మౌనం వీడని తుమ్మల
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అభివృద్ధి మాంత్రికుడిగా పేరొందిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు భారాస నుంచి పాలేరు టికెట్ దక్కకపోవడంపై ఆయన అభిమానులు, ఆపార్టీలోని ఓ వర్గం నాయకులు రగిలిపోతున్నారు.
ఈటీవీ- ఖమ్మం: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అభివృద్ధి మాంత్రికుడిగా పేరొందిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు భారాస నుంచి పాలేరు టికెట్ దక్కకపోవడంపై ఆయన అభిమానులు, ఆపార్టీలోని ఓ వర్గం నాయకులు రగిలిపోతున్నారు. 2018 ఎన్నికల్లో ఓటమి తర్వాత కొత్త నాయకులు గులాబీ గూటికి చేరినా ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీపై నోరెత్తకుండా క్రమశిక్షణతో మెలిగిన నేతకు టికెట్ నిరాకరించారంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తుమ్మల 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి ఘటన జరుగుతుందని ఊహించలేదని భగ్గుమంటున్నారు.
నియోజకవర్గాల వారీగా సమావేశాలు
భారాస నుంచి పాలేరు టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఆపార్టీలోని ఓ వర్గం నాయకులు, ఉభయ జిల్లాల్లోని ఆయన అభిమానులు మద్దతుగా నిలుస్తున్నారు. పాలేరు నియోజకవర్గంలో మంగళవారం సమావేశమయ్యారు. ఎట్టిపరిస్థితుల్లోనూ తుమ్మల పాలేరు బరిలో నిలవాల్సిందేనని తీర్మానించారు. ఇందుకోసం ఆయన తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. వైరా, మధిర, సత్తుపల్లి, ఇల్లెందు నియోజకవర్గాల్లో తుమ్మల వర్గం నేతలు వేర్వేరుగా బుధవారం సమావేశమయ్యారు. రాజకీయాల్లో అపార అనుభవంతోపాటు ఉభయ జిల్లాల అభివృద్ధిలో తనదైన ముద్ర వేసిన తుమ్మలకు భారాస అధిష్ఠానం మొండిచెయ్యి చూపిందంటూ ఆయన వర్గీయులు మండిపడుతున్నారు. కాంగ్రెస్ నుంచి తుమ్మల బరిలో నిలవాలంటూ పలువురు బాహాటంగా వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం.
25న ఖమ్మం జిల్లాకు రానున్న మాజీ మంత్రి
భారాస మూడు రోజుల క్రితం అభ్యర్థుల జాబితా ప్రకటించింది. పాలేరులో సిట్టింగు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డికే మరోసారి టికెట్ కేటాయించింది. అయినా మాజీ మంత్రి తుమ్మల స్పందించలేదు. ఉభయ జిల్లాల్లోని భారాసలోని ఓ వర్గం నాయకులు, తుమ్మల అభిమానుల్లో మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. వాస్తవానికి 2018 ఎన్నికల్లో ఓటమి తర్వాత తుమ్మల కాస్త స్తబ్దుగా ఉన్నారు. నియోజకవర్గంలో కార్యకర్తలను కలవటం, పరామర్శలు, శుభాకార్యాలకు వెళ్లటం మినహా పార్టీపరంగా కార్యక్రమాలు చేపట్టలేదు. పాలేరుకు గోదావరి జలాలు తీసుకురావడమే లక్ష్యమని, అందుకోసం మరోసారి ఇక్కడి నుంచే పోటీ చేస్తానని తుమ్మల పలుమార్లు ఉద్ఘాటించారు. ఈ ఏడాది జనవరి 1న ఖమ్మం గ్రామీణం మండలంలో కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. పార్టీ, సీఎం కేసీఆర్కు వ్యతిరేకంగా మాట్లాడలేదు. జిల్లాకు శుక్రవారం ఆయన రానున్నారు. నాయకన్గూడెం వద్ద తుమ్మలకు స్వాగతం పలికేందుకు నాయకులు ఏర్పాట్లుచేస్తున్నారు. ‘మన ఖమ్మం- మన తుమ్మల- మన భవిష్యత్తు’ నినాదంతో తుమ్మల వర్గీయులు కార్యాచరణకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఖాతాకమామీషు
[ 17-05-2024]
సైబర్ నేరగాళ్ల అక్రమ లావాదేవీలకు బ్యాంకు ఖాతాలు సమకూర్చుతున్న ముఠాల మూలాలు ఉమ్మడి ఖమ్మం జిల్లా చుట్టూ విస్తరించి ఉంటున్నాయి. -
చిల్లిగవ్వ రాలే..
[ 17-05-2024]
ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు మెరుగుపరిచేందుకు తీసుకొచ్చిన కార్యక్రమమే ఎన్క్వాస్. -
కాసులు కురిపించిన తల్లాడ చెక్పోస్టు
[ 17-05-2024]
ఖమ్మం జిల్లా తల్లాడలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ చెక్పోస్టు ఆదాయంలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. -
గర్భిణులూ.. జాగ్రత్త
[ 17-05-2024]
అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత సాధారణ జనాన్నే ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. -
సమస్యల పరిష్కారంపైప్రత్యేక దృష్టి: జడ్పీ ఛైర్మన్ కంచర్ల
[ 17-05-2024]
జిల్లాలో నెలకొన్న ప్రధాన సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జడ్పీ ఛైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు అన్నారు. -
వైభవంగా సీతారామ కల్యాణం
[ 17-05-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
తెలంగాణ ఉద్యమంలో రాందాస్ది కీలక పాత్ర
[ 17-05-2024]
తెలంగాణ తొలితరం ఉద్యమంలో కొలిశెట్టి రాందాస్నాయక్ కీలక పాత్ర పోషించారని ఉద్యమకారుల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేజీఎస్ మాథ్యూస్ అన్నారు. -
మీ పిల్లలతో కథలు చదివిస్తారా..!
[ 17-05-2024]
ప్రస్తుత స్మార్ట్ ప్రపంచంలో నేటితరం విద్యార్థులు ఖాళీ సమయాల్లో ఎక్కువగా ఆన్లైన్ గేమ్స్ ఆడేందుకే పరిమితం అవుతున్నారు. -
వ్యవసాయ విద్యకు... సాంకేతిక దన్ను
[ 17-05-2024]
ప్రస్తుతం అన్ని రంగాల్లో సాంకేతికతకు పెద్దపీట వేస్తున్నారు. విద్యా రంగంలో సాంకేతికతను ప్రవేశ పెట్టడం విద్యార్థులకు మేలుచేసే అంశమే. -
నెల రోజుల్లో అందుబాటులోకి నూతన విద్యుత్తు ప్లాంటు
[ 17-05-2024]
అశ్వారావుపేట పామాయిల్ పరిశ్రమ ఆవరణలో నిర్మాణంలో ఉన్న 2.5మెగావాట్ విద్యుత్తు ప్లాంటు మరో నెల రోజుల్లో అందుబాటులోకి రానుందని టీజీ ఆయిల్ఫెడ్ జనరల్ మేనేజర్ బి.వి.సుధాకరరెడ్డి తెలిపారు. -
రాయలకు కడసారి వీడ్కోలు
[ 17-05-2024]
భారాస నేత, డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్ రాయల వెంకటశేషగిరిరావు అంత్యక్రియలు ఆయన స్వగ్రామం తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామంలో గురువారం పూర్తయ్యాయి. -
నీటితొట్టిలో పడి రెండేళ్ల బాలుడు మృతి
[ 17-05-2024]
నీటితొట్టిలో పడి రెండేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన సత్తుపల్లిలో గురువారం చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
-
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
-
అంతర్గత నివేదికలతో ఆశల మేడలు.. భాజపా, కాంగ్రెస్ శిబిరాల్లో ఒకే ధీమా
-
తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్13బి’.. ఆ జన్యువు లోపిస్తే పురుషుల్లో సంతానలేమి
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
-
పిఠాపురంలో మద్యం ఇవ్వలేదు.. డబ్బు పంచలేదు: మాజీ ఎమ్మెల్యే వర్మ