గనుల వాటా..జగన్ టాటా
గనుల తవ్వకాలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితమయ్యే 10-25 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాల్లో అభివృద్ధి పనులకు డీఎంఎఫ్ నిధులు వినియోగించుకోవాలని జీవో నంబరు 36 చెబుతోంది.
పంచాయతీలకు జమ చేయని ప్రభుత్వం
నంద్యాల పట్టణం, బనగానపల్లి
గతం..
గనుల తవ్వకాలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితమయ్యే 10-25 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాల్లో అభివృద్ధి పనులకు డీఎంఎఫ్ నిధులు వినియోగించుకోవాలని జీవో నంబరు 36 చెబుతోంది. మంచినీరు, విద్య, వైద్య సేవలకు ప్రాధాన్యం ఇవ్వాలని తర్వాత రోడ్లు, ఇతర పనులకు వినియోగించుకోవాలి.
ప్రస్తుతం..
వైకాపా సర్కారు వచ్చాక డీఎంఎఫ్ నిధుల వినియోగానికి అవరోధాలు ఎదురవుతున్నాయి. డబ్బుల వినియోగంపై ఆంక్షలు పెట్టడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. డీఎంఎఫ్ నిధులతో చేపట్టిన పనుల్లో కదలిక లేకుండా పోయింది.
ఏ సంవత్సరంలో ఏం జరిగింది
- 2019-2021 మధ్య కాలంలో మైనింగ్ లీజుదారుల నుంచి సీనరేజ్ ఛార్జీల రూపంలో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల మేరకు ఆదాయం రాలేదు.. వచ్చిన నిధులు ఎక్కడ ఖర్చు పెడుతున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. 2021-22, 22-23 సంవత్సరాలకు సంబంధించి ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చింది.
- జిల్లా విభజన తర్వాత రూ.50 కోట్లపై పంచాయతీ నడిచింది. రెండు జిల్లాలకు సమానంగా పంచాలని జిల్లా విభజన మొదట్లో చెప్పారు. కాదు.. కాదు.. గనులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు ఎక్కువ నిధులు పంచుకోవాలని తర్వాత సూచించారు.
- 2023- 24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కొలిమిగుండ్ల, అవుకు, బేతంచెర్ల, డోన్ మండలాల్లో అత్యధికంగా రూ.8 కోట్ల వరకు సీనరేజీ ప్రభుత్వానికి సమకూరింది. కానీ వాటిని పంచాయతీలకు బదిలీ చేయడం లేదు.
ఏటా రూ.60 కోట్ల ఆదాయం
బనగానపల్లి, అవుకు, కొలిమిగుండ్ల, బేతంచెర్ల, పాణ్యం, డోన్, ప్యాపిలి, కృష్ణగిరి, వెల్దుర్తి, ఓర్వకల్లు, సి.బెళగల్ తదితర మండలాల్లో గనులు ఉన్నాయి. ఒక్క నంద్యాల జిల్లా పరిధిలోనే వెయ్యి వరకు క్వారీలు ఉన్నాయి. ప్రత్యేకించి నాపరాళ్లు, ఇనుప ఖనిజం, సిలికా, క్వార్ట్జ్, డోలమైట్ గనులు ఉన్నాయి. వీటిని లీజుకు తీసుకున్న వారు సీనరేజి ఛార్జీల్లో 30 శాతం డీఎంఎఫ్గా చెల్లించాల్సి ఉంటుంది. ఉమ్మడి జిల్లాకు సీనరేజీ ఆదాయం రూ.80 కోట్ల వరకు వస్తుంది. ఒక్కో త్రైమాసికానికి సంబంధించి రూ.20 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుంది. కర్నూలు జిల్లాలో రూ.25 కోట్లు, నంద్యాల జిల్లాలో రూ.35 కోట్లు మైనింగ్ సీనరేజీ ద్వారా వస్తుంది.
పల్లెలకు పంచని ప్రభుత్వం
గనుల లీజుదారుల నుంచి జిల్లా ఖనిజాభివృద్ధి నిధి (డీఎంఎఫ్)కి దండిగా డబ్బులు సమకూరుతున్నాయి. అవి పల్లె ఖాతాకు చేరడం లేదు. ప్రభుత్వ ఆమోదం మేరకు డీపీవో అధికారులు పంచాయతీలకు బదిలీ చేస్తారు. నిబంధనల ప్రకారం ఆదాయంలో 25 శాతం పంచాయతీలకు, 50 శాతం మండల పరిషత్తులకు, 25 శాతం జిల్లా పరిషత్తులకు కేటాయించాలి.
సీనరేజీ నిధులు పంచాయతీల వారీగా వసూలు చేస్తున్నట్లు లెక్కలు చెబుతున్నారు. నిధుల కేటాయింపు జరగడం లేదు. కొన్నిచోట్ల గ్రామ పంచాయతీల వారీగా కాకుండా రెవెన్యూ గ్రామం కింద ఆదాయం వచ్చినట్లు చూపుతూ దారి మళ్లిస్తున్నారు. పంచాయతీల వారీగా సీనరేజీని వసూలు చేసినట్లు జిల్లా పంచాయతీ శాఖకు గనుల శాఖ నివేదిక అందించింది. కానీ పంచాయతీల ఖాతాలో జమ కాకపోవడం గమనార్హం.
వినియోగంలో అధికార పెత్తనం
సీనరేజీ నిధులు గనులున్న గ్రామాలకే కేటాయించాల్సి ఉంది. అధికార పార్టీ నేతలు చెప్పిన పల్లెలకు మళ్లిస్తున్నారు. డోన్ నియోజకవర్గంలో ఆర్థిక శాఖ మంత్రి సహాయకులు తమ పంట పొలాల్లో రూ.2 కోట్ల డీఎంఎఫ్ నిధులతో రోడ్లు వేయించుకున్నారు. దీనిపై గతంలో పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. డీఎంఎఫ్ నిధుల వినియోగంపై ఆడిట్ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తున్నారు. గతంలో ఏపీ అకౌంటెంట్ జనరల్ (ఏజీ) అభ్యంతరం తెలిపినప్పటికీ నిధుల వినియోగంపై ఆడిటింగ్ జరగడం లేదు. ప్రజాప్రతినిధులు కలెక్టర్లతో ఒప్పించి తన్నుకుపోతున్నారు. మైనింగ్ ప్రాంతాలు కాని చోట్ల వెచ్చించి గనులు ఉండే ప్రాంతాలకు అన్యాయం చేస్తున్నారు.
ఒనగూరని మౌలిక వసతులు
- బనగానపల్లి నియోజకవర్గంలో పలుకూరు, రామకృష్ణాపురం, దేవనగర్, చెర్వుపల్లె, బీరవోలు, రామతీర్థం ప్రాంతాల్లో నాపరాతి గనులెక్కువ. ఒక్క పలుకూరు నుంచే ఏటా రూ.5 కోట్ల వరకు డీఎంఎఫ్ ఖాతాలో జమ అవుతున్నాయి. ఆయా ప్రాంతాలకు వెళ్లడానికి ఇప్పటికీ సరైన మార్గం లేదు.
- కొలిమిగుండ్ల, బనగానపల్లి, ప్యాపిలి, గడివేముల మండలాల పరిధిలో ఆరు సిమెంటు పరిశ్రమలు ఉన్నాయి. నిత్యం వేల టన్నుల ఉత్పత్తి జరుగుతోంది. వెయ్యి మెట్రిక్ టన్నుల ఉత్పత్తికి రూ.27 వేలు జిల్లా ఖనిజాభివృద్ధి (డీఎంఎఫ్)కి వెళ్తాయి. ఇలా భారీగా ప్రభుత్వ ఖజానాకు ఆదాయం సమకూరుతున్నా ఆయా ప్రాంతాలు నేటికీ అభివృద్ధికి నోచుకోవడం లేదు.
- బేతంచెర్ల మండలం ఆర్ఎస్.రంగాపురం, బుగ్గనపల్లె, చిన్న మల్కాపురం తదితర గ్రామాల్లో ఏడాది కాలంలో ఒక్క అభివృద్ధి పని చేయలేదని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లె, అవుకు మండలం రామాపురం, బేతంచెర్ల మండలం మల్కాపురం, ఎంబాయి, పాణ్యం మండలం తమ్మరాజుపల్లె, ఓర్వకల్లు తదితర ప్రాంతాల్లో సీనరేజీ ఆదాయం రెవెన్యూ గ్రామం కింద వచ్చినట్లు చూపి సమీప పంచాయతీలకు పంచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీశైలంలో భక్తులకు చుక్కలు చూపించిన ట్రాఫిక్
[ 19-05-2024]
ద్వాదశ జ్యోతిర్లంగ క్షేత్రమైన శ్రీశైలం ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. -
టిడ్కో ఇళ్లలో పోలీసుల సోదాలు
[ 19-05-2024]
పట్టణంలోని కోయిలకుంట్ల రోడ్డులో ఉన్న ప్రభుత్వ టిడ్కో ఇళ్ల సముదాయాల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. -
పుర జనం గొంతులో గరళం
[ 19-05-2024]
ఏటా నీటి పన్నుల కింద రూ.లక్షలు సమకూరుతున్నాయి. నీటి శుద్ధి పుర బడ్జెట్ కింద భారీగా వెచ్చిస్తున్నారు.. లీకేజీల నివారణకు రూ.లక్షలు ధారబోస్తున్నారు.. నీరు రంగు మారుతోంది.. దుర్వాసన వస్తోంది.. తాగలేకపోతున్నామని పుర ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. -
ఆర్యూ.. అక్రమాల పుట్ట
[ 19-05-2024]
రాయలసీమ విశ్వవిద్యాలయంలో అక్రమాలు వెలుగులోకి వస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.. విచారణ సమగ్రంగా కొనసాగడం లేదు.. కొన్ని ఘటనల్లో విచారణలు పూర్తైనా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. -
పరీక్ష ప్రశ్నార్థకం
[ 19-05-2024]
రాయలసీమ విశ్వవిద్యాలయంలోని పరీక్షల విభాగానికి చెందిన ఓ ఉన్నతాధికారి నిర్లక్ష్యంతో వందల విద్యార్థుల జీవితాలు ఇబ్బందుల్లో పడ్డాయి. -
చిరుజల్లులకే ఛిద్రం
[ 19-05-2024]
కొత్తగా నిర్మిస్తున్న 340(బి) జాతీయ రహదారి చిరుజల్లులకే ఛిద్రమైంది.. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పగుల్లొచ్చాయి. హడావుడిగా పనులు చేయడంతోనే ఈ పరిస్థితి తలెత్తినట్లు ఆరోపణలు వస్తున్నాయి. -
బాక్సింగ్ కింగ్లు.. ఆదోని కుర్రాళ్లు
[ 19-05-2024]
ఆ కుర్రాళ్లు కొట్టే దెబ్బలకు దవడలు అదిరిపోతాయి.. మెదడులోని నరాల్లో కదలికలు పుడతాయి.. రింగులోకి ప్రత్యర్థి రావాలంటేనే భయపడే పరిస్థితి.. పతకాలు మాత్రం వచ్చి వాలిపోతాయి. -
స్ట్రాంగ్ రూమ్ల ఎదుట నిరంతర నిఘా: కలెక్టర్
[ 19-05-2024]
పార్లమెంట్, శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూంల ఎదుట 24 గంటలు నిరంతర నిఘా ఉంచినట్లు కలెక్టర్ కె.శ్రీనివాసులు, ఎస్పీ రఘువీర్రెడ్డి పేర్కొన్నారు. -
ఓపీక పడితేనే వైద్యం
[ 19-05-2024]
నంద్యాల సర్వజన ఆసుపత్రిలో ఓపీ సేవలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పెంచినా వైద్యులు మాత్రం గదుల్లో ఉండకపోవడంతో అరకొరగా సేవలు అందుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. -
లక్ష్య సాధనలోగెలుపు సందేశం
[ 19-05-2024]
తల్లిదండ్రుల ప్రోత్సాహం.. కష్టపడి చదవడం.. అనుకున్న లక్ష్యం చేరుకోవాలన్న కసి.. వెరసి ఆ విద్యార్థిని విజయం వైపు నడిపించాయి. పదో తరగతిలో పదికి పది.. ఇంటర్లో ఉత్తమ ఫలితాలతో ప్రశంసలు అందుకున్నాడు. -
బీఎల్వోలకు అందని భృతి
[ 19-05-2024]
ఎన్నికల విధులకు సంబంధించి బీఎల్వోలు నిరంతరం కష్టపడ్డారు. క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించారు.. ఓటర్ల మార్పులు, చేర్పుల్లో కీలకపాత్ర పోషించారు. పైసా పారితోషికం అందడం లేదు. -
తెలంగాణ ఎంసెట్లో విద్యార్థుల ప్రతిభ
[ 19-05-2024]
తెలంగాణ ఎంసెట్ (అగ్రికల్చర్)లో కర్నూలు నారాయణ విద్యార్థులు ప్రతిభ చాటారని డీజీఎం గోవర్ధన్ తెలిపారు. -
మహానంది క్షేత్రంలో భక్తుల రద్దీ
[ 19-05-2024]
మహానంది పుణ్యక్షేత్రంలో శనివారం భక్తుల రద్దీతో సందడి నెలకొంది. వరుసగా సెలవులు రావడంతో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులే కాకుండా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి మహానందికి తరలివచ్చారు. -
నృసింహస్వామి జయంతి బ్రహ్మోత్సవాలు
[ 19-05-2024]
వైశాఖ మాస నృసింహ జయంతి బ్రహ్మోత్సవాల్లో నరహరుడు అహోబిలం లక్ష్మీనృసింహస్వామి వేణుగోపాల స్వామి అలంకరణలో శనివారం భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం స్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా పల్లకిపై కొలువుదీర్చి ఆలయ తిరువీధుల్లో మేళతాళాలతో ఊరేగించారు.
తాజా వార్తలు (Latest News)
-
నరసరావుపేటలో రెండో రోజు సిట్ దర్యాప్తు.. పోలీస్ స్టేషన్కు మంత్రి అంబటి
-
హిందీ ‘గజనీ’.. మురుగదాస్ ఫస్ట్ ఛాయిస్ సల్మాన్
-
అత్యంత పొట్టి మహిళతో ది గ్రేట్ ఖలీ.. వీడియో వైరల్
-
ధోనీ కొట్టిన ఆ భారీ సిక్సే ఆర్సీబీని గెలిపించిందా..?
-
వైకాపా ఆధ్వర్యంలో పోస్టల్ బ్యాలెట్ల తరలింపు.. కూటమి అభ్యర్థుల ఆందోళన
-
పార్లమెంటు భద్రత.. రంగంలోకి 3300 మంది ‘సీఐఎస్ఎఫ్’ సిబ్బంది