కునుకు పట్టదు.. వణుకు వీడదు
రయ్... రయ్ మంటూ దూసుకొచ్చే కార్లు.. అడుగడుగునా పోలీసుల తనిఖీలు.. అధికార పార్టీ నేతల అరుపులతో నగరంలోని గాయత్రి ఎస్టేట్ వాసులకు నిద్ర కరవైంది.
అధికార పార్టీ నేతల హల్చల్
భయం గుప్పిట్లో గాయత్రి ఎస్టేట్ వాసులు
గాయత్రి ఎస్టేట్లోని ఓ కాలనీ వైద్యుల ఇళ్ల ఎదుట బారులు తీరిన వైఎస్సార్ జిల్లా వాసుల వాహనాలు
కర్నూలు నేరవిభాగం, న్యూస్టుడే: రయ్... రయ్ మంటూ దూసుకొచ్చే కార్లు.. అడుగడుగునా పోలీసుల తనిఖీలు.. అధికార పార్టీ నేతల అరుపులతో నగరంలోని గాయత్రి ఎస్టేట్ వాసులకు నిద్ర కరవైంది. ప్రశాంత వాతావరణలో ఉంటే ఆ కాలనీ వాసులు భయంభయంతో గడుపుతున్నారు. కనీసం ఇంటి ముందు కల్లాపి చల్లి ముగ్గులు వేసే పరిస్థితి కరవైంది. తల్లి శ్రీలక్ష్మి గుండె జబ్బుతో బాధపడుతోందంటూ కడప ఎంపీ అవినాష్రెడ్డి కర్నూలు నగరంలోని గాయత్రి ఎస్టేట్లోని విశ్వభారతి ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన్ను అరెస్టు చేసేందుకు సీబీఐ అధికారులొచ్చారు.. అడ్డుకోవాలన్న ఉద్దేశంతో వైకాపా నేతలు ఆసుపత్రి ఎదుట తిష్ట వేశారు. అప్పటి నుంచి అక్కడ బందోబస్తు పెరగడం.. వైకాపా ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలొస్తున్నారు. రోడ్లపై వాహనాలు నిలపడం.. నినాదాలు చేయడం.. అడ్డొచ్చేవారిపై దాడులకు దిగడంతో కాలనీ వాసులు భయపడిపోతున్నారు.
గాయత్రి ఎస్టేట్లో ఆసుపత్రులు, వ్యాపారాలకు కేంద్రం. ప్రముఖ వైద్యులంతా అదే కాలనీలో ఉంటారు. అధికార పార్టీ నేతల హంగామాతో కాలనీ వాసులు భయపడుతున్నారు. కొందరు మద్యం తాగి హల్చల్ చేస్తుండటంతో బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. విశ్వభారతి మార్గం పూర్తిగా మూసివేయటంతో రహదారులపైనే కూర్చోవటం, తినటం, పడుకోవటంతో ఆ మార్గం స్తంభించిపోయింది. పగలంతా కూలీ పని చేసి రాత్రి నిద్రతో ఉపశమనం పొందే బిర్లాగడ్డకాలనీవాసులకు కునుకు కరవైంది. అందరినీ దబాయించే పోలీసు అధికారులు వైకాపా నాయకుల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకునే ధైర్యం చేయలేకపోతున్నారు. ఏదైనా జరిగితే వ్యవహారం సీఎం కార్యాలయం వరకు వెళ్తుందని భయపడుతున్నారు. పోలీసుల బలహీనతను గ్రహించిన అనినాష్రెడ్డి అనుచరులు అందరినీ భయపెడుతున్నారు.
ఎక్కడపడితే అక్కడ వాహనాల నిలిపివేత
రోడ్లపై వైకాపా నేతలు
* గాయత్రి ఎస్టేట్ సమీప లాడ్జీల్లో బస చేసిన ఎంపీ అనుచరులు ఇష్టారాజ్యంగా వాహనాలు పార్క్ చేస్తున్నారు. ఇళ్లు, దుకాణాలు, ఆసుపత్రులు, క్ల్లీనిక్, ఇతర వ్యాపార కేంద్రాల ఎదుట అడ్డంగా నిలిపేస్తున్నారు. పలువురిపై దాడులకు దిగడంతో అడిగే సాహసం చేయలేకపోతున్నారు.
* చాలామంది వ్యాపారులు, క్ల్లీనిక్లు మూసివేసి నష్టాలపాలవుతున్నారు. ఓ ఆసుపత్రి నిర్వాహకుడు ఏకంగా తన ఆసుపత్రిలో సగభాగం అతిథిగృహంగా మార్చి వారికి ఇచ్చేశాడు. క్ల్లీనిక్ మూతబడటంతో పగటి సమయంలో రోగులు ఇబ్బందిపడుతున్నారు. 24 గంటలూ గుంపులుగా తిరుగుతూ గోల చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎమ్మిగనూరులో భారీ వర్షం
[ 17-05-2024]
నియోజకవర్గంలోని ఎమ్మిగనూరు, నందవరం మండలాల్లో శుక్రవారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. -
మా‘రీచ్’లపై కన్నేయండి
[ 17-05-2024]
నదీతీరాల్లో ఇసుకను యంత్రాలతో తవ్వొద్దని ఎవరెన్ని హెచ్చరికలు జారీ చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు.. ఎన్జీటీ హెచ్చరించినా.. కోర్టులు మొట్టికాయలు వేసినా తవ్వకాలు ఆపలేదు. -
కత్తి దూస్తున్న కక్షలు
[ 17-05-2024]
సార్వత్రిక ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ముగిసింది.. అనంతరం పల్లెల్లో కక్షలు కత్తి దూస్తున్నాయి. ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో పార్టీల ఫిరాయింపులు మొదలుకొని ఇరువర్గాల మధ్య గొడవలు, ఘర్షణలతో రాజకీయ వైరం పెరిగింది. -
భూసార పరీక్షలనేలచూపులు
[ 17-05-2024]
పంట దిగుబడి, నాణ్యతకు భూసారమే కీలకం. నేల లక్షణాలు.. ఇందులో లోపించిన సూక్ష్మధాతువుల వివరాలు తెలుసుకుని.. అందుకు అనుగుణంగా ఎరువులు వినియోగిస్తే అధిక దిగుబడులు సాధ్యమవుతాయి. -
ఏపీఈఏపీ సెట్ ప్రారంభం
[ 17-05-2024]
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఏపీఈఏపీ సెట్ గురువారం ప్రారంభమైంది. కర్నూలు జిల్లాలో మొత్తం 3,675 మంది దరఖాస్తు చేసుకోగా 3,419 మంది హాజరయ్యారు. -
పారిశ్రామిక శిక్షణ.. ఉపాధికి నిచ్చెన
[ 17-05-2024]
పారిశ్రామిక శిక్షణ సంస్థలు వృత్తివిద్యలో తర్ఫీదును ఇస్తూ స్వయం ఉపాధితో పాటు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు సాధించేందుకు మార్గాన్ని చూపుతున్నాయి. -
వైకాపా నాయకుల తీరుతోనే హింసాత్మక ఘటనలు
[ 17-05-2024]
వైకాపా నాయకుల తీరు కారణంగానే రాష్ట్రంలో ఎన్నికల అనంతరం హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయని కర్నూలు మాజీ ఎమ్మెల్యే, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎం.ఎ.గఫూర్ అన్నారు. -
కూటమిదే అధికారం
[ 17-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా-భాజపా-జనసేన కూటమి విజయం సాధిస్తుందని.. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టనున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి, తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు కేఈ కృష్ణమూర్తి అన్నారు. -
అతిసారంతో 16 మందికి అస్వస్థత
[ 17-05-2024]
బండిఆత్మకూరు మండలం యర్రగుంట్లలో అతిసారం ప్రభలడంతో గురువారం 16 మంది వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. -
తెదేపా కార్యకర్తలపై మూకుమ్మడిగా దాడి
[ 17-05-2024]
ఉపాధి హామీ పనులకు వెళ్లి తిరిగి వస్తున్న తెదేపా అనుచరులపై పలువురు మూకుమ్మడి దాడిచేసిన ఘటన మహానంది మండలం గోపవరం గ్రామంలో గురువారం జరిగింది. -
స్ట్రాంగ్ రూమ్ల వద్ద నిరంతరం భద్రత
[ 17-05-2024]
స్ట్రాంగ్ రూమ్ల వద్ద నియమించిన పోలీసు బలగాలు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్, ఎన్నికల అధికారి డా.జి.సృజన పేర్కొన్నారు. -
గడప చేరని బియ్యం
[ 17-05-2024]
పేదలకు నెలవారీగా అందాల్సిన గుప్పెడు బియ్యంపై సార్వత్రిక ఎన్నికల ప్రభావం పడింది. ఈనెల 1 నుంచి ఎండీయూ వాహనాల ద్వారా సరకుల పంపిణీ చేపట్టినప్పటికీ అధిక ఉష్ణోగ్రతలు, ఎన్నికల ప్రచారాలతో చాలా మంది గడపకు చేరలేదు.
తాజా వార్తలు (Latest News)
-
‘అమ్మ’ అంతిమయాత్ర అయినా.. ఆస్తి పంచాకే !
-
ఆంక్షలు విధించిన అమెరికాలోనే.. రహస్యంగా ఉత్తర కొరియన్లు వర్క్ఫ్రమ్ హోం
-
టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ప్రభాస్ పోస్ట్.. ఆ ప్రత్యేక వ్యక్తి ఎవరు?
-
ఏపీఎల్లో చరిత్ర సృష్టించిన ఎస్ఆర్హెచ్ హీరో
-
భారత వృద్ధిరేటు అంచనాలను గణనీయంగా పెంచిన ఐరాస
-
వివేకా హత్య కేసు.. నాంపల్లి కోర్టులో విచారణకు హాజరైన ఎంపీ అవినాష్రెడ్డి