరణలో నిర్మాణంలో ఉన్న 2.5మెగావాట్ విద్యుత్తు ప్లాంటు మరో నెల రోజుల్లో అందుబాటులోకి రానుందని టీజీ ఆయిల్ఫెడ్ జనరల్ మేనేజర్ బి.వి.సుధాకరరెడ్డి తెలిపారు. -
రాయలకు కడసారి వీడ్కోలు
[ 17-05-2024]
భారాస నేత, డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్ రాయల వెంకటశేషగిరిరావు అంత్యక్రియలు ఆయన స్వగ్రామం తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామంలో గురువారం పూర్తయ్యాయి. -
నీటితొట్టిలో పడి రెండేళ్ల బాలుడు మృతి
[ 17-05-2024]
నీటితొట్టిలో పడి రెండేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన సత్తుపల్లిలో గురువారం చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
-
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
-
అంతర్గత నివేదికలతో ఆశల మేడలు.. భాజపా, కాంగ్రెస్ శిబిరాల్లో ఒకే ధీమా
-
తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్13బి’.. ఆ జన్యువు లోపిస్తే పురుషుల్లో సంతానలేమి
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
-
పిఠాపురంలో మద్యం ఇవ్వలేదు.. డబ్బు పంచలేదు: మాజీ ఎమ్మెల్యే వర్మ