గంజాయి దందా.. యువతే నిండా
పాలమూరు పట్టణంలో గంజాయి వ్యాపారం చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఎక్సైజ్, పోలీసు శాఖలు నిఘా పెట్టినా.. వారి కళ్లు గప్పి గంజాయిని విక్రయిస్తూనే ఉన్నారు. ఈ కేసులో అరెస్టయి జైలుకు వెళ్లిన వాళ్లు కూడా బయటకు వచ్చాక మళ్లీ అదే దందా చేస్తున్నారు.
జిల్లాకేంద్రంలో నాలుగు ప్రధాన అడ్డాలు
కళాశాల విద్యార్థులకూ విక్రయం
మహబూబ్నగర్లో గంజాయి విక్రయిస్తున్న మోతీనగర్ యువకులు మహమ్మద్ రియాజ్, ప్రతాప్కుమార్లను అరెస్టు చేసిన అధికారులు
మహబూబ్నగర్ నేరవిభాగం, న్యూస్టుడే: పాలమూరు పట్టణంలో గంజాయి వ్యాపారం చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఎక్సైజ్, పోలీసు శాఖలు నిఘా పెట్టినా.. వారి కళ్లు గప్పి గంజాయిని విక్రయిస్తూనే ఉన్నారు. ఈ కేసులో అరెస్టయి జైలుకు వెళ్లిన వాళ్లు కూడా బయటకు వచ్చాక మళ్లీ అదే దందా చేస్తున్నారు. అధికారులు పూర్తిస్థాయిలో కట్టడి చేయలేకపోతున్నారు. ఇలా పట్టణంలో విక్రయించే వారు మారుతున్నారే తప్ప వినియోగిస్తున్న వారికి గంజాయి సరఫరా మాత్రం ఆగటం లేదు. మహబూబ్నగర్ పట్టణంలో నలుగురు యువకులు ఈ దందాను కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఇందులో ఇద్దరిని గురువారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని బోయపల్లి గేటు వద్ద ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. విశేషమేమిటంటే గతంలో గంజాయి వ్యాపారం చేసి అరెస్టయిన యువకుడే మళ్లీ విక్రయిస్తూ పట్టుబడటం. జల్సాలకు అలవాటు పడిన యువకులు కష్టపడకుండా సులువుగా డబ్బులు సంపాదించడానికి గంజాయి దందాను ఎంచుకుంటున్నారు. హైదరాబాద్ నగరం ధూల్పేట్లో అర కేజీ, కేజీ చొప్పున ఎండు గంజాయిని కొనుగోలు చేస్తున్నారు. 5 గ్రాముల ప్యాకెట్లు చేసి మహబూబ్నగర్లో విక్రయిస్తున్నారు. ఆటో డ్రైవర్లు, కూలీలు, ఇతర రాష్ట్రాల కార్మికులు గంజాయిని ఎక్కువగా వాడుతుండటంతో డిమాండ్ పెరిగి దందా జోరుగా సాగుతోంది.
రూ.500లకు 5 గ్రాముల ప్యాకెట్ : చిన్న చిన్న పనులు చేసే యువకులే గంజాయి దందా చేస్తున్నారు. హైదరాబాద్లో తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి మహబూబ్నగర్లో 5 గ్రాముల ప్యాకెట్లను రూ.500 నుంచి రూ.800లకు విక్రయిస్తున్నట్లు సమాచారం. పలు కళాశాలల వద్ద విద్యార్థులకు విక్రయిస్తున్నారు. టీడీగుట్ట, బోయపల్లి రైల్వే గేటు, బండమీదిపల్లి, మెట్టుగడ్డ ప్రాంతాలను గంజాయి విక్రయానికి ప్రధాన అడ్డాలుగా చేసుకున్నారు. క్రిస్టియన్పల్లి, అప్పన్నపల్లి, దొడ్లోనిపల్లి, పిల్లలమర్రి, బోయపల్లి, ఏనుగొండ, వీరన్నపేట, రైతుబజార్, రాజేంద్రనగర్, పాత పాలమూరు, మర్లు ప్రాంతాల్లోనూ విక్రయిస్తున్నారు. వాట్సాప్ ద్వారా రెగ్యులర్ వినియోగదారులకు గంజాయి సమాచార మిచ్చి విక్రయిస్తున్నారు.
87126 58872కు సమాచారం ఇవ్వండి : మహబూబ్నగర్లో గంజాయి దందా చేసే వారి కదలికలపై నిఘా పెట్టాం. అనుమానం వచ్చిన ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నాం. ఎవరైనా ఎక్కడైనా గంజాయి విక్రయిస్తున్నట్లు, తాగుతున్నట్లు తెలిస్తే వెంటనే 87126 58872 నంబర్కు ఫోన్ చేసి చెప్పండి. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం.
వీరారెడ్డి, ఎక్సైజ్ శాఖ సీఐ, మహబూబ్నగర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ పార్టీకి అండగా నిలుద్దాం
[ 07-05-2024]
ఎన్నికల నేపథ్యంలో భాజపా, భారాస చెప్పే మాయమాటలు నమ్మొద్దని, ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీకే ఓటు వేసి గెలిపిద్దామని జడ్పీ ఛైర్ పర్సన్ సరిత అన్నారు. -
మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. కోటి ఇవ్వాలి
[ 07-05-2024]
రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెల్జాల సమీపంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కారు ఢీకొని వెంకటాపూర్ గ్రామానికి చెందిన నరేష్, పరశురాములు మృతి చెందారు. -
భాజపా, కాంగ్రెస్ పోటా పోటీగా ఎన్నికల ప్రచారం
[ 07-05-2024]
రాజోలి మండలంలోని గ్రామాల్లో మంగళవారం భాజపా, కాంగ్రెస్ పార్టీల నాయకులు పోటాపోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
గ్రామాల్లో భారాస నాయకుల ఇంటింటి ప్రచారం
[ 07-05-2024]
మండలంలోని రాజోలి, మాన్ దొడ్డి గ్రామాల్లో భారాస నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. -
సూరీడు చిన్నబోయేలా ఓటెత్తాలి?
[ 07-05-2024]
పాలమూరులో ఎండలు మండిపోతున్నాయి. ప్రతి రోజు సగటున గరిష్ఠంగా 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఇప్పట్లో ఎండలు తగ్గేలా లేవు. మరోవారం రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. -
నిలిచిన ఈఎస్ఐ వైద్యసేవలు
[ 07-05-2024]
మహబూబ్నగర్ పట్టణం ఏనుగొండలోని ఈఎస్ఐ(ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్) ఆసుపత్రికి తాళం పడింది. ప్రభుత్వం అద్దె బకాయిలు మంజూరు చేయడం లేదని భవనం యజమాని ఆసుపత్రికి తాళం వేయటంతో వైద్యసేవలు నిలిచిపోయాయి. -
మరో రెండు రోజులు కొనుగోళ్లు బంద్
[ 07-05-2024]
బాదేపల్లి వ్యవసాయ మార్కెట్కు అమ్మకానికి వారం రోజులుగా భారీగా ధాన్యం వస్తోంది. సోమవారం 700 మంది రైతులు వివిధ పంటలు 17,233 క్వింటాళ్లు తీసుకురావడంతో మార్కెట్ యార్డు మొత్తం నిండిపోయింది. -
ప్రజలను వంచించిన కాంగ్రెస్ ప్రభుత్వం
[ 07-05-2024]
తెలంగాణలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజలను వంచించిందని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కరసింగ్ ధామి ఆరోపించారు. -
నల్లమలలో వన్యప్రాణులకు ఆపద
[ 07-05-2024]
సాంకేతికత అభివృద్ధి.. కొన్నింటికి ప్రమాదకరంగా మారాయి. ప్రధానంగా నల్లమల అడవిలో, కృష్ణాతీరంలో వన్యప్రాణులకు, వివిధ రకాల చెట్ల జాతులకు ఆపద వచ్చింది. -
ఉల్లి రైతుకు కన్నీరు
[ 07-05-2024]
ఆరుగాలం కష్టపడి పండించిన ఉల్లి ధరలు తగ్గటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రోజురోజుకు మార్కెట్లో ఉల్లి ధరలు పడిపోతుండటంతో రైతులకు పెట్టుబడి కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. -
గెలిస్తే చాలు.. వసతులు వేలు
[ 07-05-2024]
ఎంపీగా గెలిచిన వ్యక్తికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తోంది? వారికి వచ్చే నిధుల సంగతేంటి? అనే విషయాలను తెలుసుకుందాం.! -
అప్పుడు అవినీతిపరుడు.. ఇప్పుడు ఆదర్శప్రాయుడా?
[ 07-05-2024]
కొద్ది నెలల క్రితం రాష్ట్రానికి వచ్చినప్పుడు మాజీ ఐపీఎస్ అధికారి అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు రూ. 1.20 కోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపిస్తూ.. ఆయన కుమార్తెపై అవినీతి ఆరోపణలు ఉన్నందున వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. -
మద్యం మత్తులో భర్తపై గొడ్డలితో దాడి
[ 07-05-2024]
మద్యం మత్తులో భర్తపై గొడ్డలితో దాడిచేసి హతమార్చిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. మమ్మాయిపల్లి గ్రామానికి చెందిన భార్య, భర్తలు లక్ష్మి, నాగయ్య వ్యవసాయ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. -
గర్భంలోనే శిశువు మృతి
[ 07-05-2024]
నెలలు నిండిన మగబిడ్డ గర్భంలోనే తనువు చాలించాడ]ని తెలిసి ఆ కన్నతల్లి కడుపుకోతతో విలవిలలాడింది. విషాదభరితమైన ఈ సంఘటన గద్వాల జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చోటు చేసుకుంది. -
చెలమ నీరే దిక్కు
[ 07-05-2024]
మిషన్ భగీరథ నీరు అరకొరగా రావడం, స్థానిక నీరు అపరిశుభ్రంగా వస్తుండటంతో మండలంలోని తుమ్మిళ్ల గ్రామంలో చాలా మంది ప్రజలకు చెలమల నీరే ఆధారమైంది. -
అందరికీ పోస్టల్ బ్యాలెట్
[ 07-05-2024]
లోక్సభ ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న అందరికీ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పిస్తూ జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాలు జారీ చేశారు. -
పకడ్బందీగా పోలింగ్ నిర్వహించాలి
[ 07-05-2024]
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఉదయ్కుమార్ అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. -
భారాస, భాజపా నిరుపేదల ద్రోహులు
[ 07-05-2024]
భారాస, భాజపా నాయకులు నిరుపేద ద్రోహులని పాలమూరు కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి అన్నారు. చర్లపల్లి, హన్మాన్పల్లి, కొండాపూర్, కిష్టాపూర్, రాంకిష్టాయపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే పర్నికరెడ్డితో కలిసి సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
మహిళలను వేధిస్తే కఠిన చర్యలు
[ 07-05-2024]
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కళాశాల ఆవరణలో ఓపెన్ ఇంటర్ పరీక్షలు రాయడానికి వచ్చిన విద్యార్థులకు షీటీం పోలీసులు పలు సామాజిక అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. -
భారాస కనుమరుగు కావడం ఖాయం
[ 07-05-2024]
పార్లమెంట్ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో భారాస కనుమరుగు కావడం ఖాయమని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆయన మండలంలోని తెల్లరాళ్లపల్లితండా, రేమద్దుల, బుసిరెడ్డిపల్లి గ్రామాల్లో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. -
సీఎంఆర్ బియ్యం సమకూరేనా?
[ 07-05-2024]
మిల్లర్లకు కేటాయించిన సీఎంఆర్ ధాన్యాన్ని మర ఆడించి తిరిగి ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యానికి ప్రభుత్వం ఎన్నో సార్లు గడువు పెంచినా.. వారిలో మాత్రం చలనం రావడం లేదు. -
భాజపా అధికారంలోకి వస్తే రాజ్యాంగానికి ప్రమాదం
[ 07-05-2024]
కేంద్రంలో భాజపా మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగానికి ప్రమాదమని నాగర్కర్నూల్ భారాస ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
సరదా సరదాగానే సిక్స్లు బాదేస్తాడు.. అదే స్పిన్ బౌలింగ్లోనైతే..: రవిశాస్త్రి
-
టాప్ 5 మలయాళీ చిత్రాలు.. ఓటీటీలో ఎక్కడ చూడొచ్చంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
DM చేస్తేనే స్టోరీ.. షేక్ చేస్తే ఫొటో.. ఇన్స్టాలో 4 కొత్త ఫీచర్లు
-
తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షం.. కరీంనగర్లో కూలిన టెంట్లు
-
వాటర్ ట్యాంక్లో మహిళ మృతదేహం.. యూనివర్సిటీలో కలకలం