logo

కేసీఆర్‌తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం: కవిత

రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి మాజీ సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమని మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానం భారాస అభ్యర్థి మాలోత్‌ కవిత అన్నారు. దాస్‌తండాలో మంగళవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు.

Published : 08 May 2024 02:36 IST

మాట్లాడుతున్న భారాస అభ్యర్థి మాలోత్‌ కవిత

టేకులపల్లి, న్యూస్‌టుడే: రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి మాజీ సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమని మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానం భారాస అభ్యర్థి మాలోత్‌ కవిత అన్నారు. దాస్‌తండాలో మంగళవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. మతతత్వ భాజపా ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ఓట్లు దండుకోవాలని చూస్తుందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఆచరణ సాధ్యంకాని హామీలను గుప్పించి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని దుయ్యబట్టారు. లోక్‌సభ ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. మాజీ ఎమ్మెల్యే బానోత్‌ హరిప్రియ, దిండిగాల రాజేందర్‌, లక్కినేని సురేందర్‌రావు, వరప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు