లక్ష్యం బారెడు... సేకరణ మూరెడు
జిల్లాలో యాసంగి ధాన్యం సేకరణ లక్ష్యం సుదూరంగా కనిపిస్తోంది. పౌరసరఫరాలశాఖ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 27 రోజులు కావస్తున్నా ఇంతవరకు అనుకున్న లక్ష్యంలో కనీసం ఒకశాతం కూడా సేకరించలేదు.
తీలేర్ విండో సమీపాన సేకరిస్తున్న ధాన్యం
న్యూస్టుడే, నారాయణపేట న్యూటౌన్: జిల్లాలో యాసంగి ధాన్యం సేకరణ లక్ష్యం సుదూరంగా కనిపిస్తోంది. పౌరసరఫరాలశాఖ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 27 రోజులు కావస్తున్నా ఇంతవరకు అనుకున్న లక్ష్యంలో కనీసం ఒకశాతం కూడా సేకరించలేదు. ఈ నెలాఖరు దాటితే కోతలు పూర్తయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం పరిస్థితులను గమనిస్తే లక్ష్యంలో సగం మేరకైనా ధాన్యం కొంటారా అన్న సందేహాలు కలుగుతున్నాయి.
- జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు ప్రారంభించిన వందకుపైగా కేంద్రాల్లో కేవలం 972.800 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే సేకరించారు. ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో రూ.66 లక్షలు జమచేశారు. ప్రస్తుత యాసంగిలో పౌరసరఫరాలశాఖ 1.35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని నిర్ణయించింది. నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరాలంటే మరో 99శాతం పైగా ధాన్యం సేకరించాలి. ఇది సాధ్యమయ్యే పనిలా కనిపించడంలేదు.
బయట ధర మెరుగు: యాసంగిలో రైతులు ఆర్ఎన్ఆర్తో పాటు 1010 రకం వరిని సాగు చేశారు. ఆర్ఎన్ఆర్కు బయట మెరుగైన ధర ఉంది. క్వింటాలుకు రూ.2500 నుంచి రూ. 3 వేలకు పలుకుతుండటంతో అందరూ ప్రైవేటుగానే విక్రయించారు. కొందరు జిల్లాకు సమీపంలోని కర్ణాటక రాష్ట్రం రాయచూర్ మార్కెట్కు తరలించారు. 1010 విషయానికొస్తే సాగుచేసిన రైతుల్లో కొందరు ముందే వ్యాపారులతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. పెట్టుబడి కోసం నిధులు తెచ్చుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం వారికే అమ్ముకున్నారు. ఇంకొందరు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో నగదు జమ జాప్యమవుతుందన్న ఉద్దేశంతో అత్యవసర అవసరాల కోసమంటూ ప్రైవేటుగా అమ్ముకున్నారు. మిగతా వారు మాత్రమే కొనుగోలు కేంద్రాల్లో విక్రయించుకుంటున్నారు. మొదట్లో ధాన్యం అమ్మకానికి సిద్ధంగా ఉన్నప్పటికీ మిల్లుల కేటాయింపులో జాప్యం జరిగింది. ఇదే సమయంలో వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. వర్షం పడటం, ఈదురుగాలులు వీయడం వంటి సంఘటనలతోనూ పలువురు బయట విక్రయించారు. ఇవన్నీ పోగా మిగలిన ధాన్యం మాత్రమే కొనుగోలు కేంద్రాలకు వస్తోంది..గతంలో ఎన్నడూ లేనంత అథమ స్థాయిలో సేకరణ ఉందనడంలో అతిశయోక్తి లేదనిపిస్తోంది.
ఇంకా సమయం ఉంది
ధాన్యం సేకరణకు ఇంకా సమయం ఉంది. ఇప్పటి వరకు 973 మెట్రిక్ టన్నులు సేకరించాం. లక్ష్యానికి అనుగుణంగా కేంద్రాలను తెరిచాం. ఇంకా కోతలు పూర్తి కాలేదు. అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తామని భావిస్తున్నాం.
దేవదాసు జిల్లా పౌరసరఫరాలశాఖ మేనేజరు, నారాయణపేట
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రైవేటు బస్సు బోల్తా.. పది మందికి గాయాలు
[ 08-05-2024]
మహబూబ్నగర్ జిల్లాలో బుధవారం ఉదయం ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురైంది. -
పాలమూరు ఓటర్లు @ 34,20,724
[ 08-05-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎస్ఎస్ఆర్-2024 ఓటర్ల జాబితాకు అదనంగా కొత్త ఓటర్లను చేర్చి ఎన్నికల అధికారులు తుది జాబితాను ప్రకటించారు. ఈ జాబితాలో కొత్త ఓటర్లను చేర్చడంతోపాటు చనిపోయిన, స్థానికంగా లేనివారి ఓట్లను తొలగించారు. -
అథ్లెటిక్స్ ఛాంపియన్ సాయి సంగీతకు అభినందన
[ 08-05-2024]
జూనియర్ ఏషియన్ పోటీల్లో స్వర్ణం సాధించిన మహబూబ్నగర్కు చెందిన అథ్లెట్ సాయి సంగీతను పాలమూరు విశ్వవిద్యాలయం ఉపకులపతి లక్ష్మికాంత్ రాథోడ్ మంగళవారం సన్మానించారు. -
ఆగిన రైతు భరోసా చెల్లింపులు
[ 08-05-2024]
రైతు భరోసా పథకానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. యాసంగి సీజన్లో పంట సాగు చేసిన రైతులందరికీ సాయం అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా డిసెంబర్ మూడో వారంలో ఐదు ఎకరాలలోపు సన్న, చిన్నకారు రైతుల ఖాతాల్లో మాత్రమే నగదు జమ చేసింది. -
కళాశాల లేక.. చదువు సాగక!
[ 08-05-2024]
రాజోలి మండలంలో ఏటా 230 మందికి పైగా విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాస్తున్నారు. వీరు ఇంటర్ విద్య చదువుకోవడానికి స్థానికంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల లేదు. పక్క మండలమైన వడ్డేపల్లిలోనూ లేదు. -
వేలిపై పెట్టే వీలు లేకుంటే..
[ 08-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ ఈ నెల 13న జరుగనుంది. ఓటర్లు పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవడానికి ముందు చెరిగిపోని సిరాను అంటిస్తారు. ఓటరు మళ్లీ రెండో సారి ఓటు వేసేందుకు అవకాశం లేకుండా ఈ నిబంధన విధించారు. -
గతమంతా ఘనం... ఇప్పుడంతా ధనం
[ 08-05-2024]
ప్రధాన పార్టీల ప్రచారం, జాతీయ స్థాయి నేతలు సభలు జనసమీకరణకు ప్రస్తుతం అభ్యర్థులకు, నాయకులకు తలకుమించిన భారమే. భారీ సభలకు అంతే మొత్తంలో భారీగా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తోందని అంటున్నారు. -
ష్... ఈసీ చూస్తోంది
[ 08-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తుండటంతో వివిధ రాజకీయ పార్టీల నాయకులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. భాజపా అభ్యర్థుల తరపున ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్షా, కేంద్ర మంత్రులు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. -
ఐదునెలల్లో పాతరోజులు తీసుకొచ్చారు: మన్నె
[ 08-05-2024]
తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి పరిస్థితులు పునరావృతం అవుతున్నాయని ఎంపీ, భారాస మహబూబ్నగర్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. మంగళవారం మహబూబ్నగర్ అర్బన్ మండలం బోయపల్లి, గ్రామీణ మండలం జైనల్లీపూర్, లాల్యానాయక్ తండాల్లో మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్తో కలిసి ఆయన ప్రచారం చేశారు. -
గద్వాలకు మిషన్ భగీరథ తాగునీరిచ్చాం: ఎమ్మెల్యే
[ 08-05-2024]
గద్వాల పురపాలక సంఘం పరిధిలో అన్ని వార్డుల్లో మిషన్ భగీరథ పథకం కింద తాగునీరు అందిస్తున్న ఘనత భారత రాష్ట్ర సమితిదేనని ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి పేర్కొన్నారు. -
భవనంపై నుంచి పడి విద్యార్థి మృతి
[ 08-05-2024]
భవనంపై నుంచి ఓ విద్యార్థి కిందపడి మృతి చెందిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. గ్రామస్థుల కథనం ప్రకారం.. నంచర్లకు చెందిన శివకుమార్(16) మహబూబ్నగర్ పాలిటెక్నిక్ కళాశాలలో మొదటి సంవత్సరం పూర్తి చేశాడు. -
పాఠశాల ప్రారంభం రోజే పుస్తకాలు
[ 08-05-2024]
సర్కారు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు జూన్ నెలలో పాఠశాలలు ప్రారంభించిన రోజునే పాఠ్య పుస్తకాలు అందజేయడానికి రాష్ట్ర విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. -
రెడ్కో దెబ్బ.. పంచాయతీలు అబ్బా!
[ 08-05-2024]
పరిమిత గ్రామాలలో మాత్రమే మూడోలైన్ ఏర్పాటుచేసి వాటికి మీటర్లు బిగించారు. చాలా గ్రామాలలో మూడోలైన్ ఏర్పాటు చేయకుండా వీధిదీపాలు అమర్చి వదిలేశారు. ఆయా గ్రామాల్లో రాత్రీపగలు తేడా లేకుండా వీధిదీపాలు వెలుగుతున్నాయి. -
గోదాం అగ్నిప్రమాదం బాధ్యులెవరు?
[ 08-05-2024]
ఏప్రిల్ ఒకటో తేదీన పెబ్బేరులోని గోదాంలో అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. గోదాంలో మిల్లర్లు నిల్వ చేసిన సీఎంఆర్ ధాన్యం, పౌరసరఫరాలశాఖకు చెందిన గోనె సంచులు భారీగా కాలిపోయాయి.