ఉద్యోగుల ఓట్లు గల్లంతు
పోస్టల్ బ్యాలట్ వినియోగంలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఎన్నికల విధులను సక్రమంగా నిర్వహించడంలో అధికారులు విఫలమయ్యారు. దీంతో వందలాది మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఇబ్బందులకు గురయ్యారు. ఎక్కడా సరైన సౌకర్యాలు, సదుపాయాలు కల్పించలేదు.
తొలిరోజు తీవ్ర గందరగోళం
కర్నూలు సచివాలయం, న్యూస్టుడే: పోస్టల్ బ్యాలట్ వినియోగంలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఎన్నికల విధులను సక్రమంగా నిర్వహించడంలో అధికారులు విఫలమయ్యారు. దీంతో వందలాది మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఇబ్బందులకు గురయ్యారు. ఎక్కడా సరైన సౌకర్యాలు, సదుపాయాలు కల్పించలేదు. ఉద్యోగులను పోస్టల్ బ్యాలట్కు దూరం చేసేందుకు వైకాపాకు కొమ్ముకాసే కొందరు అధికారులు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సోమవారం చోటుచేసుకున్న కొన్ని ఘటనలు దీనికి ఊతమిస్తున్నాయి. జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో మొత్తం 20,351 మంది పోస్టల్ బ్యాలెట్కు దరఖాస్తు చేసుకున్నారు. మొదటి రోజైన సోమవారం జిల్లాలో 6,503 (31.59శాతం) మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకొన్నారు.
ఉత్సాహంగా ముందుకొచ్చారు
జిల్లా వ్యాప్తంగా తొలి రోజు పోస్టల్ బ్యాలట్ వేసేందుకు అధికారులు, ఉద్యోగులు ఉత్సాహం చూపారు. ఎనిమిది కేంద్రాల వద్ద ఓటేసేందుకు ఉద్యోగులు బారులు తీరారు. ఫెసిలిటేషన్ కేంద్రాల వివరాలను ఉద్యోగుల చరవాణి నంబర్లకు సంక్షిప్త సమాచారం పంపారు. సమాచారం అందని ఉద్యోగులు ఫెసిలిటేషన్ సెంటర్ల కోసం కొంత ఇబ్బందులు పడ్డారు. ఓటింగ్ ప్రక్రియలో ఒక్కో ఉద్యోగి ఓటేసేందుకు 10-15 నిమిషాల సమయం పడుతుంది. మొదటి గంటలో తక్కువ మంది ఓటేశారు. ఆ తర్వాత గంట గంటకు పోలింగ్ శాతం పెరుగుతూ వచ్చింది.
ఎనిమిది నియోజకవర్గాల పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులకు 8వ తేదీ వరకు ఓటేసేందుకు అవకాశం కల్పించారు. ఈనెల ఒకటో తేదీ నాటికి ఫారం-12 ఇవ్వలేకపోయినవారికి 7, 8 తేదీల్లో వారు ఓటరుగా ఏ నియోజకవర్గంలో నమోదై ఉంటారో వారి కోసం అక్కడి రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో లేదా ఫెసిలిటేషన్ సెంటరులో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఇంతకీ మాఓట్లెక్కడ..
పోస్టల్ బ్యాలట్ ఓటు వేద్దామంటే ఇక్కడ ఓటు లేదని చెబుతున్నారని, నందికొట్కూరు కేంద్రం పరిధిలోనూ తమ ఓట్లు లేవని చెప్పారంటూ నగరంలోని సిల్వర్జూబ్లీ కళాశాలలో అధికారులను నిలదీస్తున్న ఉద్యోగులు
పాణ్యం ఓటర్ల పరేషాన్
పాణ్యం నియోజకవర్గ పరిధిలో ఓటర్లుగా ఉన్న ఉద్యోగులు 1,250 మంది నందికొట్కూరు, ఆళ్లగడ్డ, డోన్, శ్రీశైలం తదితర నియోజకవర్గాలకు పీవోలు, ఏపీవోలుగా విధులు నిర్వహిస్తున్నారు. రెండో విడత ఎక్కడైతే శిక్షణకు హాజరయ్యారో అక్కడ ఫెసిలిటేషన్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకొనే అవకాశం కల్పించారు.. అక్కడ జాబితాల్లో వారి పేర్లు కనిపించలేదు. ఆందోళనకు గురైన వారు కర్నూలు జిల్లా కేంద్రంలోని బి.క్యాంపు ప్రభుత్వం బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పాణ్యం నియోజకవర్గ ఫెసిలిటేషన్ సెంటరులో ఓటేసేందుకు వచ్చారు. అక్కడా జాబితాలో వారి పేర్లు లేవని.. తాము ఎక్కడికెళ్లి ఓటేయాలంటూ ఎన్నికల సిబ్బంది, రిటర్నింగ్ అధికారి (ఆర్వో)తో ఉద్యోగులు వాగ్వాదానికి దిగారు. 1,500 మంది ఓటర్ల పేర్లు గల్లంతయితే ఎలా.. వారి పరిస్థితి ఏంటని పాణ్యం ఆర్వో, జేసీ నారపురెడ్డి మౌర్యను పాణ్యం తెదేపా అభ్యర్థి గౌరు చరితారెడ్డి ప్రశ్నించారు. ‘‘ ఓటర్ల వివరాలు, పోస్టల్ బ్యాలట్ సామగ్రిని నంద్యాల జిల్లా కలెక్టర్కు పంపాం.. అక్కడి నుంచి ఆయా నియోజకవర్గాలకు జాబితాను పంపాల్సి ఉంది.. సమాచార లోపంతో పొరపాటు జరిగింది.. దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. ఎక్కడైతే రెండో విడత శిక్షణ పొందారో అక్కడ మంగళవారం ఓటేయొచ్చు లేదంటే కర్నూలు జిల్లా కేంద్రంలోని పాణ్యం ఫెసిలిటేషన్ సెంటరులో ఓటేయాలనుకుంటే.. సదరు ఉద్యోగులు మంగళవారం ఫారం-12 దరఖాస్తులు అందజేస్తే వారికి ఈనెల 8న ఇక్కడే ఓటేసేందుకు అవకాశం కల్పిస్తామని’’ ఆర్వో వివరణ ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టిడ్కో ఇళ్లలో పోలీసుల సోదాలు
[ 19-05-2024]
పట్టణంలోని కోయిలకుంట్ల రోడ్డులో ఉన్న ప్రభుత్వ టిడ్కో ఇళ్ల సముదాయాల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. -
పుర జనం గొంతులో గరళం
[ 19-05-2024]
ఏటా నీటి పన్నుల కింద రూ.లక్షలు సమకూరుతున్నాయి. నీటి శుద్ధి పుర బడ్జెట్ కింద భారీగా వెచ్చిస్తున్నారు.. లీకేజీల నివారణకు రూ.లక్షలు ధారబోస్తున్నారు.. నీరు రంగు మారుతోంది.. దుర్వాసన వస్తోంది.. తాగలేకపోతున్నామని పుర ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. -
ఆర్యూ.. అక్రమాల పుట్ట
[ 19-05-2024]
రాయలసీమ విశ్వవిద్యాలయంలో అక్రమాలు వెలుగులోకి వస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.. విచారణ సమగ్రంగా కొనసాగడం లేదు.. కొన్ని ఘటనల్లో విచారణలు పూర్తైనా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. -
పరీక్ష ప్రశ్నార్థకం
[ 19-05-2024]
రాయలసీమ విశ్వవిద్యాలయంలోని పరీక్షల విభాగానికి చెందిన ఓ ఉన్నతాధికారి నిర్లక్ష్యంతో వందల విద్యార్థుల జీవితాలు ఇబ్బందుల్లో పడ్డాయి. -
చిరుజల్లులకే ఛిద్రం
[ 19-05-2024]
కొత్తగా నిర్మిస్తున్న 340(బి) జాతీయ రహదారి చిరుజల్లులకే ఛిద్రమైంది.. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పగుల్లొచ్చాయి. హడావుడిగా పనులు చేయడంతోనే ఈ పరిస్థితి తలెత్తినట్లు ఆరోపణలు వస్తున్నాయి. -
బాక్సింగ్ కింగ్లు.. ఆదోని కుర్రాళ్లు
[ 19-05-2024]
ఆ కుర్రాళ్లు కొట్టే దెబ్బలకు దవడలు అదిరిపోతాయి.. మెదడులోని నరాల్లో కదలికలు పుడతాయి.. రింగులోకి ప్రత్యర్థి రావాలంటేనే భయపడే పరిస్థితి.. పతకాలు మాత్రం వచ్చి వాలిపోతాయి. -
స్ట్రాంగ్ రూమ్ల ఎదుట నిరంతర నిఘా: కలెక్టర్
[ 19-05-2024]
పార్లమెంట్, శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూంల ఎదుట 24 గంటలు నిరంతర నిఘా ఉంచినట్లు కలెక్టర్ కె.శ్రీనివాసులు, ఎస్పీ రఘువీర్రెడ్డి పేర్కొన్నారు. -
ఓపీక పడితేనే వైద్యం
[ 19-05-2024]
నంద్యాల సర్వజన ఆసుపత్రిలో ఓపీ సేవలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పెంచినా వైద్యులు మాత్రం గదుల్లో ఉండకపోవడంతో అరకొరగా సేవలు అందుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. -
లక్ష్య సాధనలోగెలుపు సందేశం
[ 19-05-2024]
తల్లిదండ్రుల ప్రోత్సాహం.. కష్టపడి చదవడం.. అనుకున్న లక్ష్యం చేరుకోవాలన్న కసి.. వెరసి ఆ విద్యార్థిని విజయం వైపు నడిపించాయి. పదో తరగతిలో పదికి పది.. ఇంటర్లో ఉత్తమ ఫలితాలతో ప్రశంసలు అందుకున్నాడు. -
బీఎల్వోలకు అందని భృతి
[ 19-05-2024]
ఎన్నికల విధులకు సంబంధించి బీఎల్వోలు నిరంతరం కష్టపడ్డారు. క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించారు.. ఓటర్ల మార్పులు, చేర్పుల్లో కీలకపాత్ర పోషించారు. పైసా పారితోషికం అందడం లేదు. -
తెలంగాణ ఎంసెట్లో విద్యార్థుల ప్రతిభ
[ 19-05-2024]
తెలంగాణ ఎంసెట్ (అగ్రికల్చర్)లో కర్నూలు నారాయణ విద్యార్థులు ప్రతిభ చాటారని డీజీఎం గోవర్ధన్ తెలిపారు. -
మహానంది క్షేత్రంలో భక్తుల రద్దీ
[ 19-05-2024]
మహానంది పుణ్యక్షేత్రంలో శనివారం భక్తుల రద్దీతో సందడి నెలకొంది. వరుసగా సెలవులు రావడంతో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులే కాకుండా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి మహానందికి తరలివచ్చారు. -
నృసింహస్వామి జయంతి బ్రహ్మోత్సవాలు
[ 19-05-2024]
వైశాఖ మాస నృసింహ జయంతి బ్రహ్మోత్సవాల్లో నరహరుడు అహోబిలం లక్ష్మీనృసింహస్వామి వేణుగోపాల స్వామి అలంకరణలో శనివారం భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం స్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా పల్లకిపై కొలువుదీర్చి ఆలయ తిరువీధుల్లో మేళతాళాలతో ఊరేగించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్గా క్రిస్గేల్: జెర్సీ ఇంకా ఫిట్గానే ఉందన్న యూనివర్స్ బాస్
-
రిషి సునాక్ దంపతుల సంపద.. రాజు ఆస్తుల కంటే ఎక్కువ!
-
ధోనీపై కమల్ ప్రశంసలు.. క్రిస్గేల్తో రిషబ్ ఫొటో
-
ఎయిర్లైన్స్ లాభాల్లో బిగ్ జంప్.. ఉద్యోగులకు 8 నెలల జీతం బోనస్..
-
బలహీనపడిన ఆవర్తనం.. తెలంగాణలో మరో 3 రోజుల పాటు వర్షాలు
-
తెలంగాణ కేబినెట్ భేటీ.. షరతులతో కూడిన అనుమతిచ్చిన ఈసీ