కాంగ్రెస్ అభ్యర్థి గెలవరనే ఆందోళనలో సీఎం
మహబూబ్నగర్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గెలిచే పరిస్థితి లేకపోవటంతో తన పదవి ఊడుతుందని సీఎం రేవంత్రెడ్డి భయపడుతున్నారని, అందుకే మహబూబ్నగర్లో తరచూ పర్యటిస్తూ భాజపా అభ్యర్థి డీకే అరుణపై నోరు పారేసుకుంటున్నారని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ విమర్శించారు.
మాట్లాడుతున్న రాణి రుద్రమ, చిత్రంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు సాహితీరెడ్డి తదితరులు
మహబూబ్నగర్ గ్రామీణం, న్యూస్టుడే : మహబూబ్నగర్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గెలిచే పరిస్థితి లేకపోవటంతో తన పదవి ఊడుతుందని సీఎం రేవంత్రెడ్డి భయపడుతున్నారని, అందుకే మహబూబ్నగర్లో తరచూ పర్యటిస్తూ భాజపా అభ్యర్థి డీకే అరుణపై నోరు పారేసుకుంటున్నారని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ విమర్శించారు. శుక్రవారం మహబూబ్నగర్కు వచ్చిన ఆమె పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. భాజపా అభ్యర్థి డీకే అరుణపై ఇష్టానుసారంగా ఆరోపణలు, విమర్శలు చేయడం కాంగ్రెస్ పార్టీ దిగజారుడు రాజకీయానికి నిదర్శనమన్నారు. రేవంత్రెడ్డి ఎన్ని ఎత్తుగడలు వేసినా, భాజపా అభ్యర్థిపై ఏ స్థాయిలో ఆరోపణలు చేసినా ప్రజలు తిప్పికొడతారని పేర్కొన్నారు. మోదీ మూడోసారి ప్రధాని కావాలని ప్రజలు భాజపా అభ్యర్థి డీకే అరుణను గుండెల్లో పెట్టుకొని భారీ మెజార్టీతో గెలిపిస్తారని ధీమా వ్యక్తంచేశారు. సెక్యులర్ పార్టీగా చెప్పుకొనే కాంగ్రెస్ నేతలు అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఆహ్వానం పంపితే ఎందుకు హాజరు కాలేదని ప్రశ్నించారు. ఈ దేశంలో నిజమైన సెక్యులర్ పార్టీ భాజపాయేనని, రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ భాజపాను మతతత్వ పార్టీగా ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో అనేక కుంభకోణాలు జరిగాయని, భాజపా పదేళ్ల పాలనలో ఒక్క కుంభకోణం కూడా లేదని, ప్రధాని మోదీ ప్రపంచంలో 11వ స్థానంలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను 5వ స్థానానికి తీసుకెళ్లారని గుర్తు చేశారు. ఆరు గ్యారంటీ పేరుతో మభ్యపెట్టి భారాసపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఓట్లుగా మలచుకుని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీల అమలులో విఫలమైందన్నారు. కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది భాజపా ప్రభుత్వమేనని, కాంగ్రెస్కు ఓటేస్తే వృథా అవుతుందని పేర్కొన్నారు. భాజపా ఎంపీ అభ్యర్థి డీకే అరుణను గెలిపిస్తే కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చి పాలమూరును అభివృద్ధి చేసుకోవచ్చని ఆమె పేర్కొన్నారు. భాజపా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు సాహితీరెడ్డి, నేతలు కె.రాములు, నిరంజనమ్మ, పద్మవేణి, జయశ్రీ, రమేశ్కుమార్, బుచ్చిరెడ్డి, తిరుపతిరెడ్డి, రామాంజనేయులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. కోటి ఇవ్వాలి
[ 07-05-2024]
రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెల్జాల సమీపంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కారు ఢీకొని వెంకటాపూర్ గ్రామానికి చెందిన నరేష్, పరశురాములు మృతి చెందారు. -
భాజపా, కాంగ్రెస్ పోటా పోటీగా ఎన్నికల ప్రచారం
[ 07-05-2024]
రాజోలి మండలంలోని గ్రామాల్లో మంగళవారం భాజపా, కాంగ్రెస్ పార్టీల నాయకులు పోటాపోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
గ్రామాల్లో భారాస నాయకుల ఇంటింటి ప్రచారం
[ 07-05-2024]
మండలంలోని రాజోలి, మాన్ దొడ్డి గ్రామాల్లో భారాస నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. -
సూరీడు చిన్నబోయేలా ఓటెత్తాలి?
[ 07-05-2024]
పాలమూరులో ఎండలు మండిపోతున్నాయి. ప్రతి రోజు సగటున గరిష్ఠంగా 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఇప్పట్లో ఎండలు తగ్గేలా లేవు. మరోవారం రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. -
నిలిచిన ఈఎస్ఐ వైద్యసేవలు
[ 07-05-2024]
మహబూబ్నగర్ పట్టణం ఏనుగొండలోని ఈఎస్ఐ(ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్) ఆసుపత్రికి తాళం పడింది. ప్రభుత్వం అద్దె బకాయిలు మంజూరు చేయడం లేదని భవనం యజమాని ఆసుపత్రికి తాళం వేయటంతో వైద్యసేవలు నిలిచిపోయాయి. -
మరో రెండు రోజులు కొనుగోళ్లు బంద్
[ 07-05-2024]
బాదేపల్లి వ్యవసాయ మార్కెట్కు అమ్మకానికి వారం రోజులుగా భారీగా ధాన్యం వస్తోంది. సోమవారం 700 మంది రైతులు వివిధ పంటలు 17,233 క్వింటాళ్లు తీసుకురావడంతో మార్కెట్ యార్డు మొత్తం నిండిపోయింది. -
ప్రజలను వంచించిన కాంగ్రెస్ ప్రభుత్వం
[ 07-05-2024]
తెలంగాణలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజలను వంచించిందని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కరసింగ్ ధామి ఆరోపించారు. -
నల్లమలలో వన్యప్రాణులకు ఆపద
[ 07-05-2024]
సాంకేతికత అభివృద్ధి.. కొన్నింటికి ప్రమాదకరంగా మారాయి. ప్రధానంగా నల్లమల అడవిలో, కృష్ణాతీరంలో వన్యప్రాణులకు, వివిధ రకాల చెట్ల జాతులకు ఆపద వచ్చింది. -
ఉల్లి రైతుకు కన్నీరు
[ 07-05-2024]
ఆరుగాలం కష్టపడి పండించిన ఉల్లి ధరలు తగ్గటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రోజురోజుకు మార్కెట్లో ఉల్లి ధరలు పడిపోతుండటంతో రైతులకు పెట్టుబడి కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. -
గెలిస్తే చాలు.. వసతులు వేలు
[ 07-05-2024]
ఎంపీగా గెలిచిన వ్యక్తికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తోంది? వారికి వచ్చే నిధుల సంగతేంటి? అనే విషయాలను తెలుసుకుందాం.! -
అప్పుడు అవినీతిపరుడు.. ఇప్పుడు ఆదర్శప్రాయుడా?
[ 07-05-2024]
కొద్ది నెలల క్రితం రాష్ట్రానికి వచ్చినప్పుడు మాజీ ఐపీఎస్ అధికారి అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు రూ. 1.20 కోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపిస్తూ.. ఆయన కుమార్తెపై అవినీతి ఆరోపణలు ఉన్నందున వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. -
మద్యం మత్తులో భర్తపై గొడ్డలితో దాడి
[ 07-05-2024]
మద్యం మత్తులో భర్తపై గొడ్డలితో దాడిచేసి హతమార్చిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. మమ్మాయిపల్లి గ్రామానికి చెందిన భార్య, భర్తలు లక్ష్మి, నాగయ్య వ్యవసాయ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. -
గర్భంలోనే శిశువు మృతి
[ 07-05-2024]
నెలలు నిండిన మగబిడ్డ గర్భంలోనే తనువు చాలించాడ]ని తెలిసి ఆ కన్నతల్లి కడుపుకోతతో విలవిలలాడింది. విషాదభరితమైన ఈ సంఘటన గద్వాల జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చోటు చేసుకుంది. -
చెలమ నీరే దిక్కు
[ 07-05-2024]
మిషన్ భగీరథ నీరు అరకొరగా రావడం, స్థానిక నీరు అపరిశుభ్రంగా వస్తుండటంతో మండలంలోని తుమ్మిళ్ల గ్రామంలో చాలా మంది ప్రజలకు చెలమల నీరే ఆధారమైంది. -
అందరికీ పోస్టల్ బ్యాలెట్
[ 07-05-2024]
లోక్సభ ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న అందరికీ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పిస్తూ జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాలు జారీ చేశారు. -
పకడ్బందీగా పోలింగ్ నిర్వహించాలి
[ 07-05-2024]
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఉదయ్కుమార్ అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. -
భారాస, భాజపా నిరుపేదల ద్రోహులు
[ 07-05-2024]
భారాస, భాజపా నాయకులు నిరుపేద ద్రోహులని పాలమూరు కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి అన్నారు. చర్లపల్లి, హన్మాన్పల్లి, కొండాపూర్, కిష్టాపూర్, రాంకిష్టాయపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే పర్నికరెడ్డితో కలిసి సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
మహిళలను వేధిస్తే కఠిన చర్యలు
[ 07-05-2024]
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కళాశాల ఆవరణలో ఓపెన్ ఇంటర్ పరీక్షలు రాయడానికి వచ్చిన విద్యార్థులకు షీటీం పోలీసులు పలు సామాజిక అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. -
భారాస కనుమరుగు కావడం ఖాయం
[ 07-05-2024]
పార్లమెంట్ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో భారాస కనుమరుగు కావడం ఖాయమని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆయన మండలంలోని తెల్లరాళ్లపల్లితండా, రేమద్దుల, బుసిరెడ్డిపల్లి గ్రామాల్లో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. -
సీఎంఆర్ బియ్యం సమకూరేనా?
[ 07-05-2024]
మిల్లర్లకు కేటాయించిన సీఎంఆర్ ధాన్యాన్ని మర ఆడించి తిరిగి ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యానికి ప్రభుత్వం ఎన్నో సార్లు గడువు పెంచినా.. వారిలో మాత్రం చలనం రావడం లేదు. -
భాజపా అధికారంలోకి వస్తే రాజ్యాంగానికి ప్రమాదం
[ 07-05-2024]
కేంద్రంలో భాజపా మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగానికి ప్రమాదమని నాగర్కర్నూల్ భారాస ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మలయాళంలో రూ.150కోట్లు కొల్లగొట్టిన మూవీ.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
ట్రేడింగ్ సమయం పొడిగింపు ఇప్పట్లో లేనట్లే..!
-
రోహిత్ శర్మను వరల్డ్ కప్ ట్రోఫీతో చూడాలని ఉంది: యువరాజ్ సింగ్
-
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వర్తించొద్దు: కేజ్రీవాల్ కేసులో సుప్రీం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఆ లెక్కలు నాకు తెలియదు.. అతడు మా జట్టులో ఉండటం అదృష్టం: హార్దిక్ పాండ్య