logo

మా నాన్నను గెలిపించండి..

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో శ్రీశైలం నియోజకవర్గం తెదేపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న  తన తండ్రి బుడ్డా రాజశేఖర్‌రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని, ఆయన కుమార్తె  బుడ్డా మేఘనారెడ్డి కోరారు.

Published : 01 May 2024 12:26 IST

సున్నిపెంట సర్కిల్‌: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో శ్రీశైలం నియోజకవర్గం తెదేపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న  తన తండ్రి బుడ్డా రాజశేఖర్‌రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని, ఆయన కుమార్తె  బుడ్డా మేఘనారెడ్డి కోరారు. సున్నిపెంటలోని 19, 20 బూత్‌లలో ఎన్నికల  ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ తన భర్త సాయి జయంత్‌రెడ్డితో కలిసి విస్తృతంగా ప్రచారం చేశారు. సున్నిపెంట అభివృద్ధి చెందాలంటే తెదేపాను గెలిపించాలని సూచించారు. తెదేపా సూపర్‌ సిక్స్‌ పథకాల గురించి ఓటర్లకు వివరించారు. ఆమె వెంట తెదేపా, జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని