ఆ పనులు పూర్తిచేద్దురూ..
రాజధాని అమరావతిలో నిలిచిన పనులను ప్రాధాన్యతా క్రమంలో దశలవారీగా తిరిగి ప్రారంభించాలని రైతులు సీఆర్డీఏ కమిషనర్కు ఇచ్చిన వినతిపత్రంలో కోరారు. బుధవారం సాయంత్రం విజయవాడ సీఆర్డీఏ
సీఆర్డీఏ కమిషనర్కు రాజధాని రైతుల వినతి
ఈనాడు - అమరావతి
రాజధాని అమరావతిలో నిలిచిన పనులను ప్రాధాన్యతా క్రమంలో దశలవారీగా తిరిగి ప్రారంభించాలని రైతులు సీఆర్డీఏ కమిషనర్కు ఇచ్చిన వినతిపత్రంలో కోరారు. బుధవారం సాయంత్రం విజయవాడ సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో రైతులు కమిషనర్ వివేక్ యాదవ్ను కలిశారు. రాజధానిలో ప్రతిపాదిత, మధ్యలో ఆగిన వివిధ ప్రాజెక్టుల పనులను తక్షణమే చేపట్టేందుకు కమిషనర్ చూపుతున్న చొరవకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. నిర్ణీత కాల వ్యవధిలోగా బృహత్ ప్రణాళిక, సీర్డీఏ చట్టం ప్రకారం అన్ని అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. గత మూడేళ్లుగా రైతులకు చెల్లించాల్సిన కౌలును సకాలంలో ఇవ్వడం లేదని, ఈ ఏడాది కూడా ఇంకా జమకాలేదని ఆయన దృష్టికి తెచ్చారు. రూ. 208 కోట్లు డబ్బులు వచ్చాయని, త్వరలో రైతులకు అందిస్తామని వివరించారు. తాము ఆయన దృష్టికి తీసుకొచ్చిన పలు అంశాలకు సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ సానుకూలంగా స్పందించినట్లు రాజధాని రైతులు చెప్పారు. త్వరలో రైతులతో సీఆర్డీఏ అధికారులు సమన్వయ సమావేశం ఏర్పాటు చేసేందుకు ఆయన ఆంగీకరించినట్లు తెలిపారు.
దృష్టికి తీసుకొచ్చిన అంశాలివీ..
* ప్లాట్లలో పెరిగిన కంప, చెట్లను తొలగించాలి. అనధికారికంగా సాగు చేస్తున్న పంటలను తొలగించాలి.
* వర్షా కాలంలో ఇబ్బందులు తలెత్తకుండా కొండవీటి వాగు ప్రాజెక్టును పూర్తి చేయాలి.
* అన్ని సదుపాయాలతో లేఔట్లను అభివృద్ధి చేయాలి.
* అసైన్డ్ భూములను క్రమబద్ధీకరించాలి. వీటికి కూడా వార్షిక కౌలు అందజేయాలి.
* హ్యాపీనెస్ట్ నిర్మాణాన్ని తక్షణమే ప్రారంభించాలి.
* అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు న్యాయమూర్తులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, అఖిల భారత సర్వీసు అధికారుల భవనాల నిర్మాణాలను పూర్తి చేయాలి.
* కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించిన స్థలాల్లో భవనాలు నిర్మించేలా చూడాలి.
* టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించేలా చొరవ తీసుకోవాలి.
* గ్రామాల సరిహద్దులను గుర్తించి, వాటికి సంబంధించి తుది నోటిఫికేషన్ జారీ చేయాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాలకులు కా‘పాడి’న పాపాన పోలేదు
[ 27-04-2024]
లీటరు పాలకు రూ.4 బోనస్ ఇస్తానని, పాడి రైతులను ఆదుకుంటానని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్రెడ్డి హామీలు అమలు చేయకపోగా అమలులో ఉన్న పథకాలు రద్దు చేశారు. -
26 నామినేషన్ల తిరస్కరణ
[ 27-04-2024]
బాపట్ల లోక్సభ, జిల్లాలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 150 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. -
తెదేపా గూటికి మాజీ మంత్రి డొక్కా
[ 27-04-2024]
ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి, దళితుల్లో సీనియర్ నేత, గుంటూరు జిల్లా వైకాపా అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. -
బరిలో మిగిలేదెవరో?
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామపత్రాల సమర్పణ, పరిశీలన కార్యక్రమం ముగిసింది. ప్రధాన పార్టీలతో పాటు గుర్తింపు, నమోదైన పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు పెద్దఎత్తున నామపత్రాలు దాఖలు చేశారు. -
‘భూ’మంతర్ ఖాళీ
[ 27-04-2024]
రాష్ట్రంలో అత్యాధునిక సాంకేతికతతో భూముల రీసర్వే నిర్వహిస్తున్నాం. భూవివాదాలన్నీ శాశ్వతంగా పరిష్కరిస్తాం. -
ఒకే రాష్ట్రం- ఒకే రాజధాని మా లక్ష్యం
[ 27-04-2024]
-
గంజాయి బ్యాచ్ ఆగడాలపై నిరసన
[ 27-04-2024]
గంజాయి బ్యాచ్ ఆగడాలు భరించలేకున్నామంటూ.. వారిపై చర్యలు తీసుకోవాని శుక్రవారం రాత్రి గుంటూరు రాజీవ్గాంధీనగర్ వాసులు నిరసన తెలిపారు. -
నేత.. మొక్కల్లో మేత!
[ 27-04-2024]
అధికారమే అండగా ఆ ప్రజాప్రతినిధి కుటుంబం గుంటూరు నగరాన్ని చెరపట్టి మరీ దోచుకుంది. అల్లుడికి రోడ్లు, డ్రెయిన్ల కాంట్రాక్టు పనులు ఇప్పించుకోవడానికే పరిమితం కాలేదు. -
నిధులు నింపుకోవడానికి మేమే దొరికామా!
[ 27-04-2024]
ఎ.ఎన్.యు: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆర్థికంగా దివాళ తీసే పరిస్థితిలో ఉందని, అందువల్లే మే 1 నుంచి ప్రారంభమయ్యే బీఈడీ పరీక్షలకు అదనంగా డబ్బులు చెల్లించాలని అధికారులు ఉత్తర్వులు ఇచ్చారని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. -
నాకు తెలియదు.. నాకు తెలియదు
[ 27-04-2024]
పొన్నూరు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి మురళీకృష్ణ భార్య, కుమార్తె ఆస్తుల వివరాలను అఫిడవిట్లో ఎందుకు పొందుపరచలేదని కూటమి నాయకులు ప్రశ్నిస్తే.. నాకు తెలియదు.. నాకు తెలియదు.. చెప్పడం ఏమిటిని పలువురు తప్పుపడుతున్నారు. -
‘బీసీలను నట్టేట ముంచిన జగన్’
[ 27-04-2024]
‘బీసీలు రాజ్యాధికారం చేపట్టాలంటే ఎన్డీఏ కూటమితోనే సాధ్యం. బీసీ ఉపప్రణాళిక నిధుల్ని దారి మళ్లించి జగన్ నమ్మక ద్రోహం చేశారు. -
గురువులపై బోధనేతర విధుల భారం
[ 27-04-2024]
గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వ ఉపాధ్యాయులపై వైకాపా ప్రభుత్వం కక్ష గట్టినట్లు వ్యవహరిస్తోందని పలుమార్లు ఉపాధ్యాయ సంఘాలే నేరుగా విమర్శలు గుప్పించాయి. -
భూ కక్ష
[ 27-04-2024]
మండలంలోని సమగ్ర భూ సర్వేకు గత ఏడాది ఏప్రిల్లో రెవెన్యూ యంత్రాంగం శ్రీకారం చుట్టింది. నూరు సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఈ కార్యక్రమంలో అక్షాంశ, రేఖాంశాల సహితంగా ప్రతి ఒక్కరి పొలానికి పక్కా సరిహద్దులు నిర్ణయిస్తామని అధికారులు పేర్కొన్నారు.