logo

వైకాపాకు ఓటు వేస్తే రైతుల భూములు స్వాహా

వైకాపాకు ఓటువేస్తే  రైతుల భూములన్నీ స్వాహా చేస్తారని మండల ఇన్‌ఛార్జ్ మల్లికార్జున గౌడ్,  తెదేపా నాయకులు మాజీ జడ్పీటీసీ సభ్యుడు మీనాక్షి నాయుడు, రజిని, బోగేష్, పోతురాజు రాముడు, కొండ గోవిందు అన్నారు. 

Published : 08 May 2024 12:22 IST

చిప్పగిరి:  వైకాపాకు ఓటువేస్తే  రైతుల భూములన్నీ స్వాహా చేస్తారని మండల ఇన్‌ఛార్జ్ మల్లికార్జున గౌడ్,  తెదేపా నాయకులు మాజీ జడ్పీటీసీ సభ్యుడు మీనాక్షి నాయుడు, రజిని, బోగేష్, పోతురాజు రాముడు, కొండ గోవిందు అన్నారు.  బుధవారం మండలంలోని చిప్పగిరి, నగరడోన గ్రామాల్లో తెదేపా నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల భూములను తాకట్టు పెట్టి అప్పులు తెచ్చేందుకే  భూ సర్వే చేస్తున్నారని పేర్కొన్నారు.  రైతులను  ఇబ్బంది పెట్టే వైకాపా ప్రభుత్వమా  లేక  ఆదుకునే తెదేపా ప్రభుత్వం కావాలో  నిర్ణయించుకోవాలని ఓటర్లకు సూచించారు.  ఆలూరు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్ర గౌడ్ , ఎంపీ అభ్యర్థి నాగరాజుకు ఓటు వేసి గెలిపించాలని  కోరారు. ఆయన వెంట మండల మాజీ ఉపాధ్యక్షుడు వెంకటేష్, సర్పంచ్ భీమ లింగప్ప,  మండల కన్వీనర్ షేక్షావలి, ప్రధాన కార్యదర్శి సతీష్, జనార్దన్ గౌడ్, కుమార్ గౌడ్, భీమన్న గౌడ్, కుందన్ గుర్తి సర్పంచ్ పురుషోత్తం,  హనుమన్న,  సన్నప్ప, తెదేపా సీనియర్ నాయకులు తిమ్మయ్య, అంపయ్య, పులికొండ, గోవిందు, కొండా రాముడు, కొండ నెట్టప్ప,  సోమశేఖర్ నాయుడు, తదితరులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు