ప్రశ్నించే గొంతుకలపై కత్తి
ఐదేళ్ల వైకాపా పాలనలో ప్రజాస్వామ్యం కనుమరుగైంది. అన్యాయాన్ని ప్రశ్నిస్తే దాడులు.. అక్రమాలపై నిలదీస్తే కేసులు.. నిరసన తెలిపితే అణచివేశారు. అడుగడుగునా జగన్ నియంతృత్వ పోకడ ప్రదర్శించారు.
జగన్ ప్రభుత్వంలో అందరూ బాధితులే
న్యూస్టుడే, కర్నూలు నేరవిభాగం
ఐదేళ్ల వైకాపా పాలనలో ప్రజాస్వామ్యం కనుమరుగైంది. అన్యాయాన్ని ప్రశ్నిస్తే దాడులు.. అక్రమాలపై నిలదీస్తే కేసులు.. నిరసన తెలిపితే అణచివేశారు. అడుగడుగునా జగన్ నియంతృత్వ పోకడ ప్రదర్శించారు. ప్రతిపక్ష పార్టీ నాయకులు, ఉద్యోగులు, వ్యాపారులు.. అన్ని వర్గాల ప్రజలు జగన్ ప్రభుత్వంలో బాధితులయ్యారు. సామాన్యులు కనీసం నోరెత్తలేని పరిస్థితి నెలకొంది. జిల్లాలో వైకాపా నేతల దుర్మార్గాలు.. కక్ష సాధింపు చర్యలతో అందరూ అల్లాడిపోయారు.
ఉద్యోగులపై ఉక్కుపాదం
హక్కుల సాధన విషయంలో ప్రభుత్వ ఉద్యోగులను పూర్తిగా అణగదొక్కారు. విజయవాడలో తలపెట్టిన నిరసన కార్యక్రమాలను పోలీసులతో భగ్నం చేయించేందుకు సీఎం యత్నించారు. ముందస్తు అరెస్టులు చేయించటం.. తాఖీదులు ఇవ్వటం, ఉద్యోగ సంఘాల నాయకులను గృహ నిర్బంధం చేయడం తదితర చర్యలతో ఉద్యోగులు తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు. ఉపాధ్యాయుల విషయంలో జగన్ మరింత కాఠిన్యం ప్రదర్శించారన్న విమర్శలున్నాయి. చివరికి జిల్లా కేంద్రాల్లోనూ నిరసన వ్యక్తం చేసేందుకు వీలులేకుండా చేశారు.
జగనొస్తే ముందస్తు అరెస్టులు
ఉమ్మడి కర్నూలు జిల్లాకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దాదాపు 11 సార్లు వచ్చారు. వచ్చిన ప్రతిసారీ ప్రతిపక్ష పార్టీ నాయకులు, విద్యార్థి, ప్రజాసంఘాల నాయకులు కనీసం నిరసన వ్యక్తం చేయకుండా పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. పలువురికి నోటీసులివ్వడం.. గృహ నిర్బంధం చర్యలకు పాల్పడ్డారు. సీఎం వస్తున్నాడంటే అరెస్టు అవుతామన్న భావనను ప్రజాసంఘాల నాయకుల్లో తెప్పించారు.
న్యాయవాదులకూ ఆటంకాలే
ఏపీ భూయాజమాన్య హక్కు చట్టానికి వ్యతిరేకంగా ఉమ్మడి జిల్లాలో న్యాయవాదులందరూ సుదీర్ఘకాలం పోరాటం చేశారు. జిల్లా కేంద్రంలో దాదాపు రెండు నెలలపాటు ఆందోళన కార్యక్రమాలు, రిలే నిరాహార దీక్షలు చేశారు. ఈ చట్టంపై ప్రభుత్వం పునరాలోచన చేయకుండా అణచివేత చర్యలకు పాల్పడింది. చివరికి న్యాయవాదులు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. ఇటీవల దీనిని అమలుచేయాలంటూ ప్రభుత్వం మెమో జారీ చేయటంతో వారు తీవ్ర నిరాశకు గురయ్యారు.
నోరు విప్పితే రౌడీషీట్
పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి అవినీతి అక్రమాలపై మాట్లాడిన తెదేపా నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్పై ఓర్వకల్లు పోలీసుస్టేషన్లో ఏకంగా రౌడీషీట్ తెరిచారు. ఇటీవల కల్లూరు మండలం తడకనపల్లెకు ప్రచారం నిమిత్తం ఎమ్మెల్యే కాటసాని వెళ్లారు. ప్రశ్నించిన జనసేన నాయకుడిపై ఆయన అనుచరులు ఒక్కసారిగా దాడికి దిగారు. ఈ ఘటనకు సంబంధించి ఎమ్మెల్యేతోపాటు ఆయన అనుచరులపై బాధితుడు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా కౌంటర్ కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్పడంతో వెనుదిరిగారు. అంతకుముందే బాధితుడి తల్లిపై కుట్ర పన్ని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించి నోరు మెదపకుండా చేశారు. ఎమ్మెల్యే తీరు నచ్చక పార్టీ మారేందుకు సిద్ధమైన కార్పొరేటర్ జయరాముడు కుటుంబంపై కక్ష కట్టి రెండు కేసులు నమోదు చేయించారు.
అధికారం సేవలో పోలీసులు
- కర్నూలు మండలం నిడ్జూరు గ్రామంలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య విభేధాలు భగ్గుమన్నాయి. వైకాపా నాయకుల దాడిలో తెదేపా నేత మృతి చెందిన ఘటనలో నిందితులపై ఒక కేసు నమోదు కాగా బాధిత కుటుంబసభ్యులపై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు.
- 2022, అక్టోబరులో తెదేపా నేత, కోట్ల అనుచరుడు.. గోనెగండ్ల మండలం కున్నూరుకు చెందిన కురువ సిద్ధప్పను వైకాపా నాయకులు కోడుమూరు పట్టణంలో దారుణంగా హత్య చేశారు. ఆయనకు భద్రత కల్పించాలని కోరినా పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి.
- కడప ఎంపీ అవినాష్రెడ్డి తల్లిని గతేడాది కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రిలో చేర్పించిన సందర్భంలో వైకాపా నాయకులు మీడియాపై దాడికి పాల్పడ్డారు. విలేకరుల సంఘం నాయకులు పలుమార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీశైలంలో భక్తులకు చుక్కలు చూపించిన ట్రాఫిక్
[ 19-05-2024]
ద్వాదశ జ్యోతిర్లంగ క్షేత్రమైన శ్రీశైలం ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. -
టిడ్కో ఇళ్లలో పోలీసుల సోదాలు
[ 19-05-2024]
పట్టణంలోని కోయిలకుంట్ల రోడ్డులో ఉన్న ప్రభుత్వ టిడ్కో ఇళ్ల సముదాయాల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. -
పుర జనం గొంతులో గరళం
[ 19-05-2024]
ఏటా నీటి పన్నుల కింద రూ.లక్షలు సమకూరుతున్నాయి. నీటి శుద్ధి పుర బడ్జెట్ కింద భారీగా వెచ్చిస్తున్నారు.. లీకేజీల నివారణకు రూ.లక్షలు ధారబోస్తున్నారు.. నీరు రంగు మారుతోంది.. దుర్వాసన వస్తోంది.. తాగలేకపోతున్నామని పుర ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. -
ఆర్యూ.. అక్రమాల పుట్ట
[ 19-05-2024]
రాయలసీమ విశ్వవిద్యాలయంలో అక్రమాలు వెలుగులోకి వస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.. విచారణ సమగ్రంగా కొనసాగడం లేదు.. కొన్ని ఘటనల్లో విచారణలు పూర్తైనా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. -
పరీక్ష ప్రశ్నార్థకం
[ 19-05-2024]
రాయలసీమ విశ్వవిద్యాలయంలోని పరీక్షల విభాగానికి చెందిన ఓ ఉన్నతాధికారి నిర్లక్ష్యంతో వందల విద్యార్థుల జీవితాలు ఇబ్బందుల్లో పడ్డాయి. -
చిరుజల్లులకే ఛిద్రం
[ 19-05-2024]
కొత్తగా నిర్మిస్తున్న 340(బి) జాతీయ రహదారి చిరుజల్లులకే ఛిద్రమైంది.. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పగుల్లొచ్చాయి. హడావుడిగా పనులు చేయడంతోనే ఈ పరిస్థితి తలెత్తినట్లు ఆరోపణలు వస్తున్నాయి. -
బాక్సింగ్ కింగ్లు.. ఆదోని కుర్రాళ్లు
[ 19-05-2024]
ఆ కుర్రాళ్లు కొట్టే దెబ్బలకు దవడలు అదిరిపోతాయి.. మెదడులోని నరాల్లో కదలికలు పుడతాయి.. రింగులోకి ప్రత్యర్థి రావాలంటేనే భయపడే పరిస్థితి.. పతకాలు మాత్రం వచ్చి వాలిపోతాయి. -
స్ట్రాంగ్ రూమ్ల ఎదుట నిరంతర నిఘా: కలెక్టర్
[ 19-05-2024]
పార్లమెంట్, శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూంల ఎదుట 24 గంటలు నిరంతర నిఘా ఉంచినట్లు కలెక్టర్ కె.శ్రీనివాసులు, ఎస్పీ రఘువీర్రెడ్డి పేర్కొన్నారు. -
ఓపీక పడితేనే వైద్యం
[ 19-05-2024]
నంద్యాల సర్వజన ఆసుపత్రిలో ఓపీ సేవలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పెంచినా వైద్యులు మాత్రం గదుల్లో ఉండకపోవడంతో అరకొరగా సేవలు అందుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. -
లక్ష్య సాధనలోగెలుపు సందేశం
[ 19-05-2024]
తల్లిదండ్రుల ప్రోత్సాహం.. కష్టపడి చదవడం.. అనుకున్న లక్ష్యం చేరుకోవాలన్న కసి.. వెరసి ఆ విద్యార్థిని విజయం వైపు నడిపించాయి. పదో తరగతిలో పదికి పది.. ఇంటర్లో ఉత్తమ ఫలితాలతో ప్రశంసలు అందుకున్నాడు. -
బీఎల్వోలకు అందని భృతి
[ 19-05-2024]
ఎన్నికల విధులకు సంబంధించి బీఎల్వోలు నిరంతరం కష్టపడ్డారు. క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించారు.. ఓటర్ల మార్పులు, చేర్పుల్లో కీలకపాత్ర పోషించారు. పైసా పారితోషికం అందడం లేదు. -
తెలంగాణ ఎంసెట్లో విద్యార్థుల ప్రతిభ
[ 19-05-2024]
తెలంగాణ ఎంసెట్ (అగ్రికల్చర్)లో కర్నూలు నారాయణ విద్యార్థులు ప్రతిభ చాటారని డీజీఎం గోవర్ధన్ తెలిపారు. -
మహానంది క్షేత్రంలో భక్తుల రద్దీ
[ 19-05-2024]
మహానంది పుణ్యక్షేత్రంలో శనివారం భక్తుల రద్దీతో సందడి నెలకొంది. వరుసగా సెలవులు రావడంతో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులే కాకుండా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి మహానందికి తరలివచ్చారు. -
నృసింహస్వామి జయంతి బ్రహ్మోత్సవాలు
[ 19-05-2024]
వైశాఖ మాస నృసింహ జయంతి బ్రహ్మోత్సవాల్లో నరహరుడు అహోబిలం లక్ష్మీనృసింహస్వామి వేణుగోపాల స్వామి అలంకరణలో శనివారం భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం స్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా పల్లకిపై కొలువుదీర్చి ఆలయ తిరువీధుల్లో మేళతాళాలతో ఊరేగించారు.
తాజా వార్తలు (Latest News)
-
Rajasthan vs Kolkata: రాజస్థాన్, కోల్కతా మ్యాచ్కు వరుణుడి ఆటంకం.. మ్యాచ్ రద్దయితే హైదరాబాద్కు లాభం..
-
భార్య, కుమారుడు వేధిస్తున్నారు, భరణం ఇప్పించండి - మాజీ మంత్రి వేడుకోలు
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..
-
కార్పొరేటర్ శ్రవణ్ అరెస్టు అప్రజాస్వామికం: కేంద్రమంత్రి కిషన్రెడ్డి
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్కు ప్రమాదం..!