logo

పుట్టెడు దుఃఖంతో పరీక్షకు హాజరు

అనారోగ్యంతో తండ్రి మృతిచెందిన బాధను దిగమింగి ఏడాదంతా చదివిన చదువు వృథా కావద్దని భావించి విద్యార్థిని పదోతరగతి పరీక్షకు హాజరైంది.

Published : 27 Mar 2024 02:24 IST

చారకొండ (వెల్దండ గ్రామీణం), న్యూస్‌టుడే: అనారోగ్యంతో తండ్రి మృతిచెందిన బాధను దిగమింగి ఏడాదంతా చదివిన చదువు వృథా కావద్దని భావించి విద్యార్థిని పదోతరగతి పరీక్షకు హాజరైంది. చారకొండ మండలం జూపల్లి గ్రామానికి చెందిన కడారి పావని తండ్రి తిరుపతయ్య అనారోగ్యంతో సోమవారం మధ్యాహ్నం మృతి చెందాడు. తండ్రిని కోల్పోయిన విద్యార్థిని పుట్టెడు దుఃఖంతో మంగళవారం మండల కేంద్రంలోని జడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలో జరిగిన భౌతిక శాస్త్రం పరీక్షకు హాజరైంది. కుమార్తె పరీక్ష రాసి ఇంటికి వచ్చిన తర్వాత తిరుపతయ్య అంత్యక్రియలు కుటుంబ సభ్యులు నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని