బీ ఫాం ఉన్న వారికే పార్టీ గుర్తు
గ్రామ పంచాయతీ ఎన్నికలు మినహా మిగతా అన్ని ఎన్నికల్లో అభ్యర్థులు రాజకీయ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తే బీ ఫారం అందజేయాల్సి ఉంటుంది. ఒక రాజకీయ పార్టీ తరపున ఏ అభ్యర్థి అయితే బీ ఫారం అందజేస్తారో ఆ అభ్యర్థికే పార్టీ గుర్తు కేటాయిస్తారు.
నామపత్రాల ఉపసంహరణలోగా అవకాశం
గుర్తుల కేటాయింపుపై శ్రద్ధ
అచ్చంపేట, న్యూస్టుడే : గ్రామ పంచాయతీ ఎన్నికలు మినహా మిగతా అన్ని ఎన్నికల్లో అభ్యర్థులు రాజకీయ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తే బీ ఫారం అందజేయాల్సి ఉంటుంది. ఒక రాజకీయ పార్టీ తరపున ఏ అభ్యర్థి అయితే బీ ఫారం అందజేస్తారో ఆ అభ్యర్థికే పార్టీ గుర్తు కేటాయిస్తారు. లోక్సభ, శాసనసభ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఈ నిబంధన అమలు చేస్తారు. పార్టీ తరఫున ఎన్నికలు నిర్వహించినప్పుడు ఆయా పార్టీల గుర్తులను కేటాయించేందుకు ప్రత్యేక నిబంధనలు అమలు చేస్తున్నారు. స్వతంత్రులుగా పోటీ చేసే అభ్యర్థులు బీ ఫారం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎన్నికల సంఘం వారికి ప్రత్యేక గుర్తులను కేటాయిస్తుంది. అభ్యర్థులు తమ నామపత్రం దాఖలు చేసే సమయంలో ఏదైనా రాజకీయ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారా? లేక స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారా అనే విషయాన్ని అందులో నమోదు చేయాల్సి ఉంటుంది. రాజకీయ పార్టీ అభ్యర్థులుగా బరిలో నిలిచిన వారికి ఆ పార్టీ అధికార ప్రతినిధి బీ ఫారంపై పోటీ చేస్తున్న అభ్యర్థి పేరు రాసి దానిపై ముద్ర వేసి ఇస్తారు. బీ ఫారాన్ని పొందిన వ్యక్తి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామపత్రాల ఉప సంహరణలోగా అందజేయాల్సి ఉంటుంది.
ఏ ఫారం పొందిన వారికే అధికారం.. : రాజకీయ పార్టీల తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఆయా పార్టీలు బీ ఫారం అందజేసేందుకు ఒకరికి అధికారం కేటాయిస్తారు. పార్టీ అధ్యక్షుడు లేదా ప్రధాన కార్యదర్శి అభ్యర్థులకు బీ ఫారం అందజేస్తారు. ప్రతి పార్టీలో ఒకరికి బీ ఫారం అందజేసే అధికారాన్ని అప్పగిస్తారు. బీ ఫారం జారీ చేసే వ్యక్తికి మొదట పార్టీ అధ్యక్షుడు ఏ ఫారం అందజేస్తారు. పార్టీ తరఫున ఏ ఫారం పొందిన వ్యక్తి మాత్రమే పోటీ చేసే అభ్యర్థులకు బీ ఫారం అందజేసేందుకు అవకాశం ఉంటుంది. ఒక పార్టీ తరఫున ఒక అభ్యర్థికి మాత్రమే బీ ఫారం ఇవ్వాల్సి ఉంటుంది. ఏ ఫారం పొందిన వ్యక్తి తనకు ఫలానా పార్టీ అభ్యర్థులకు బీ ఫారం అందజేసే అధికారం ఇచ్చారని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తెలియజేసి తనకు పార్టీ జారీ చేసిన ఏ ఫారాన్ని జత చేయాలని పార్టీ అభ్యర్థులు పార్టీ గుర్తు పొందడానికి బీ ఫారాన్ని అధికారికి అందజేయాలి. ఇదే విషయాన్ని ఆర్వో ధ్రువీకరించుకుంటారు. ఒక నియోజకవర్గంలో ఒక రాజకీయ పార్టీ తరపున ఒక బీ ఫారాన్ని మాత్రమే ఆర్వో గుర్తించి ఆ వ్యక్తికి మాత్రమే పార్టీ గుర్తును కేటాయిస్తారు. బీ ఫారాన్ని గడువులోగా అందజేయకపోతే అతడిని స్వతంత్ర అభ్యర్థిగా పరిగణనలోకి తీసుకుంటారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ పార్టీకి అండగా నిలుద్దాం
[ 07-05-2024]
ఎన్నికల నేపథ్యంలో భాజపా, భారాస చెప్పే మాయమాటలు నమ్మొద్దని, ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీకే ఓటు వేసి గెలిపిద్దామని జడ్పీ ఛైర్ పర్సన్ సరిత అన్నారు. -
మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. కోటి ఇవ్వాలి
[ 07-05-2024]
రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెల్జాల సమీపంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కారు ఢీకొని వెంకటాపూర్ గ్రామానికి చెందిన నరేష్, పరశురాములు మృతి చెందారు. -
భాజపా, కాంగ్రెస్ పోటా పోటీగా ఎన్నికల ప్రచారం
[ 07-05-2024]
రాజోలి మండలంలోని గ్రామాల్లో మంగళవారం భాజపా, కాంగ్రెస్ పార్టీల నాయకులు పోటాపోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
గ్రామాల్లో భారాస నాయకుల ఇంటింటి ప్రచారం
[ 07-05-2024]
మండలంలోని రాజోలి, మాన్ దొడ్డి గ్రామాల్లో భారాస నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. -
సూరీడు చిన్నబోయేలా ఓటెత్తాలి?
[ 07-05-2024]
పాలమూరులో ఎండలు మండిపోతున్నాయి. ప్రతి రోజు సగటున గరిష్ఠంగా 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఇప్పట్లో ఎండలు తగ్గేలా లేవు. మరోవారం రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. -
నిలిచిన ఈఎస్ఐ వైద్యసేవలు
[ 07-05-2024]
మహబూబ్నగర్ పట్టణం ఏనుగొండలోని ఈఎస్ఐ(ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్) ఆసుపత్రికి తాళం పడింది. ప్రభుత్వం అద్దె బకాయిలు మంజూరు చేయడం లేదని భవనం యజమాని ఆసుపత్రికి తాళం వేయటంతో వైద్యసేవలు నిలిచిపోయాయి. -
మరో రెండు రోజులు కొనుగోళ్లు బంద్
[ 07-05-2024]
బాదేపల్లి వ్యవసాయ మార్కెట్కు అమ్మకానికి వారం రోజులుగా భారీగా ధాన్యం వస్తోంది. సోమవారం 700 మంది రైతులు వివిధ పంటలు 17,233 క్వింటాళ్లు తీసుకురావడంతో మార్కెట్ యార్డు మొత్తం నిండిపోయింది. -
ప్రజలను వంచించిన కాంగ్రెస్ ప్రభుత్వం
[ 07-05-2024]
తెలంగాణలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజలను వంచించిందని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కరసింగ్ ధామి ఆరోపించారు. -
నల్లమలలో వన్యప్రాణులకు ఆపద
[ 07-05-2024]
సాంకేతికత అభివృద్ధి.. కొన్నింటికి ప్రమాదకరంగా మారాయి. ప్రధానంగా నల్లమల అడవిలో, కృష్ణాతీరంలో వన్యప్రాణులకు, వివిధ రకాల చెట్ల జాతులకు ఆపద వచ్చింది. -
ఉల్లి రైతుకు కన్నీరు
[ 07-05-2024]
ఆరుగాలం కష్టపడి పండించిన ఉల్లి ధరలు తగ్గటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రోజురోజుకు మార్కెట్లో ఉల్లి ధరలు పడిపోతుండటంతో రైతులకు పెట్టుబడి కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. -
గెలిస్తే చాలు.. వసతులు వేలు
[ 07-05-2024]
ఎంపీగా గెలిచిన వ్యక్తికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తోంది? వారికి వచ్చే నిధుల సంగతేంటి? అనే విషయాలను తెలుసుకుందాం.! -
అప్పుడు అవినీతిపరుడు.. ఇప్పుడు ఆదర్శప్రాయుడా?
[ 07-05-2024]
కొద్ది నెలల క్రితం రాష్ట్రానికి వచ్చినప్పుడు మాజీ ఐపీఎస్ అధికారి అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు రూ. 1.20 కోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపిస్తూ.. ఆయన కుమార్తెపై అవినీతి ఆరోపణలు ఉన్నందున వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. -
మద్యం మత్తులో భర్తపై గొడ్డలితో దాడి
[ 07-05-2024]
మద్యం మత్తులో భర్తపై గొడ్డలితో దాడిచేసి హతమార్చిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. మమ్మాయిపల్లి గ్రామానికి చెందిన భార్య, భర్తలు లక్ష్మి, నాగయ్య వ్యవసాయ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. -
గర్భంలోనే శిశువు మృతి
[ 07-05-2024]
నెలలు నిండిన మగబిడ్డ గర్భంలోనే తనువు చాలించాడ]ని తెలిసి ఆ కన్నతల్లి కడుపుకోతతో విలవిలలాడింది. విషాదభరితమైన ఈ సంఘటన గద్వాల జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చోటు చేసుకుంది. -
చెలమ నీరే దిక్కు
[ 07-05-2024]
మిషన్ భగీరథ నీరు అరకొరగా రావడం, స్థానిక నీరు అపరిశుభ్రంగా వస్తుండటంతో మండలంలోని తుమ్మిళ్ల గ్రామంలో చాలా మంది ప్రజలకు చెలమల నీరే ఆధారమైంది. -
అందరికీ పోస్టల్ బ్యాలెట్
[ 07-05-2024]
లోక్సభ ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న అందరికీ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పిస్తూ జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాలు జారీ చేశారు. -
పకడ్బందీగా పోలింగ్ నిర్వహించాలి
[ 07-05-2024]
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఉదయ్కుమార్ అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. -
భారాస, భాజపా నిరుపేదల ద్రోహులు
[ 07-05-2024]
భారాస, భాజపా నాయకులు నిరుపేద ద్రోహులని పాలమూరు కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి అన్నారు. చర్లపల్లి, హన్మాన్పల్లి, కొండాపూర్, కిష్టాపూర్, రాంకిష్టాయపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే పర్నికరెడ్డితో కలిసి సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
మహిళలను వేధిస్తే కఠిన చర్యలు
[ 07-05-2024]
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కళాశాల ఆవరణలో ఓపెన్ ఇంటర్ పరీక్షలు రాయడానికి వచ్చిన విద్యార్థులకు షీటీం పోలీసులు పలు సామాజిక అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. -
భారాస కనుమరుగు కావడం ఖాయం
[ 07-05-2024]
పార్లమెంట్ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో భారాస కనుమరుగు కావడం ఖాయమని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆయన మండలంలోని తెల్లరాళ్లపల్లితండా, రేమద్దుల, బుసిరెడ్డిపల్లి గ్రామాల్లో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. -
సీఎంఆర్ బియ్యం సమకూరేనా?
[ 07-05-2024]
మిల్లర్లకు కేటాయించిన సీఎంఆర్ ధాన్యాన్ని మర ఆడించి తిరిగి ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యానికి ప్రభుత్వం ఎన్నో సార్లు గడువు పెంచినా.. వారిలో మాత్రం చలనం రావడం లేదు. -
భాజపా అధికారంలోకి వస్తే రాజ్యాంగానికి ప్రమాదం
[ 07-05-2024]
కేంద్రంలో భాజపా మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగానికి ప్రమాదమని నాగర్కర్నూల్ భారాస ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆస్ట్రేలియా హెలికాప్టర్పై నిప్పుల వర్షం.. చైనా దుందుడుకు చర్య
-
Team India: పాక్లో ఛాంపియన్స్ ట్రోఫీ.. టీమ్ఇండియా వెళ్తుందా? బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ ఏమన్నారంటే..
-
ఒకే ఫ్రేమ్లో ఇద్దరు సీఈఓలు.. సుందర్ పిచాయ్ గ్రాడ్యుయేషన్ ఫొటో వైరల్
-
చేతులూ కాళ్లూ కట్టేసి సిగరెట్లతో భర్తకు వాతలు.. వీడియోతో పోలీస్స్టేషన్కు బాధితుడు!
-
అభ్యంతరకర వీడియోలున్న.. 25వేల పెన్డ్రైవ్లను పంచారు: కుమారస్వామి
-
రష్యా అధినేతగా ఐదోసారి.. ఘనంగా పుతిన్ ప్రమాణస్వీకారం