సేవల సౌలభ్యానికి అంగన్వాడీల సర్వే
అయిజ పట్టణంలోని భరత్నగర్ కాలనీకి చెందిన శాంతమ్మ టీచర్స్ కాలనీలో ఉన్న అంగన్వాడీ కేంద్రం పరిధిలో ఉంది. సుమారు అర కిలోమీటర్ దూరంలో ఉంటుంది. రోజూ వెళ్లి రావాలంటే ఇబ్బంది. చిన్నారులను కేంద్రానికి పంపాలన్నా ఇబ్బందే.
అయిజలో సర్వే చేస్తున్న అంగన్వాడీ టీచర్లు
అయిజ పట్టణంలోని భరత్నగర్ కాలనీకి చెందిన శాంతమ్మ టీచర్స్ కాలనీలో ఉన్న అంగన్వాడీ కేంద్రం పరిధిలో ఉంది. సుమారు అర కిలోమీటర్ దూరంలో ఉంటుంది. రోజూ వెళ్లి రావాలంటే ఇబ్బంది. చిన్నారులను కేంద్రానికి పంపాలన్నా ఇబ్బందే. పోషకాహారం, గర్భిణులు, బాలింతలకు ఆహారం తీసుకోడానికి కేంద్రానికి వెళ్లాలంటే అవస్థలు పడాల్సిందే.
అయిజ, న్యూస్టుడే: అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ, గర్భిణులు, బాలింతలతో పాటు చిన్నారులకు అందించే సేవల్లో మార్పులు తీసుకొచ్చేందుకు అంగన్వాడీ కుటుంబ సర్వే మొదలుపెట్టారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అంగన్వాడీ టీచర్లు ఈ సర్వే నిర్వహిస్తున్నారు. కేంద్రం ఒక చోట ఉంటే లబ్ధిదారుల ఇళ్లు ఇంకోచోట ఉండటంతో చిన్నారులకు పోషకాహారం, గర్భిణులు, బాలింతలకు సేవలందించడంలోనూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. లబ్దిదారులు కేంద్రాన్ని చేరుకోడానికి అవస్థలు పడాల్సి వస్తోంది. సమీపంలో ఉన్న కేంద్రాన్ని వదిలిపెట్టి దూరాన ఉన్న కేంద్రానికి కేటాయించడంతోనే ఇలాంటి పరిస్థితి తలెత్తింది. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని పరిష్కారం దిశగా మార్పులు తీసుకొచ్చే ప్రయత్నమే సర్వే. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 4,321 కేంద్రాల పరిధిలో ఉన్న ఇళ్లను పరిగణలోకి తీసుకొని ఈ సర్వే చేస్తున్నారు.
ఆన్లైన్లో నమోదు: సర్వే నేరుగా ఆన్లైన్లో నమోదవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన రెండు రకాల యాప్లలో సర్వేను ఒకేసారి పొందుపరుస్తున్నారు. కేంద్రాన్ని ఆధారంగా చేసుకొని ఇంటి నంబర్, కాలనీ పేరు, చిన్నారులు, తల్లిదండ్రులు, గర్భిణులు, బాలింతలు, జనన, మరణాలు, ఇల్లు ప్రస్తుతం ఉన్న కేంద్రం పేరు, ఆ ఇంటికి దగ్గర్లో ఉన్న కేంద్రం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నారు. సర్వే రెండు విధాలుగా ఉంది. ఒకటి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి, మరోటి కేంద్ర ప్రభుత్వానిది. సర్వే అనంతరం కేంద్రాలకు సంబంధించి ఇళ్ల సర్దుబాటు ప్రక్రియ చేపడతారు. కేంద్రానికి దూరంగా ఉండే ఇళ్లను సమీపంలో ఉన్న కేంద్రానికి బదిలీ చేస్తారు. ఒక కేంద్రానికి 250 ఇళ్ల నుంచి 300 ఇళ్లు ఉండేలా సర్దుబాటు చేయనున్నారు.
పకడ్బందీగా చేస్తున్నాం: కుటుంబ సర్వే నిబంధనల ప్రకారం పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. ప్రతి గ్రామంలో అంగన్వాడీలు సర్వే చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు పోషకాహారం పంపిణీ సక్రమంగా జరిగేందుకు సర్వే ఉపయోగపడుతోంది. చాలా మంది పట్టణాల్లో లబ్ధిదారులు అద్దె ఇళ్లలో మారుతుంటారు. అలాంటి వారికి ప్రాధాన్యమిస్తూ సర్వే చేస్తున్నారు.
సుధారాణి, డీడబ్ల్యూవో, గద్వాల
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తుమ్మిళ్లలో తాగునీటి కష్టాలు
[ 06-05-2024]
మిషన్ భగీరథ నీరు అరకొరగా రావడం, నీరు అపరిశుభ్రంగా వస్తుండటంతో మండలంలోని తుమ్మిళ్ల గ్రామంలో ప్రజలు తాగునీటి కష్టాలను ఎదుర్కొంటున్నారు. -
వంతెన నిర్మాణ పనులు పూర్తి చేయాలని వినతి
[ 06-05-2024]
అయిజ పట్టణంలో ఏళ్లుగా నిర్మిస్తున్న పెద్ద వాగు వంతెన పనులు పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని పట్టణానికి చెందిన ప్రజా సంఘాల ఐక్య వేదిక నాయకులు సోమవారం ఏవో భద్రతకు వినతిపత్రం అందజేశారు. -
సీఎం రేవంత్ స్థాయి మరిచి మాట్లాడుతున్నారు: డీకే అరుణ
[ 06-05-2024]
సీఎం రేవంత్రెడ్డి స్థాయి మరిచి తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని భాజపా ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. -
కాంగ్రెస్ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది: ఎమ్మెల్యే
[ 06-05-2024]
ఆరు గ్యారంటీల పేరుతో మాయ మాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. -
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
[ 06-05-2024]
భాజపా అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేయాలని చూస్తోందని రాహుల్గాంధీ అన్నారు. ఇటిక్యాల మండలం ఎర్రవల్లి చౌరస్తాలో ఆదివారం జరిగిన జన జాతర సభలో సీఎం రేవంత్రెడ్డితో కలిసి ఆయన హాజరయ్యారు. -
ప్రయాణ ప్రాంగణాల్లో జన జాతర
[ 06-05-2024]
పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించాక చిన్నా.. పెద్దా లేకుండా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తూ గమ్యాన్ని చేరుకుంటున్నారు. ఆర్టీసీ ఉగాది ఛాలెంజ్ పేరిట ప్రతి స్టేజీ వద్ద బస్సు ఆపి ప్రయాణికులను ఎక్కించుకోవాలని, అందుకు తగ్గట్లు బహుమతులు కూడా ఉంటాయని ఉత్తర్వులు జారీ చేసింది. -
డిగ్రీ ప్రవేశాలకు వేళాయె
[ 06-05-2024]
డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) ప్రకటన శుక్రవారం విడుదలైంది. మూడు విడతల్లో జరిగే ప్రవేశాలకు దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 6 నుంచి ప్రారంభం కానుంది. ఇంటర్మీడియట్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు డిగ్రీ కళాశాలల్లో మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం దోస్త్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. -
ఎన్నికల్లోనే వినిపించే రైల్వేకూత
[ 06-05-2024]
నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గంలో రైల్వే లైను కోసం నలభై ఏళ్లుగా ప్రజలు ఎదురు చూస్తున్నారు. దశాబ్దాలు గడిచినా ఆ కల నేరవేరటం లేదు. మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గంలో కృష్ణా-వికారాబాద్ రైల్వే లైను ప్రతిపాదన రెండు దశాబ్దాలుగా కొనసాగుతోంది. -
ఎన్నికల సంఘం వాట్సాప్ ఛానల్
[ 06-05-2024]
లోక్సభ ఎన్నికల నిర్వహణలో భారత ఎన్నికల సంఘం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకోవడంపై ప్రత్యేక దృష్టి సారించింది. -
రేవంత్ పాలనను కుప్ప కూల్చాలి : ఆర్ఎస్ ప్రవీణ్
[ 06-05-2024]
రాష్ట్రంలో రేవంత్ పాలనను కుప్పకూల్చి, కేసీఆర్ పాలనను తిరిగి తెచ్చుకోవాలని నాగర్కర్నూల్ భారాస పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. మండల కేంద్రంలో ఆదివారం రాత్రి అంబేడ్కర్ కూడలిలో నిర్వహించిన రోడ్షోలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజుతో కలిసి మాట్లాడారు. -
తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యం
[ 06-05-2024]
విద్యాసంస్థలకు వేసవి సెలవులు ఉండటం వలన, వివాహ శుభకార్యాలు ఎక్కువగా ఉండటంతో ఇళ్లకు తాళాలు వేసి సొంతూరు, ఇతర గ్రామాలు, పట్టణాలకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తున్నారు. -
అంజన్నా! నీ భూమి కాపాడుకో
[ 06-05-2024]
అటు రాయచూరు, ఇటు జిల్లా కేంద్రం నారాయణపేట, మరోవైపు మహబూబ్నగర్, హైదరాబాద్ వెళ్లడానికి చక్కని రవాణా సదుపాయం ఉన్న పట్టణం మక్తల్... అంతే కాదు వ్యాపార, ఆధ్యాత్మిక కేంద్రంగానూ ఈ పట్టణానికి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. -
బడి బాగుకు రూ.8.71 కోట్లు
[ 06-05-2024]
జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలను బాగు చేసేందుకు రూ.8.71 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో పనులు పూర్తి చేసే బాధ్యతను అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకు అప్పగించారు. ఇప్పటికే కొన్ని చోట్ల పనులు ప్రారంభమయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
-
రైతు భరోసా నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
-
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!
-
ఇరాన్లో వేధింపులు తట్టుకోలేక.. పడవతో సహా భారత్కు చేరుకొన్న మత్స్యకారులు..!
-
బీఎస్ఎన్ఎల్ యూజర్లకు గుడ్న్యూస్.. ఆగస్టు నుంచి 4జీ సేవలు
-
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ