పోరుబాటతో గులాబీ శ్రేణుల్లో జోష్
భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ‘పోరుబాట’ బస్సుయాత్ర శుక్రవారం మహబూబ్నగర్లో విజయవంతం కావడంతో గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. పాలమూరులో రెండు రోజులపాటు కొనసాగే ఈ కార్యక్రమానికి మొదటి రోజు పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు.
భాజపాపైనే విమర్శలు ఎక్కుపెట్టిన కేసీఆర్
నేడు నాగర్కర్నూల్లో కొనసాగనున్న పర్యటన
క్లాక్టవర్లో నిర్వహించిన కూడలి సమావేశంలో ప్రసంగిస్తున్న కేసీఆర్, చిత్రంలో నరేందర్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, మన్నె శ్రీనివాస్రెడ్డి, లక్ష్మారెడ్డి
ఈనాడు, మహబూబ్నగర్- మహబూబ్ నగర్ పట్టణం, న్యూస్టుడే: భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ‘పోరుబాట’ బస్సుయాత్ర శుక్రవారం మహబూబ్నగర్లో విజయవంతం కావడంతో గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. పాలమూరులో రెండు రోజులపాటు కొనసాగే ఈ కార్యక్రమానికి మొదటి రోజు పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. జిల్లాకేంద్రంలోని మెట్టుగడ్డ చౌరస్తా నుంచి క్లాక్టవర్ వరకు రోడ్షో నిర్వహించగా జనం భారీగా హాజరయ్యారు. కేసీఆర్కు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పూల వర్షం కురిపించారు. క్లాక్టవర్ ప్రాంతం మొత్తం కిక్కిరిసిపోయింది. పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలు కేసీఆర్ పట్ల తమ అభిమానాన్ని చూపడం చూసిన స్థానిక నేతల్లో నూతనోత్సాహం కనిపించింది.
బస్సుయాత్ర సాయంత్రం 5.30కు మహబూబ్నగర్లోకి ప్రవేశించింది. బాలానగర్లో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా జడ్చర్ల సమీపంలోని గొల్లపల్లి వద్ద ఉన్న ఓ హోటల్లో కొద్దిసేపు విశ్రాంతికి ఆగారు. అక్కడే అల్పాహారం, తేనీరు సేవించి బయలుదేరారు. జడ్చర్ల ఫ్లై ఓవర్ వద్దకు పెద్ద ఎత్తున ప్రజలు, పార్టీ శ్రేణులు రావడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. స్థానికులు గుమ్మడికాయతో కేసీఆర్ బస్సుయాత్రకు దిష్టి తీశారు. అక్కడి నుంచి నేరుగా మహబూబ్నగర్లోని అప్పన్నపల్లి ఫ్లై ఓవర్ వద్దకు రాగానే పార్టీ శ్రేణులు బాణసంచా కాల్చి ఘనస్వాగతం పలికారు. పూలు చల్లారు. అక్కడి నుంచి మెట్టుగడ్డ వరకు శ్రేణులతో కలిసి బస్సుయాత్ర కొనసాగింది. క్లాక్టవర్ వద్దకు కేసీఆర్ రాగానే పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. భవనాలపైకి ఎక్కి పూల వర్షం కురిపించారు. సీఎం కేసీఆర్.. సీఎం కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు.
గడియారం చౌరస్తాలో జనసందోహం
భాజపాను లక్ష్యంగా చేసుకోని..: కేసీఆర్ తన ప్రసంగంలో భాజపాను లక్ష్యంగా చేసుకునే ఎక్కువగా విమర్శలు గుప్పించారు. మహబూబ్నగర్లో భారాసకు పోటీ భాజపానే అన్న సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. మహబూబ్నగర్ అభ్యర్థి డీకే అరుణపై కూడా విమర్శలు గుప్పించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకి జాతీయ హోదా ఎందుకు తీసుకురాలేదని ఆమెను ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సొంత జిల్లా కావడంతో ఆయనపై పెద్ద ఎత్తున వ్యక్తిగత విమర్శలు గుప్పిస్తారని భావించారు. కేవలం గ్యారంటీ కార్డుల అమలులో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని ప్రస్తావించారు. వ్యక్తిగత విమర్శల జోలికి పోలేదు. కాంగ్రెస్కు ఓటేస్తే భాజపాకు ఓటేసినట్లేనన్న సందేశాన్ని ప్రజల్లోకి తీసుకేళ్లేందుకు ప్రయత్నం చేశారు. కొద్ది సేపు ఉర్దూలో మాట్లాడి ముస్లింలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ కార్యక్రమానికి మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు డా.లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి, పట్నం నరేందర్రెడ్డి, అంజయ్య యాదవ్ పాల్గొన్నారు. రోడ్ షోలో భాగంగా శ్రీనివాస్ గౌడ్ బస్సు కిందికి దిగి నడుచుకుంటూ వచ్చారు. ఆ సమయంలో ఆయనను పార్టీ శ్రేణులు మోసుకుంటూ, నినాదాలు చేసుకుంటూ ముందుకు తీసుకువెళ్లారు. క్లాక్టవర్ వద్ద సభ ముగిసిన తర్వాత అక్కడికి వచ్చిన జనసందోహాన్ని చూసి బస్సుపైనే శ్రీనివాస్గౌడ్ డాన్స్ చేశారు.
ఫాంహౌజ్లో బస..: కూడలి సమావేశం అనంతరం కేసీఆర్ పాలకొండలోని శ్రీనివాస్గౌడ్ ఫాంహౌజ్కు తరలివెళ్లారు. శుక్రవారం రాత్రి అక్కడే ఆయనకు బస ఏర్పాటు చేశారు. శనివారం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉంది. మహబూబ్నగర్, నాగర్కర్నూల్లో జరిగే పార్టీ ఆవిర్భావ వేడుకల్లో కేసీఆర్ పాల్గొనే అవకాశం ఉంది. మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని పార్టీ ముఖ్యులతో భారాస అభ్యర్థులు మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ విజయానికి దిశానిర్దేశం చేయనున్నారు. సాయంత్రం 6 గంటలకు నాగర్కర్నూల్లోని ఉయ్యాలవాడ నుంచి బస్టాండ్ వరకు రోడ్ షో కొనసాగనుంది. అక్కడే కార్నర్ సమావేశంలో కేసీఆర్ పాల్గొననున్నారు. దీంతో జిల్లాలో రెండు రోజుల కేసీఆర్ బస్సుయాత్ర పర్యటన ముగుస్తుంది.
కేసీఆర్ హయాంలో అన్ని రంగాల అభివృద్ధి : మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయం, దోపిడీ, వలసలను చూసి కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని లేవనెత్తారని, చావు నోట్లో తలపెట్టి ప్రత్యేక రాష్ట్రం సాధించారని పేర్కొన్నారు. సీఎంగా పదేళ్ల పాటు అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని తెలిపారు. శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతల మాయమాటలతో ప్రజలు మోసపోయారని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిందని మండిపడ్డారు. రైతుబంధు ఆగిపోయిందని, రుణమాఫీ చేయలేదని తెలిపారు. రూ.4వేల పింఛను ఏమైందని, రూ.500లకు వంటగ్యాస్ రావటం లేదని పేర్కొన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకంలో రూ.లక్షతోపాటు తులం బంగారం ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సూరీడు చిన్నబోయేలా ఓటెత్తాలి?
[ 07-05-2024]
పాలమూరులో ఎండలు మండిపోతున్నాయి. ప్రతి రోజు సగటున గరిష్ఠంగా 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఇప్పట్లో ఎండలు తగ్గేలా లేవు. మరోవారం రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. -
నిలిచిన ఈఎస్ఐ వైద్యసేవలు
[ 07-05-2024]
మహబూబ్నగర్ పట్టణం ఏనుగొండలోని ఈఎస్ఐ(ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్) ఆసుపత్రికి తాళం పడింది. ప్రభుత్వం అద్దె బకాయిలు మంజూరు చేయడం లేదని భవనం యజమాని ఆసుపత్రికి తాళం వేయటంతో వైద్యసేవలు నిలిచిపోయాయి. -
మరో రెండు రోజులు కొనుగోళ్లు బంద్
[ 07-05-2024]
బాదేపల్లి వ్యవసాయ మార్కెట్కు అమ్మకానికి వారం రోజులుగా భారీగా ధాన్యం వస్తోంది. సోమవారం 700 మంది రైతులు వివిధ పంటలు 17,233 క్వింటాళ్లు తీసుకురావడంతో మార్కెట్ యార్డు మొత్తం నిండిపోయింది. -
ప్రజలను వంచించిన కాంగ్రెస్ ప్రభుత్వం
[ 07-05-2024]
తెలంగాణలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజలను వంచించిందని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కరసింగ్ ధామి ఆరోపించారు. -
నల్లమలలో వన్యప్రాణులకు ఆపద
[ 07-05-2024]
సాంకేతికత అభివృద్ధి.. కొన్నింటికి ప్రమాదకరంగా మారాయి. ప్రధానంగా నల్లమల అడవిలో, కృష్ణాతీరంలో వన్యప్రాణులకు, వివిధ రకాల చెట్ల జాతులకు ఆపద వచ్చింది. -
ఉల్లి రైతుకు కన్నీరు
[ 07-05-2024]
ఆరుగాలం కష్టపడి పండించిన ఉల్లి ధరలు తగ్గటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రోజురోజుకు మార్కెట్లో ఉల్లి ధరలు పడిపోతుండటంతో రైతులకు పెట్టుబడి కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. -
గెలిస్తే చాలు.. వసతులు వేలు
[ 07-05-2024]
ఎంపీగా గెలిచిన వ్యక్తికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తోంది? వారికి వచ్చే నిధుల సంగతేంటి? అనే విషయాలను తెలుసుకుందాం.! -
అప్పుడు అవినీతిపరుడు.. ఇప్పుడు ఆదర్శప్రాయుడా?
[ 07-05-2024]
కొద్ది నెలల క్రితం రాష్ట్రానికి వచ్చినప్పుడు మాజీ ఐపీఎస్ అధికారి అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు రూ. 1.20 కోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపిస్తూ.. ఆయన కుమార్తెపై అవినీతి ఆరోపణలు ఉన్నందున వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. -
మద్యం మత్తులో భర్తపై గొడ్డలితో దాడి
[ 07-05-2024]
మద్యం మత్తులో భర్తపై గొడ్డలితో దాడిచేసి హతమార్చిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. మమ్మాయిపల్లి గ్రామానికి చెందిన భార్య, భర్తలు లక్ష్మి, నాగయ్య వ్యవసాయ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. -
గర్భంలోనే శిశువు మృతి
[ 07-05-2024]
నెలలు నిండిన మగబిడ్డ గర్భంలోనే తనువు చాలించాడ]ని తెలిసి ఆ కన్నతల్లి కడుపుకోతతో విలవిలలాడింది. విషాదభరితమైన ఈ సంఘటన గద్వాల జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చోటు చేసుకుంది. -
చెలమ నీరే దిక్కు
[ 07-05-2024]
మిషన్ భగీరథ నీరు అరకొరగా రావడం, స్థానిక నీరు అపరిశుభ్రంగా వస్తుండటంతో మండలంలోని తుమ్మిళ్ల గ్రామంలో చాలా మంది ప్రజలకు చెలమల నీరే ఆధారమైంది. -
అందరికీ పోస్టల్ బ్యాలెట్
[ 07-05-2024]
లోక్సభ ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న అందరికీ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పిస్తూ జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాలు జారీ చేశారు. -
పకడ్బందీగా పోలింగ్ నిర్వహించాలి
[ 07-05-2024]
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఉదయ్కుమార్ అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. -
భారాస, భాజపా నిరుపేదల ద్రోహులు
[ 07-05-2024]
భారాస, భాజపా నాయకులు నిరుపేద ద్రోహులని పాలమూరు కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి అన్నారు. చర్లపల్లి, హన్మాన్పల్లి, కొండాపూర్, కిష్టాపూర్, రాంకిష్టాయపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే పర్నికరెడ్డితో కలిసి సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
మహిళలను వేధిస్తే కఠిన చర్యలు
[ 07-05-2024]
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కళాశాల ఆవరణలో ఓపెన్ ఇంటర్ పరీక్షలు రాయడానికి వచ్చిన విద్యార్థులకు షీటీం పోలీసులు పలు సామాజిక అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. -
భారాస కనుమరుగు కావడం ఖాయం
[ 07-05-2024]
పార్లమెంట్ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో భారాస కనుమరుగు కావడం ఖాయమని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆయన మండలంలోని తెల్లరాళ్లపల్లితండా, రేమద్దుల, బుసిరెడ్డిపల్లి గ్రామాల్లో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. -
సీఎంఆర్ బియ్యం సమకూరేనా?
[ 07-05-2024]
మిల్లర్లకు కేటాయించిన సీఎంఆర్ ధాన్యాన్ని మర ఆడించి తిరిగి ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యానికి ప్రభుత్వం ఎన్నో సార్లు గడువు పెంచినా.. వారిలో మాత్రం చలనం రావడం లేదు. -
భాజపా అధికారంలోకి వస్తే రాజ్యాంగానికి ప్రమాదం
[ 07-05-2024]
కేంద్రంలో భాజపా మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగానికి ప్రమాదమని నాగర్కర్నూల్ భారాస ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘దయచేసి మా దేశానికి రండి’.. భారతీయులను వేడుకుంటున్న మాల్దీవులు
-
రూ.10వేల లంచం కేసును లాగితే.. బయటపడిన నోట్ల గుట్టలు..!
-
రెండుసార్లు విమానం దారి మళ్లింపు.. కోల్కతా ఆటగాళ్లకు తప్పని తిప్పలు
-
వైఎస్ షర్మిలపై కేసు నమోదు
-
పన్నూ కేసులో అమెరికా ఆశలపై నీళ్లుజల్లిన చెక్ రిపబ్లిక్ కోర్టు..!
-
ఆ హీరోని అనుకున్నారు.. అల్లు అర్జున్ను ఫైనల్ చేశారు: 20 ఏళ్ల ‘ఆర్య’ విశేషాలివీ..