logo

కోట్ల, కేఈ కుటుంబాలతోనే అభివృద్ధి

డోన్‌ నియోజకవర్గంలో కోట్ల, కేఈ కుటుంబాల పాలనలోనే అభివృద్ధి జరిగిందని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్‌ పేర్కొన్నారు.

Published : 03 May 2024 03:44 IST

బూరుగల (ప్యాపిలి), న్యూస్‌టుడే: డోన్‌ నియోజకవర్గంలో కోట్ల, కేఈ కుటుంబాల పాలనలోనే అభివృద్ధి జరిగిందని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్‌ పేర్కొన్నారు. గురువారం మండలంలోని బూరుగల, సీˆతమ్మతాండ గ్రామాల్లో ‘బాబు స్యూరిటీ...భవిష్యత్తుకు గ్యారంటీ’ని నిర్వహించారు.  వారు మాట్లాడుతూ కోట్ల, కేఈ కుటుంబాల మధ్య ఎటువంటి ఫ్యాక్షనిజం లేదని తేల్చి చెప్పారు. ఆర్థికమంత్రి బుగ్గన అభివృద్ధి చేశానని గొప్పలు చెబుతున్నారే గానీ ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించలేకపోయారని ధ్వజమెత్తారు. రాష్ట్ర కార్యదర్శి వై.నాగేశ్వరరావుయాదవ్‌, లక్కసాగరం లక్ష్మిరెడ్డి, లక్ష్మినారాయణ యాదవ్‌, చిన్నికృష్ణ, రామసుబ్బయ్య, టి.శ్రీనివాసులు, కేసీˆ మద్దిలేటి, అలేబాద్‌ పరమేష్‌, వెంకటరమణాచారి, వెంకట్రాముడు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని