logo

సంగమేశ్వరుడి సేవలో ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌

నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం సప్తనదుల సంగమ ప్రాంతంలో ఉన్న సంగమేశ్వరాలయాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ ఆదివారం సందర్శించారు.

Published : 27 Mar 2023 03:07 IST

శివలింగానికి హారతి ఇస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌

కొత్తపల్లి, న్యూస్‌టుడే : నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం సప్తనదుల సంగమ ప్రాంతంలో ఉన్న సంగమేశ్వరాలయాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ ఆదివారం సందర్శించారు. ఆయనకు ఆలయ పురోహితులు, అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయ పురోహితులు ఆలయ విశిష్టతను వివరించారు. ఈ సందర్భంగా ఆయన గర్భాలయంలో లలితాదేవి సమేత సంగమేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. వేపదారు శివలింగానికి సప్తనదీ జలాలు, పాలతో అభిషేకం చేశారు. కుంకుమార్చన, పుష్పార్చన, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భీమలింగం ప్రదేశంలో సప్త నదులు కలిసే ప్రాంతాన్ని పరిశీలించారు. ఆలయ పురోహితులు పట్టువస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం మోహన్‌ భగవత్‌ గోకవరం గ్రామంలోని భక్త కన్నప్ప గురుకులం ఆవాస్‌కు చేరుకుని మొక్కలు నాటారు. అక్కడే భోజనం చేసి రెండు గంటల పాటు విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం ఆవాస్‌ కమిటీ సభ్యులతో మాట్లాడుతూ గిరిజన విద్యార్థులు అభ్యున్నతికి కృషి చేయాలని సూచించారు. ఎస్పీ రఘువీర్‌రెడ్డి బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని