logo

26 జిల్లాలను చేయడం గర్వకారణం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలు 26జిల్లాలుగా రూపాంతరం చెందడం....

Updated : 27 Jan 2022 17:19 IST

సి.బెళగల్‌: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలు 26జిల్లాలుగా రూపాంతరం చెందడం గర్వకారణమని కోడుమూరు ఎమ్మెల్యే జె.సుధాకర్‌ అన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌కు ఆయన అభినందనలు తెలిపారు. మండల కేంద్రమైన సి.బెళగల్‌లో వైకాపా నాయకుడు గోవిందరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. అంతకు ముందు సి.బెళగల్‌ మండల పరిషత్‌ కార్యాలయం నుంచి బస్టాండ్‌ వరకు ప్రదర్శన నిర్వహించి అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వైఎస్‌ఆర్‌ కూడలికి చేరి వైఎస్‌ఆర్‌ శిలా విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని