logo

ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృత్యువాత

వరి నారు మడికి నీరు మళ్లించే క్రమంలో ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతిచెందిన సంఘటన బిజినేపల్లి మండలం నందివడ్డెమాన్‌ గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్సై వెంకటేశ్‌ కథనం ప్రకారం.. నందివడ్డెమాన్‌

Published : 17 Jan 2022 01:48 IST

నిరంజన్‌

బిజినేపల్లి, న్యూస్‌టుడే : వరి నారు మడికి నీరు మళ్లించే క్రమంలో ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతిచెందిన సంఘటన బిజినేపల్లి మండలం నందివడ్డెమాన్‌ గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్సై వెంకటేశ్‌ కథనం ప్రకారం.. నందివడ్డెమాన్‌ గ్రామానికి చెందిన నిరంజన్‌ (49) బీమ సముద్రం చెరువు కింద వరి సాగుచేస్తున్నాడు. ఇదే క్రమంలో వరి నారుమడికి నీరు పారించేందుకు చెరువుకట్టపై నుంచి వెళ్తుండగా, ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడి, నీటమునిగాడు. స్థానికులు చెరువులో గాలించి బయటకు తీయగా అప్పటికే మృతి చెందాడు. సంఘటనపై భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని