logo

చంద్రబాబుకు జననీరాజనం

వీధులన్నీ పసుపుమయంగా మారాయి. జనసైనికులు తరలివచ్చారు. కాషాయం కార్యకర్తలు కదలివచ్చారు. కూటమి కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Published : 20 Apr 2024 05:12 IST

ఆలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: వీధులన్నీ పసుపుమయంగా మారాయి. జనసైనికులు తరలివచ్చారు. కాషాయం కార్యకర్తలు కదలివచ్చారు. కూటమి కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు శుక్రవారం ఆలూరులో ప్రజాగళం సభ నిర్వహించారు. ఆదోని నియోజకవర్గ తెదేపా బాధ్యుడు మీనాక్షినాయుడు, ఉమాపతినాయుడు, స్థానిక నాయకులు చంద్రబాబును కలిశారు. కురవ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సోమలింగ, ప్రధాన కార్యదర్శి కురవ బ్రహ్మయ్య తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీలో చేరారు. వారికి చంద్రబాబు పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. పత్తికొండ ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ శ్యాంబాబు, తుగ్గలి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని