పరిశ్రమల్లో అగ్నికీలలు
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పరిశ్రమలు, వ్యాపార సంస్థల్లో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. యజమానులు పరిశ్రమల్లో తగిన అగ్నిమాపక సాధనాలు ఏర్పాటు చేసుకోకపోవటం వల్లనే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి.
కనీస రక్షణ పరికరాలు లేక ప్రమాదాలతో తీవ్రనష్టం
న్యూస్టుడే, మహబూబ్నగర్ నేరవిభాగం
- ఈ నెల 23న అర్ధరాత్రి నారాయణపేట జిల్లా మాగనూరు మండలంలోని ఓ పత్తి పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు ఆర్పడానికి సరైన పరికరాలు లేక ఇబ్బంది పడాల్సి వచ్చింది. అగ్నిమాపక శాఖ అధికారులు వచ్చి మంటలను ఆర్పినా... అప్పటికే రూ.కోట్లల్లో నష్టం వాటిల్లింది. గింజల తీసి వేసి బేళ్ల రూపంలో కట్టిన పత్తి కాలిపోయింది.
- ఈ నెల 23న రాత్రి మహబూబ్నగర్ మండల పరిధిలోని ఓ ఆయిల్ మిల్లులో అగ్ని ప్రమాదం జరిగింది. మిల్లులో తవుడు బస్తాలతో పాటు మామూలు గోనె సంచులు ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. సకాలంలో మంటలను అర్పకపోవడంతో రూ.లక్షల్లో నష్టం వాటిల్లింది. ప్రమాదంలో ట్రాక్టర్, డోజరు, ఇతర వస్తువులన్నీ కాలిపోయాయి.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పరిశ్రమలు, వ్యాపార సంస్థల్లో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. యజమానులు పరిశ్రమల్లో తగిన అగ్నిమాపక సాధనాలు ఏర్పాటు చేసుకోకపోవటం వల్లనే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. రూ.5లక్షల నుంచి రూ.10లక్షల వరకు వెచ్చించి పరికరాలు ఏర్పాటు చేసుకుంటే చాలావరకు నష్టాన్ని నివారించే అవకాశం ఉన్నా ఆ దిశగా దృష్టి సారించటం లేదు. 95 శాతం పరిశ్రమల వాళ్లు అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉంచుకోవడం లేదు. ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 10వేలకు పైగా పరిశ్రమలు ఉన్నాయి. ఒక్క మహబూబ్నగర్ జిల్లాలోనే 2,864 పరిశ్రమలు ఉన్నాయి. జడ్చర్ల సెజ్లో 100కు పైగా పరిశ్రమలు ఉంటే పదింటికే అగ్నిమాపక శాఖ అనుమతులు తీసుకున్నాయి.
నిబంధన అడ్డం పెట్టుకుని నిర్లక్ష్యం : తెలంగాణ అగ్నిమాపక శాఖ సేవాచట్టం - 1999 సెక్షన్ 13 ప్రకారం 15 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న పరిశ్రమలు, భవనాల వాళ్లు తప్పనిసరిగా అగ్నిమాపక శాఖ నుంచి ఎన్వోసీ తీసుకోవాల్సి ఉంటుంది. 15 మీటర్ల కంటే ఎత్తు తక్కువగా ఉంటే ఎన్వోసీ అవసరం లేదు. వాటిపై అగ్నిమాపక శాఖ పర్యవేక్షణ ఉండదు.
పరిశ్రమల శాఖ నుంచి అనుమతి తీసుకుంటే సరిపోతుంది. అందుకే పరిశ్రమలు, గిడ్డంగులు, వాణిజ్య సముదాయాల యజమానులు 15 మీటర్ల కంటే తక్కువ ఎత్తులో నిర్మిస్తున్నారు. వాటిలో ఎలాంటి అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేసుకోకపోవటంతో ప్రమాదాలు జరిగినప్పుడు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఒక్కోసారి ప్రాణనష్టం కూడా జరగొచ్చు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అగ్నిమాపక శాఖ నుంచి 15 పరిశ్రమలే ఎన్వోసీ తీసుకున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పరిశ్రమల శాఖ నుంచి 176 పరిశ్రమల వాళ్లు అనుమతి తీసుకున్నారు.
ఈ ఏర్పాట్లు ఉంటే మేలు : ప్రతి పరిశ్రమలో నీటిసంపు, నిమిషానికి 2,280 లీటర్లు లేదా 1,620 లీటర్ల నీటిని పంపింగ్ చేయగల మోటార్లు ఏర్పాటు చేసుకోవాలి. పరిశ్రమ చుట్టూ 150 మి.మీ.ల వ్యాసార్థం గల ఇనుప పైపులు, వాటికి ప్రతి 45 మీటర్ల దూరంలో ఒక అవుట్ లెట్ ఉండాలి. షార్ట్ సర్క్యూట్ సంభవించినా, మంట, పొగ వచ్చినా గుర్తించే ఆటోమెటిక్ డిటెక్షన్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలి. పరిశ్రమలో ప్రతి 200 చదరపు మీటర్లకు ఒక అగ్నిమాపక పరికరం ఉండాలి. ఉపరితల నీటిట్యాంకు ఉండాలి. ఇవి ఉంటే మంటలను అర్పివేయొచ్చు.
జాగ్రత్తలు తీసుకోవాలి
- పి.కిశోర్, అగ్నిమాపక శాఖ జిల్లా అధికారి, మహబూబ్నగర్
వేసవిలో అగ్ని ప్రమాదాలు జరగకుండా అందరూ జాగ్రత్త తీసుకోవాలి. పరిశ్రమలతో పాటు పెద్ద భవనాలు, విద్యాసంస్థలు, దుకాణాల వాళ్లు కూడా అగ్నిమాపక పరికరాలు ఏర్పాటుచేసుకోవాలని సూచిస్తున్నాం. ప్రమాదాలు జరిగితే మా సిబ్బంది వెంటనే వెళ్లి మంటలు ఆర్పుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోరుబాటతో గులాబీ శ్రేణుల్లో జోష్
[ 27-04-2024]
భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ‘పోరుబాట’ బస్సుయాత్ర శుక్రవారం మహబూబ్నగర్లో విజయవంతం కావడంతో గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. పాలమూరులో రెండు రోజులపాటు కొనసాగే ఈ కార్యక్రమానికి మొదటి రోజు పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. -
తుది జాబితాపై కసరత్తు పూర్తి
[ 27-04-2024]
పాలమూరులో ఓటర్ల తుది జాబితాపై కసరత్తు పూర్తయ్యింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎస్ఎస్ఆర్-2024కు అదనంగా కొత్త ఓటర్లను జత చేసి తుది జాబితాను ఒకటి, రెండు రోజుల్లో ప్రకటించనున్నారు. -
గంజాయి దందా.. యువతే నిండా
[ 27-04-2024]
పాలమూరు పట్టణంలో గంజాయి వ్యాపారం చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఎక్సైజ్, పోలీసు శాఖలు నిఘా పెట్టినా.. వారి కళ్లు గప్పి గంజాయిని విక్రయిస్తూనే ఉన్నారు. ఈ కేసులో అరెస్టయి జైలుకు వెళ్లిన వాళ్లు కూడా బయటకు వచ్చాక మళ్లీ అదే దందా చేస్తున్నారు. -
పాలమూరు సిబ్బందికి పరీక్ష!
[ 27-04-2024]
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పాలమూరు విశ్వవిద్యాలయం (పీయూ)లో పనిచేస్తున్న బోధనేతర సిబ్బందికి అధికారులు ‘పరీక్ష’ నిర్వహించేందుకు సన్నాహాలు చేయటం దుమారం రేపుతోంది. -
35 నామపత్రాల ఆమోదం.. ఏడు తిరస్కరణ
[ 27-04-2024]
మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గానికి దాఖలైన నామపత్రాలను అధికారులు నిశితంగా పరిశీలించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఎన్నికల సాధారణ పరిశీలకుడు షెవాంగ్ గ్యాచో భూటియా, రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ జి.రవి నాయక్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ చేపట్టారు. -
గుంభనంగా ద్వితీయ శ్రేణి
[ 27-04-2024]
అసెంబ్లీ ఎన్నికలకు, లోక్సభ ఎన్నికలకు ప్రచారంలో తేడా ఉంది. అగ్రనాయకుల హడావుడి తప్పా కింది స్థాయి నాయకుల్లో ఇంకా ఎన్నికల ఉత్సాహం కనిపించడం లేదు. నామినేషన్ల ప్రక్రియ మొదలైనప్పటికీ కార్యకర్తల్లో ఉత్తేజం కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత వెంటనే ఈ ఎన్నికలు రావడంతో అంతటా స్తబ్ధత నెలకొంది. -
అరచేతిలో సకల సమాచారం
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పక్కాగా ఏర్పాట్లు చేసింది. డిజిటల్ సాంకేతికత వినియోగించుకుంటూ ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు అడుగులు వేస్తోంది. -
పెళ్లిళ్లు, శుభకార్యాలకు విరామం
[ 27-04-2024]
పెళ్లిళ్లు, శుభకార్యాలకు శనివారం నుంచి బ్రేక్ పడనుంది. మూఢం వచ్చేసింది. గ్రహాల స్థితి సరిగా లేని సమయాన్ని మూఢంగా జ్యోతిష్యులు చెబుతారు. గురుగ్రహం సూర్యుడికి దగ్గరగా వచ్చినపుడు గురుమౌఢ్యంగా, శుక్రగ్రహం సూర్యగ్రహనికి దగ్గర వచ్చినప్పుడు శుక్ర మౌఢ్యంగా పిలుస్తారు. -
కాంగ్రెస్ అభ్యర్థి గెలవరనే ఆందోళనలో సీఎం
[ 27-04-2024]
మహబూబ్నగర్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గెలిచే పరిస్థితి లేకపోవటంతో తన పదవి ఊడుతుందని సీఎం రేవంత్రెడ్డి భయపడుతున్నారని, అందుకే మహబూబ్నగర్లో తరచూ పర్యటిస్తూ భాజపా అభ్యర్థి డీకే అరుణపై నోరు పారేసుకుంటున్నారని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ విమర్శించారు. -
బీ ఫాం ఉన్న వారికే పార్టీ గుర్తు
[ 27-04-2024]
గ్రామ పంచాయతీ ఎన్నికలు మినహా మిగతా అన్ని ఎన్నికల్లో అభ్యర్థులు రాజకీయ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తే బీ ఫారం అందజేయాల్సి ఉంటుంది. ఒక రాజకీయ పార్టీ తరపున ఏ అభ్యర్థి అయితే బీ ఫారం అందజేస్తారో ఆ అభ్యర్థికే పార్టీ గుర్తు కేటాయిస్తారు. -
ప్రతి ఓటరుకు స్లిప్పు అందేలా చర్యలు: కలెక్టర్
[ 27-04-2024]
ప్రతి ఓటరుకు ఓటరు స్లిప్పు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ ఉదయ్కుమార్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. -
తెల్లజొన్నలకు పచ్చరంగు
[ 27-04-2024]
పచ్చజొన్నలకు మార్కెట్లో విపరీతంగా డిమాండ్ ఉండటంతో జోరుగా కల్తీ జరుగుతోంది. ఆరోగ్య సమస్యల దృష్ట్యా మధుమేహం, రక్తపోటు తదితర సమస్యలతో బాధపడుతున్న వారు బియ్యంనకు బదులు పచ్చజొన్నలపై ఆసక్తి కనబరుస్తున్నారు. -
తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకుంటాం..
[ 27-04-2024]
నిత్యవసర సరకులు, తినుబండారాలను కల్తీ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. సహజ సిద్ధంగా పండిన జొన్నలను కల్తీ చేస్తున్నట్లు సమాచారం ఉంది. -
లక్ష్యం బారెడు... సేకరణ మూరెడు
[ 27-04-2024]
జిల్లాలో యాసంగి ధాన్యం సేకరణ లక్ష్యం సుదూరంగా కనిపిస్తోంది. పౌరసరఫరాలశాఖ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 27 రోజులు కావస్తున్నా ఇంతవరకు అనుకున్న లక్ష్యంలో కనీసం ఒకశాతం కూడా సేకరించలేదు. -
సేవల సౌలభ్యానికి అంగన్వాడీల సర్వే
[ 27-04-2024]
అయిజ పట్టణంలోని భరత్నగర్ కాలనీకి చెందిన శాంతమ్మ టీచర్స్ కాలనీలో ఉన్న అంగన్వాడీ కేంద్రం పరిధిలో ఉంది. సుమారు అర కిలోమీటర్ దూరంలో ఉంటుంది. రోజూ వెళ్లి రావాలంటే ఇబ్బంది. చిన్నారులను కేంద్రానికి పంపాలన్నా ఇబ్బందే.
తాజా వార్తలు (Latest News)
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM