పాలమూరు సిబ్బందికి పరీక్ష!
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పాలమూరు విశ్వవిద్యాలయం (పీయూ)లో పనిచేస్తున్న బోధనేతర సిబ్బందికి అధికారులు ‘పరీక్ష’ నిర్వహించేందుకు సన్నాహాలు చేయటం దుమారం రేపుతోంది.
ఆందోళనకు సిద్ధమవుతున్న ఉద్యోగులు
డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ పీయూలో ఆందోళన చేస్తున్న బోధనేతర సిబ్బంది(పాతచిత్రం)
పాలమూరు విశ్వవిద్యాలయం, న్యూస్టుడే : రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పాలమూరు విశ్వవిద్యాలయం (పీయూ)లో పనిచేస్తున్న బోధనేతర సిబ్బందికి అధికారులు ‘పరీక్ష’ నిర్వహించేందుకు సన్నాహాలు చేయటం దుమారం రేపుతోంది. సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. చాలీచాలని జీతమే ఇస్తున్నా మంచి రోజులు వస్తాయన్న ఆశతో 16 ఏళ్లుగా పనిచేస్తున్నామని, యాజమాన్యం వైఖరి పుండు మీద కారం చల్లినట్లుగా ఉందని వారు వాపోతున్నారు. రాష్ట్రంలోని మిగతా విశ్వవిద్యాలయాల్లో సిబ్బందిని ఒప్పంద, పొరుగు సేవలు, శాశ్వత ప్రాతిపాదికన నియమించారు. పీయూ అధికారులు మాత్రం తాత్కాలిక, అడ్హక్ పద్ధతిలో నియమించారు. ఇక్కడ 1993 నుంచి అంటే ఓయూ పరిధిలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో పీజీ సెంటర్ ప్రారంభమైనప్పటి నుంచి 2016 వరకు 120 మందికి పైగా పనిచేస్తున్నారు. 2008లో పీయూ ఏర్పాటైంది. తర్వాత పీయూ, పీజీ కేంద్రాల్లో పనిచేసేందుకు 150 మందికి పైగా బోధనేతర సిబ్బందిని తీసుకోగా వారంతా పనిచేస్తున్నారు.
ఆగిన వేతన పెంపుదల : మొదట్లో వసతి గృహాల్లో పనిచేసే వారికి రూ.1,800, కళాశాల, పీజీ కేంద్రాల్లో పనిచేసే వారికి రూ.2వేలు వేతనంగా చెల్లించేవారు. 2010 తర్వాత రూ.1,800 చెల్లించే వారికి రూ.3వేలు, రూ.2వేలు చెల్లించేవారికి రూ.4వేలు, 2012లో రూ.3వేల నుంచి రూ.5వేలు, రూ.4వేల నుంచి రూ.6వేలు వేతనాలు పెంచారు. 2016లో వేతనాలు పెంచాలంటూ ‘పాలమూరు యూనివర్సిటీ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అసోసియేషన్’ నాయకులు, బోధనేతర సిబ్బంది ఆందోళనలు చేపట్టారు. అప్పటి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, ప్రిన్సిపల్ సెక్రటరీ స్పందించి ప్రొఫెసర్ టీఎల్ఎన్ స్వామి అధ్యక్షతన పీయూ అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. ఏటా 12 శాతం వేతనం పెంచాలని సిఫారసు చేశారు. అదే ఏడాది జూన్ నుంచి వేతనంపై 12 శాతం పెంపు అమలు చేశారు. అప్పట్నుంచి ఏటా జూన్లో 12 శాతం పెంపుదల చేస్తూ వచ్చారు. ఇలా 2021 జూన్ వరకు ఏటా 12 శాతం వేతనం పెంచుతూ వచ్చారు. ఆ తర్వాత వేతన పెంపు నిలిపివేశారు.
పరీక్ష నిర్వహణ ఇలా.. : వచ్చే నెల 3, 4 తేదీల్లో పీయూ బోధనేతర సిబ్బందికి పరీక్షలు నిర్వహిస్తామని, ఈ నెల 19న ఇన్ఛార్జి రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ చేశారు. పీయూ పరిధిలోని అన్ని పోస్టుల వారికి జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లిష్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, కంప్యూటర్ ప్రాథమిక పరిజ్ఞానం అనే అంశాలపై పేపర్-1 పరీక్ష నిర్వహిస్తారు. కంప్యూటర్ ఆపరేటర్, డేటా ప్రాసెసింగ్ అధికారి, సీనియర్ అకౌంటెంట్, లైబ్రరీ అసిస్టెంట్, లేబరేటరీ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నారు.
సామూహిక దీక్షకు సిద్ధం : మూడేళ్లుగా వేతనాలు పెంచకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వేతనాలు పెంచాలని అనేక దఫాలుగా విన్నవించినా పట్టించుకోవడం లేదు. ఇప్పుడు పరీక్షలు నిర్వహిస్తామనడం బాధాకరం. కమిటీ సిఫారసుల మేరకు 12 శాతం వేతనం పెంచి ఖాతాల్లో జమచేయాలి లేదా జీవో నం.60 అమలు చేయాలి. లేదంటే నిరాహార దీక్షలు చేపడతాం.
రామ్మోహన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ బోధనేతర ఒప్పంద ఉద్యోగుల ఐకాస
పాలనా సౌలభ్యం కోసమే : పాలనా సౌలభ్యం కోసం బోధనేతర సిబ్బంది విద్యార్హత, నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా విధులు కేటాయించేందుకు మాత్రమే ఈ పరీక్ష నిర్వహిస్తున్నాం. బోధనేతర సిబ్బంది 152 మందికి పైగా ఉన్నా.. వసతి గృహాల్లో, కింది స్థాయిలో పనిచేస్తున్న వారిని మినహాయించి పీయూ క్యాంపస్, పీజీ కేంద్రాల్లో సిబ్బందికే పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలని సూచించాం.
- డా.మధుసూదన్రెడ్డి, ఇన్ఛార్జి రిజిస్ట్రార్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రైవేటు బస్సు బోల్తా.. పది మందికి గాయాలు
[ 08-05-2024]
మహబూబ్నగర్ జిల్లాలో బుధవారం ఉదయం ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురైంది. -
పాలమూరు ఓటర్లు @ 34,20,724
[ 08-05-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎస్ఎస్ఆర్-2024 ఓటర్ల జాబితాకు అదనంగా కొత్త ఓటర్లను చేర్చి ఎన్నికల అధికారులు తుది జాబితాను ప్రకటించారు. ఈ జాబితాలో కొత్త ఓటర్లను చేర్చడంతోపాటు చనిపోయిన, స్థానికంగా లేనివారి ఓట్లను తొలగించారు. -
అథ్లెటిక్స్ ఛాంపియన్ సాయి సంగీతకు అభినందన
[ 08-05-2024]
జూనియర్ ఏషియన్ పోటీల్లో స్వర్ణం సాధించిన మహబూబ్నగర్కు చెందిన అథ్లెట్ సాయి సంగీతను పాలమూరు విశ్వవిద్యాలయం ఉపకులపతి లక్ష్మికాంత్ రాథోడ్ మంగళవారం సన్మానించారు. -
ఆగిన రైతు భరోసా చెల్లింపులు
[ 08-05-2024]
రైతు భరోసా పథకానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. యాసంగి సీజన్లో పంట సాగు చేసిన రైతులందరికీ సాయం అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా డిసెంబర్ మూడో వారంలో ఐదు ఎకరాలలోపు సన్న, చిన్నకారు రైతుల ఖాతాల్లో మాత్రమే నగదు జమ చేసింది. -
కళాశాల లేక.. చదువు సాగక!
[ 08-05-2024]
రాజోలి మండలంలో ఏటా 230 మందికి పైగా విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాస్తున్నారు. వీరు ఇంటర్ విద్య చదువుకోవడానికి స్థానికంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల లేదు. పక్క మండలమైన వడ్డేపల్లిలోనూ లేదు. -
వేలిపై పెట్టే వీలు లేకుంటే..
[ 08-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ ఈ నెల 13న జరుగనుంది. ఓటర్లు పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవడానికి ముందు చెరిగిపోని సిరాను అంటిస్తారు. ఓటరు మళ్లీ రెండో సారి ఓటు వేసేందుకు అవకాశం లేకుండా ఈ నిబంధన విధించారు. -
గతమంతా ఘనం... ఇప్పుడంతా ధనం
[ 08-05-2024]
ప్రధాన పార్టీల ప్రచారం, జాతీయ స్థాయి నేతలు సభలు జనసమీకరణకు ప్రస్తుతం అభ్యర్థులకు, నాయకులకు తలకుమించిన భారమే. భారీ సభలకు అంతే మొత్తంలో భారీగా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తోందని అంటున్నారు. -
ష్... ఈసీ చూస్తోంది
[ 08-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తుండటంతో వివిధ రాజకీయ పార్టీల నాయకులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. భాజపా అభ్యర్థుల తరపున ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్షా, కేంద్ర మంత్రులు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. -
ఐదునెలల్లో పాతరోజులు తీసుకొచ్చారు: మన్నె
[ 08-05-2024]
తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి పరిస్థితులు పునరావృతం అవుతున్నాయని ఎంపీ, భారాస మహబూబ్నగర్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. మంగళవారం మహబూబ్నగర్ అర్బన్ మండలం బోయపల్లి, గ్రామీణ మండలం జైనల్లీపూర్, లాల్యానాయక్ తండాల్లో మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్తో కలిసి ఆయన ప్రచారం చేశారు. -
గద్వాలకు మిషన్ భగీరథ తాగునీరిచ్చాం: ఎమ్మెల్యే
[ 08-05-2024]
గద్వాల పురపాలక సంఘం పరిధిలో అన్ని వార్డుల్లో మిషన్ భగీరథ పథకం కింద తాగునీరు అందిస్తున్న ఘనత భారత రాష్ట్ర సమితిదేనని ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి పేర్కొన్నారు. -
భవనంపై నుంచి పడి విద్యార్థి మృతి
[ 08-05-2024]
భవనంపై నుంచి ఓ విద్యార్థి కిందపడి మృతి చెందిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. గ్రామస్థుల కథనం ప్రకారం.. నంచర్లకు చెందిన శివకుమార్(16) మహబూబ్నగర్ పాలిటెక్నిక్ కళాశాలలో మొదటి సంవత్సరం పూర్తి చేశాడు. -
పాఠశాల ప్రారంభం రోజే పుస్తకాలు
[ 08-05-2024]
సర్కారు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు జూన్ నెలలో పాఠశాలలు ప్రారంభించిన రోజునే పాఠ్య పుస్తకాలు అందజేయడానికి రాష్ట్ర విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. -
రెడ్కో దెబ్బ.. పంచాయతీలు అబ్బా!
[ 08-05-2024]
పరిమిత గ్రామాలలో మాత్రమే మూడోలైన్ ఏర్పాటుచేసి వాటికి మీటర్లు బిగించారు. చాలా గ్రామాలలో మూడోలైన్ ఏర్పాటు చేయకుండా వీధిదీపాలు అమర్చి వదిలేశారు. ఆయా గ్రామాల్లో రాత్రీపగలు తేడా లేకుండా వీధిదీపాలు వెలుగుతున్నాయి. -
గోదాం అగ్నిప్రమాదం బాధ్యులెవరు?
[ 08-05-2024]
ఏప్రిల్ ఒకటో తేదీన పెబ్బేరులోని గోదాంలో అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. గోదాంలో మిల్లర్లు నిల్వ చేసిన సీఎంఆర్ ధాన్యం, పౌరసరఫరాలశాఖకు చెందిన గోనె సంచులు భారీగా కాలిపోయాయి.