logo

తెదేపా జెండా ఎగరేద్దాం

ఆదోని పట్టణంలోని ఓ కల్యాణ మండపంలో మంగళవారం రాత్రి ఎన్డీయే పార్టీల నాయకులతో నాయీబ్రాహ్మణ సంఘం నాయకులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు

Updated : 01 May 2024 05:36 IST

ఆదోని మార్కెట్‌, న్యూస్‌టుడే: ఆదోని పట్టణంలోని ఓ కల్యాణ మండపంలో మంగళవారం రాత్రి ఎన్డీయే పార్టీల నాయకులతో నాయీబ్రాహ్మణ సంఘం నాయకులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో తెదేపా జిల్లా అధ్యక్షుడు బీటీ.నాయుడు ఆదోని అభ్యర్థి డా.పార్థసారథి, మాజీ ఎమ్మెల్యేలు మీనాక్షినాయుడు, ప్రకాశ్‌జైన్‌, నాయకులు గుడిసె కృష్ణమ్మ, మల్లప్ప, శ్రీకాంత్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, ఫకృద్ధీన్‌, దేవేంద్రప్ప పాల్గొన్నారు.

ఆదోని గ్రామీణం, న్యూస్‌టుడే: ఆదోనిలో మాజీ ఎమ్మెల్యే కె.మీనాక్షినాయుడు స్వగృహంలో మంగళవారం జాలిమంచి గ్రామానికి చెందిన పలువురు వైకాపా నాయకులు తెదేపాలో చేరారు. అలాగే ఆదోని పదో వార్డు మాజీ కౌన్సిలరు, వైకాపా నాయకుడు దస్తగిరితో పాటు 10 కుటుంబాలు పార్థసారథి, మీనాక్షినాయుడు సమక్షంలో తెదేపాలో చేరాయి. కార్యక్రమంలో నాయకులు చంద్రమౌళి, అప్సర్‌బాషా, బుద్దారెడ్డి, ఉమ్మిసలీం, శ్రీకాంత్‌రెడ్డి, శివప్ప పాల్గొన్నారు.

చిప్పగిరి, న్యూస్‌టుడే: చిప్పగిరికి చెందిన వైకాపా తాలూకా నాయకుడు పోతరాజు రాముడు, ఆయన అనుచరులు వీరభద్రగౌడ్‌ సమక్షంలో మంగళవారం తెదేపాలో చేరారు.

చిప్పగిరి, న్యూస్‌టుడే: చిప్పగిరితో పాటు బంటనహాలు, బెల్డోణ, తిమ్మాపురం తదితర గ్రామాల్లో ఆలూరు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్రగౌడ్‌ మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో జడ్పీటీసీ సభ్యుల రాష్ట్ర సంఘం మాజీ అధ్యక్షుడు మీనాక్షినాయుడు, చిప్పగిరి ఎంపీటీసీ సభ్యురాలు యల్లంకి రజనీ, మండల కన్వీనర్‌ లాయర్‌ షేక్షావలి, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఆలూరు గ్రామీణ, న్యూస్‌టుడే : ఆలూరు మండలంలోని హుళేబీడు, కురవళ్లి గ్రామాల్లో తెదేపా మహిళా నాయకురాలు వైకుంఠం జ్యోతి మంగళవారం తెదేపా ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈమె వెంట కురవళ్లి సర్పంచి రవి, అరికెర సర్పంచి నాగరాజు, నాయకులు ప్రకాశ్‌, గోవిందు, మల్లి, రాము పాల్గొన్నారు.

కృష్ణగిరి, న్యూస్‌టుడే: కృష్ణగిరి మండలంలోని చుంచుఎర్రగుడి గ్రామంలో రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించి అనంతరం సంగాల, ఆగవేలి, పోతుగల్లు, మల్లాపురం గ్రామాల్లో తెదేపా నాయకులు ప్రకాశ్‌గౌడు, శేఖర్‌, పుల్లన్న, కిష్టన్న, సోమలింగడులతో కలసి తెదేపా ఎంపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ శ్యాంబాబు మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

తుగ్గలి, న్యూస్‌టుడే: పత్తికొండ తెదేపా అభ్యర్థి కేఈ శ్యాంబాబు గెలుపు కోసం ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు తుగ్గలి నాగేంద్ర, బత్తిన వెంకటరాముడు, తిమ్మయ్యచౌదరి, మనోహర్‌చౌదరి బొల్లవానిపల్లి, లంకాయపల్లి గ్రామాల్లో మంగళవారం ఎన్నికల ప్రచారం చేపట్టారు.

మద్దికెర, న్యూస్‌టుడే: మద్దికెరలో జడ్పీటీసీ మాజీ సభ్యుడు రాజన్న, ఎన్నికల ఇన్‌ఛార్జి దివాకర్‌గౌడ్‌, మండల కన్వీనరు శివప్రసాద్‌, తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రశేఖరగౌడ్‌, ఎంపీటీసీ మాజీ సభ్యుడు మహమ్మద్‌రఫి, పార్టీ నాయకులు మంగళవారం ఇంటింటికి ప్రచారం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని