నిధి వెక్కిరింత.. పర్యాటకం ఓ వింత
కొలిమిగుండ్ల మండలంలోని బెలూం గుహల్లో బ్లోయర్లు పనిచేయక పోవడంతో పర్యాటకులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రంగుల దీపాలు సైతం వెలగని దుస్థితి. తెదేపా హయాంలో అప్పటి పర్యాటక మంత్రి భూమా అఖిలప్రియ రూ.50లక్షలు కేటాయించి 12 బ్లోయర్లు ఏర్పాటు చేశారు.
గుహల్లో ఉక్కిరిబిక్కిరి : కొలిమిగుండ్ల మండలంలోని బెలూం గుహల్లో బ్లోయర్లు పనిచేయక పోవడంతో పర్యాటకులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రంగుల దీపాలు సైతం వెలగని దుస్థితి. తెదేపా హయాంలో అప్పటి పర్యాటక మంత్రి భూమా అఖిలప్రియ రూ.50లక్షలు కేటాయించి 12 బ్లోయర్లు ఏర్పాటు చేశారు. వైకాపా పాలనలో నిధులు కేటాయించకపోవడంతో బ్లోయర్లు పని చేయడంలేదు.
ఈనాడు, కర్నూలు: పర్యాటక ప్రాంతాలు రూపు కోల్పోయాయి. చుట్టేసొద్దామంటే.. మచ్చుకైనా కనిపించని పరిస్థితి. ఐదేళ్లలో పర్యాటక రంగం ఆనవాలు లేకుండా పోయింది. వైకాపా ప్రభుత్వం పైసా విదల్చలేదు. అంతటా అసౌకర్యాలు రాజ్యమేలుతున్నాయి. ఓ వెలుగు వెలిగిన శాఖలో నేడు చీకట్లు కమ్ముకున్నాయి. కళకళలాడిన నిర్మాణాలు కళావిహీనంగా మారాయి. ఆహ్లాదం పంచిన ప్రకృతి సంపదలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. జిల్లాలోని పలు ప్రాంతాలు ఉనికి కోల్పోయే పరిస్థితి నెలకొంది. నిర్వహణ భారంగా మారింది. పేరెన్నికగన్న పర్యాటక ప్రాంతాల దుస్థితి ఇది.
రాతివనం అధ్వానం: ఓర్వకల్లు వద్ద ఉన్న రాతివనాలకి (రాక్ గార్డెన్స్) ప్రస్తుతం నిర్వహణ లేక పర్యాటకుల సంఖ్య తగ్గిపోయింది. ఐదేళ్లలో చిల్లిగవ్వ కేటాయించకపోవడంతో అధ్వానంగా మారింది. సందర్శకుల కోసం నిర్మించిన గృహాలు సైతం నిరుపయోగంగా మారాయి.
ఆహ్లాదం దూరం: కర్నూలు నగర శివారులోని నగరవనం పక్కనే ఉన్న చెరువులో పర్యాటకుల ఆహ్లాదం కోసం బోట్లు ఏర్పాటు చేసింది. ప్రస్తుతం బోట్లు మరమ్మతులకు గురై మూలకు చేరాయి.
తిరగబడిన బోటు: అవుకు జలాశయం వద్ద పర్యాటకశాఖ ఏర్పాటు చేసిన బోటింగ్ తిరగబడింది. నిర్వహణ లోపం, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా గతంలో బోటు తిరగబడి ప్రాణాలు కోల్పోయిన ఘటనతో అది నిలిపివేశారు.
కూల్చారు.. నిర్మించేదెప్పుడో: శ్రీశైలంలోని హరిత రిసార్ట్స్ భవనాలు కూల్చేశారు. శ్రీశైలానికి వచ్చే పర్యాటకులు బస చేసేందుకు సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందులు తప్పడంలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సర్వే తప్పులు.. రుణానికి తిప్పలు
[ 20-05-2024]
భూసర్వేలో జరిగిన తప్పులు రైతులకు శాపంగా మారాయి.. భూహక్కు పత్రాల్లో తప్పులు.. విస్తీర్ణంలో తేడాలు.. ఉమ్మడి హక్కు పత్రాల కారణంగా పంట రుణాల నవీకరణకు బ్యాంకర్లు కొర్రీలు పెడుతున్నారు. -
గేట్లు ఎత్తలేరు.. తాళ్లు బిగించలేరు
[ 20-05-2024]
7.10 లక్షల ఎకరాలకు సాగునీరు.. వేలాది పల్లెలకు మంచినీరు అందించే సాగు నీటి ప్రాజెక్టుల నిర్వహణ అటకెక్కింది.. గత కొంతకాలంగా ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదు. -
అతిసారం.. కలవరం
[ 20-05-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 973 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.. ఇందులో మేజర్ 32, మైనర్ 941 వరకు ఉన్నాయి. 2021లో జరిగిన ఎన్నికల్లో 159 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. -
గుట్టుగా ఇసుకను తోడేస్తున్నారు
[ 20-05-2024]
తుంగభద్ర నదిలోని రీచ్ల వద్ద ఇసుకను గుట్టుగా తవ్వుతున్నట్లు తేలింది..కౌతాళం మండలం గుడికంబాలి, మరళి రీచ్లను ఆదివారం కలెక్టర్ సృజన ఆకస్మికంగా తనిఖీ చేశారు. -
దాచిన సొమ్ము దోచుకున్నారు
[ 20-05-2024]
పేద, మధ్యతరగతి ప్రజలు పైసా..పైసా కూడబెట్టి పోస్టాఫీసుల్లో డబ్బును దాచుకుందామంటే కొందరు సిబ్బంది అప్పనంగా సొంతానికి వాడేస్తున్నారు. -
మీటరు గిర్రు.. గుండె గుబిల్లు
[ 20-05-2024]
ఫిబ్రవరి వేడెక్కింది.. మార్చి ‘మాడ’కొట్టింది.. ఏప్రిల్ కుతకుత ఉడికింది.. ఇలా మే మొదటి వారం వరకు ఎండలు దంచికొట్టాయి.. గతేడాదితో పోలిస్తే ఈసారి ఉమ్మడి జిల్లాలో ఎండ తీవ్రత అధికంగా ఉంది. -
కళలకు వేదిక..ప్రతిభా వీచిక
[ 20-05-2024]
చిన్నారుల అభిరుచులకు అనుగుణంగా వివిధ కళల్ని నేర్చుకునేందుకు నంద్యాలలోని కళారాధన సంస్థ ప్రోత్సాహాన్ని అందిస్తోంది. -
నిధుల ఆటంకం
[ 20-05-2024]
క్రీడాకారులను నిరంతరం ప్రోత్సహిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతున్నా అవి కేవలం మాటలకే పరిమితమయ్యాయి. ఆటలు అటకెక్కాయి. క్రీడాభివృద్ధికి నిధుల కేటాయింపు అంతంతమాత్రంగానే ఉంది. -
పంట నష్టం.. గణన కష్టం
[ 20-05-2024]
రబీ కరవు ప్రభావిత ప్రాంతాల్లో ఈ నెల 24వ తేదీలోగా పంట నష్టం గణన పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ కమిషన్ వెల్లడించింది. -
చెరువులో శవాలు
[ 20-05-2024]
నగర శివారు.. గార్గేయపురం పరిధిలోని నగరవనం చెరువులో ముగ్గురు గుర్తు తెలియని మహిళలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆదివారం కలకలం రేపింది.