సూపర్ 6 పథకాలతో ప్రతి కుటుంబానికి లబ్ధి
సూపర్ 6 పథకాలతో ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరుతుందని పత్తికొండ తెదేపా అభ్యర్థి కేఈ. శ్యాంబాబు అన్నారు.
వెల్దుర్తి : సూపర్ 6 పథకాలతో ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరుతుందని పత్తికొండ తెదేపా అభ్యర్థి కేఈ. శ్యాంబాబు అన్నారు. వెల్దుర్తి మండలంలోని శ్రీరంగాపురం, గోవర్ధనగిరి గ్రామాలలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు ప్రతినెల ఆర్థిక సహాయం, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తెదేపా లక్ష్యమన్నారు. మండలంలో ఫార్మాసిటికల్ కంపెనీలు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు. ఈ నెల 13న జరగనున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని ఓటర్లను కోరారు. ఆయన వెంట తెదేపా నాయకులు కే ఈ. నిఖిలేష్, సుబ్బరాయుడు, బలరామ గౌడ్, జ్ఞానేశ్వర్ గౌడ్, రమాకాంత్ రెడ్డి, అమర్నాథ్ గౌడ్ తదితరులు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇసుక మింగారు.. కాలుష్యం నింపారు
[ 22-05-2024]
రాయలసీమ జీవనదిగా పేరొందిన తుంగభద్ర కాలుష్య కోరల్లో చిక్కుకుంది. సుంకేసుల జలాశయానికి అతి సమీపంలో నది లోపల బోట్ల సాయంతో (డ్రెడ్జింగ్) ఇసుకను తోడేశారు.. నాలుగేళ్లుగా జలాశయం వెనుక జలాల్లో భారీ ఎత్తున ఇసుక తవ్వేశారు. -
కుందూ మన్ను.. అక్రమార్కుల కన్ను
[ 22-05-2024]
కుందూ తీరంలో మాఫియా మన్ను బుక్కుతోంది.. నది వెంట 20 కి.మీల పొడవున ఆయా గ్రామాల్లో పలుచోట్ల పొక్లెయిన్లు పెట్టి తవ్వకాలు సాగిస్తున్నారు. లారీలు, ట్రాక్టర్లతో అక్రమ రవాణా చేస్తున్నారు. -
చెమ్మగిల్లిన చెరువు
[ 22-05-2024]
నీటి వనరులు ‘చిన్న’బోతున్నాయి.. భారీ, మధ్య తరహా ప్రాజెక్టులు నిర్మించలేక, నిధులివ్వక చేతులెత్తేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆఖరికి చెరువులపైనా శీతకన్నేసింది. -
ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు
[ 22-05-2024]
రాయలసీమ యూనివర్సిటీలో కౌంటింగ్ నిర్వహణకు పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.జి.సృజన తెలిపారు. -
పత్తి చేనులో గంజాయి సాగు
[ 22-05-2024]
కర్ణాటకలోని బళ్లారిలో ఇద్దరు వ్యక్తులు గంజాయి విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. పోలీసులు ఆరా తీయడంతో డొంక కదిలింది. -
ఆటల్లో సత్తా.. గురుకులంలో సీటు
[ 22-05-2024]
గురుకుల విద్యాలయం పేద విద్యార్థుల ఆశా కిరణంగా నిలిచింది. ఇందులో సీటు రావాలంటే పోటీ పరీక్షల్లో సత్తా చాటాలి. కొంత మంది క్రీడాకారులు ఆటల్లో చూపిన ప్రతిభతో క్రీడా కోటా కింద సీటు పొందారు. -
తేరుపై జ్వాలా నృసింహుని విహారం
[ 22-05-2024]
వైశాఖ మాస నృసింహ జయంతి బ్రహ్మోత్సవాలతో ఎగువ అహోబిలం ఉత్సవ శోభను సంతరించుకుంది. స్వామి నిత్య అలంకృతుడై వాహనాలపై దర్శనమిస్తూ భక్తులకు కనువిందు చేస్తున్నారు. -
నీటి పరీక్ష కిట్లకు.. కటకట
[ 22-05-2024]
ప్రజలు అనారోగ్యానికి గురవడానికి ప్రధాన కారణం నీరు కలుషితం కావడమే. జిల్లాలో చాలా ప్రాంతాలలో నీరు కలుషితం కావడంతో అతిసారంతో మరణాలు సంభవించడంతో పాటు, పదుల సంఖ్యలో ప్రజలు ఆసుపత్రుల పాలవుతున్నారు. -
విజ్ఞాన వేదిక.. వినోదాల కానుక
[ 22-05-2024]
ప్రస్తుతం బాలలకు చరవాణే ప్రపంచం.. పుస్తక పఠనం మరిచారు.. ఆటపాటల ఊసే లేదు.. ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడేసేందుకు గ్రంథాలయ సంస్థ వేసవి వినోదానికి శ్రీకారం చుట్టింది. -
నగర నగిషీలు.. నగుబాటు
[ 22-05-2024]
కర్నూలు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పలు కూడళ్లలో సుందరీకరణ పనులు ముందుకు సాగడం లేదు. గతంలో పలు ప్రాంతాల్లో బొమ్మలు, పచ్చదనం ఉండేలా కూడళ్లను తీర్చిదిద్దారు, ప్రస్తుతం వాటిని తొలగంచి మళ్లీ పనులు చేస్తున్నారు. -
సంక్షేమం కాదు.. తలపై గండం
[ 22-05-2024]
కర్నూలు నగరంలోని సంక్షేమ భవనం పెచ్చులూడి చువ్వలు తేలి ప్రమాదకరంగా మారింది. నిర్వహణ లేకపోవడం, మరమ్మతులు అసలే చేపట్టకపోవడంతో బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్నామని సిబ్బంది చెబుతున్నారు. -
నంద్యాల పట్టణంలో నాకాబందీ
[ 22-05-2024]
ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం తెల్లవారుజాము నుంచి పోలీసులు నాకాబందీ నిర్వహించారు. -
బ్యాంకు ఖాతాలోని రూ.50 వేలు మాయం
[ 22-05-2024]
ఆత్మకూరు పట్టణంలోని రహ్మత్నగర్కు చెందిన పెయింటర్ షేక్ మహబూబ్బాషా బ్యాంకు ఖాతా నుంచి రూ.50 వేలు చోరీకి గురయ్యాయి.