మేడే వద్దన్న మోదీని వదిలించుకుందాం: తమ్మినేని
ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే విదేశీయులదని, దీన్ని రద్దు చేస్తామని పిలుపునిచ్చిన ప్రధాని మోదీని రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఓడించి వదిలించుకుందామని, కార్మికుల ఐక్యతను చాటుదామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.
ఖమ్మం గ్రెయిన్ మార్కెట్లో మాట్లాడుతున్న తమ్మినేని వీరభద్రం
ఖమ్మం మామిళ్లగూడెం, న్యూస్టుడే: ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే విదేశీయులదని, దీన్ని రద్దు చేస్తామని పిలుపునిచ్చిన ప్రధాని మోదీని రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఓడించి వదిలించుకుందామని, కార్మికుల ఐక్యతను చాటుదామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. నగరంలోని గ్రెయిన్ మార్కెట్ వద్దనున్న సీఐటీయూ కార్యాలయంలో బుధవారం జరిగిన మేడే వేడుకల్లో తమ్మినేని అరుణపతాకాన్ని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. నేడు కార్మికవర్గం అనుభవిస్తున్న ఏ హక్కు ఏ ఒక్కరి దయాదాక్షిణ్యాలపై వచ్చింది కాదని, పోరాడి సాధించుకున్నవేనని గుర్తుచేశారు. కేంద్రంలోని మోదీ సర్కారు కార్మిక చట్టాలను రద్దు చేసి కొత్తగా నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చిందన్నారు. పని గంటలు 12గంటలకు పెంచేలా, సెలవు దినాలు తీసేసేలా, కార్మికుల సంక్షేమ చట్టాలను మార్పు చేసి కార్పొరేట్ కంపెనీల లాభాలను చేకూర్చేలా మోదీ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. లోక్సభ ఎన్నికల్లో భాజపాను ఓడించడం ద్వారా మేడే స్ఫూర్తిని పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. రైతు సంఘం రాష్ట్ర నాయకులు పోతినేని సుదర్శన్రావు, నున్నా నాగేశ్వరరావు, సీఐటీయూ రాష్ట్ర నాయకుడు యర్రా శ్రీకాంత్, జిల్లా అధ్యక్షుడు, కల్యాణం వెంకటేశ్వరరావు, కార్యదర్శి టి.విష్ణు, వై.విక్రమ్, భూక్యా శ్రీనివాసరావు, బండారు యాకయ్య, శ్రీనివాసరావు, లింగయ్య, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఖాతాకమామీషు
[ 17-05-2024]
సైబర్ నేరగాళ్ల అక్రమ లావాదేవీలకు బ్యాంకు ఖాతాలు సమకూర్చుతున్న ముఠాల మూలాలు ఉమ్మడి ఖమ్మం జిల్లా చుట్టూ విస్తరించి ఉంటున్నాయి. -
చిల్లిగవ్వ రాలే..
[ 17-05-2024]
ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు మెరుగుపరిచేందుకు తీసుకొచ్చిన కార్యక్రమమే ఎన్క్వాస్. -
కాసులు కురిపించిన తల్లాడ చెక్పోస్టు
[ 17-05-2024]
ఖమ్మం జిల్లా తల్లాడలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ చెక్పోస్టు ఆదాయంలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. -
గర్భిణులూ.. జాగ్రత్త
[ 17-05-2024]
అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత సాధారణ జనాన్నే ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. -
సమస్యల పరిష్కారంపైప్రత్యేక దృష్టి: జడ్పీ ఛైర్మన్ కంచర్ల
[ 17-05-2024]
జిల్లాలో నెలకొన్న ప్రధాన సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జడ్పీ ఛైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు అన్నారు. -
వైభవంగా సీతారామ కల్యాణం
[ 17-05-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
తెలంగాణ ఉద్యమంలో రాందాస్ది కీలక పాత్ర
[ 17-05-2024]
తెలంగాణ తొలితరం ఉద్యమంలో కొలిశెట్టి రాందాస్నాయక్ కీలక పాత్ర పోషించారని ఉద్యమకారుల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేజీఎస్ మాథ్యూస్ అన్నారు. -
మీ పిల్లలతో కథలు చదివిస్తారా..!
[ 17-05-2024]
ప్రస్తుత స్మార్ట్ ప్రపంచంలో నేటితరం విద్యార్థులు ఖాళీ సమయాల్లో ఎక్కువగా ఆన్లైన్ గేమ్స్ ఆడేందుకే పరిమితం అవుతున్నారు. -
వ్యవసాయ విద్యకు... సాంకేతిక దన్ను
[ 17-05-2024]
ప్రస్తుతం అన్ని రంగాల్లో సాంకేతికతకు పెద్దపీట వేస్తున్నారు. విద్యా రంగంలో సాంకేతికతను ప్రవేశ పెట్టడం విద్యార్థులకు మేలుచేసే అంశమే. -
నెల రోజుల్లో అందుబాటులోకి నూతన విద్యుత్తు ప్లాంటు
[ 17-05-2024]
అశ్వారావుపేట పామాయిల్ పరిశ్రమ ఆవరణలో నిర్మాణంలో ఉన్న 2.5మెగావాట్ విద్యుత్తు ప్లాంటు మరో నెల రోజుల్లో అందుబాటులోకి రానుందని టీజీ ఆయిల్ఫెడ్ జనరల్ మేనేజర్ బి.వి.సుధాకరరెడ్డి తెలిపారు. -
రాయలకు కడసారి వీడ్కోలు
[ 17-05-2024]
భారాస నేత, డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్ రాయల వెంకటశేషగిరిరావు అంత్యక్రియలు ఆయన స్వగ్రామం తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామంలో గురువారం పూర్తయ్యాయి. -
నీటితొట్టిలో పడి రెండేళ్ల బాలుడు మృతి
[ 17-05-2024]
నీటితొట్టిలో పడి రెండేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన సత్తుపల్లిలో గురువారం చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
భారత వృద్ధిరేటు అంచనాలను గణనీయంగా పెంచిన ఐరాస
-
వివేకా హత్య కేసు.. నాంపల్లి కోర్టులో విచారణకు హాజరైన ఎంపీ అవినాష్రెడ్డి
-
నువ్వు కొత్త ప్లేయర్వి కాదు.. వరల్డ్ కప్లో సత్తా చాటాలి: గంభీర్
-
సైలెంట్గా ఓటీటీలోకి ‘కృష్ణమ్మ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
-
కొత్తవలసలోని జిందాల్ పరిశ్రమ మూసివేత
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!