అంగన్‘వేడి’
రాజోలిలో ఓ గుడిసెలో నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రమిది. మండలంలో 37 కేంద్రాలుంటే కేవలం నాలుగింటికి మాత్రమే సొంత భవనాలున్నాయి. 22 కేంద్రాలు ఇరుకైన గాలి వెలుతురు సక్రమంగా రాని అద్దె భవనాలు, రేకుల గుడిసెల్లో ఇదిగో ఇలా నిర్వహిస్తున్నారు.
ఎండలకు అల్లాడుతున్న చిన్నారులు
రాజోలిలో ఓ గుడిసెలో నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రమిది. మండలంలో 37 కేంద్రాలుంటే కేవలం నాలుగింటికి మాత్రమే సొంత భవనాలున్నాయి. 22 కేంద్రాలు ఇరుకైన గాలి వెలుతురు సక్రమంగా రాని అద్దె భవనాలు, రేకుల గుడిసెల్లో ఇదిగో ఇలా నిర్వహిస్తున్నారు.
గద్వాల న్యూటౌన్, న్యూస్టుడే: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 44 సెల్సియస్ డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం వెల్గొండలో బుధవారం 45.1 డిగ్రీలు నమోదైంది. ఇళ్లల్లో ఉండే ప్రజలే ఉక్కపోతతో అల్లాడుతుండగా, రేకుల గుడిసెలు, ఇరుకైన అద్దె గృహాలు, గాలిరాని భవనాల్లో నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే 3 నుంచి 5 ఏళ్ల లోపు చిన్నారులు పరిస్థితి ఊహిస్తేనే భయమేస్తోంది. మధ్యాహ్న భోజనం చేసేందుకు వచ్చే గర్భిణులు, బాలింతలు సైతం ఉక్కపోతతో తల్లడిల్లుతున్నారు. అంగన్వాడీ కేంద్రాలను ఒంటిపూట నిర్వహిస్తున్నప్పటికీ, మధ్యాహ్నం వేళ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండల తీవ్రత నేపథ్యంలో పాఠశాలలకు వేసవి సెలవులు ఇచ్చినట్లుగా, వీటికీ సెలవులు ఇచ్చి, పోషకాహారం ఇంటికి అందించేలా చర్యలు చేపట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఇదీ పరిస్థితి : ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 4,321 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. కేంద్రాలకు వస్తున్న చిన్నారులకు పోషకాహారం అందించడంతో పాటు, విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. ఆరోగ్య లక్ష్మి పథకం పేరుతో గర్భిణులు, బాలింతలకు పౌష్ఠికాహారం అందజేస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా కేంద్రాలకు సరైన భవనాలు లేకపోవడం సమస్యగా మారింది. దాదాపు 60 శాతం కేంద్రాలకు సొంత భవనాలు లేవు. ఇరుకైన అద్దె గృహాల్లో వీటిని నిర్వహిస్తున్నారు. సొంత భవనాలున్న చోట విద్యుత్తు సౌకర్యం లేదు. దీంతో పంకాల ఏర్పాటుకు అవకాశం లేకుండా పోయింది. మధ్యాహ్నం భోజనం వేడిగా ఇస్తుండటంతో ఉక్కపోతతో తినలేకపోతున్నారు. నిద్రించే సమయంలో గాలి రాక అల్లాడుతున్నారు. అద్దె భవనాలు కావడంతో తాగునీటి సమస్య కూడా తీవ్రంగా ఉంది. రానున్న రోజుల్లో ఈ సమస్య మరింత తీవ్రమై కేంద్రాలకు వచ్చే చిన్నారుల సంఖ్య తగ్గే అవకాశం ఉందని ఆయా కేంద్రాల టీచర్లు వాపోతున్నారు.
- జోగులాంబ గద్వాల జిల్లాను తీసుకుంటే.. మూడు ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 713 కేంద్రాలున్నాయి. వీటిలో 120కి మాత్రమే సొంత భవనాలుండగా, మిగిలినవి అద్దె భవనాలు, పాఠశాల భవనాల్లో నిర్వహిస్తున్నారు. సొంత భవనాల్లో 80కి పైగా కేంద్రాలకు విద్యుత్తు సౌకర్యం లేదు.
- నాగర్కర్నూల్ జిల్లాలో 529 కేంద్రాలకు సొంత భవనాలుండగా, 193 అద్దె భవనాల్లో, ఉచిత అద్దె భవనాల్లో 409 నిర్వహిస్తున్నారు. కొన్ని చోట్ల ఇరుకైన అద్దె భవనాలు ఉండటంతో గాలి రాక చిన్నారులు అల్లాడుతున్నారు. మిగిలిన జిల్లాల్లోనూ దాదాపు ఇవే పరిస్థితులున్నాయి.
సమస్యను నివేదిస్తాం
-సుధారాణి, డీడబ్ల్యూవో, గద్వాల
అంగన్వాడీ కేంద్రాల్లో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. కేంద్రాలకు సొంత భవనాల నిర్మాణం, ఎండల నేపథ్యంలో సెలవులు ఇచ్చే అంశాన్ని ఎన్నికలు ముగిశాక ఉన్నతాధికారుకు నివేదిస్తాం. ప్రస్తుతానికి అన్ని కేంద్రాల్లో తప్పనిసరిగా 15 రోజుల టీచర్, మరో 15 రోజులు ఆయా అందుబాటులో ఉండి పోషకాహారం అందించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కందనూలు.. మొగ్గు ఎటు వైపో..
[ 02-05-2024]
నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గంలో ఓటర్లు విలక్షణ తీర్పు ఇస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు ఇచ్చే తీర్పులో మార్పు కనిపిస్తోంది. -
ఉన్నత విద్యావంతులు కొందరే
[ 02-05-2024]
మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇంటర్లోపే విద్యార్హత ఉండటం విశేషం. -
అభ్యర్థికి టాటా.. పెరుగుతోంది నోటా
[ 02-05-2024]
ఎన్నికల్లో ప్రతి ఓటూ కీలకమే. అభ్యర్థుల గెలుపోటములు నిర్దేశించడంతో పాటు ప్రభుత్వాల ఏర్పాటుకు దోహదపడుతుంది. లోక్సభ ఎన్నికలైనా సరే.. గట్టిపోటీ ఉన్న చోట రెండు, మూడు వేల ఓట్లే కీలకంగా మారే పరిస్థితి ఉంటుంది. -
సూర్యప్రతాపం.. తగ్గిన ప్రచారం
[ 02-05-2024]
ఓ వైపు సూర్యప్రతాపం రోజురోజుకూ అధికం అవుతోంది. మరోవైపు ప్రచార గడువు దగ్గరకు వస్తోంది... ఈ వేడి వాతావరణంలో రాజకీయ పార్టీల ప్రచార సరళి మారిపోయింది. గతంలో ఉన్నంత జోష్ కనిపించడం లేదు. మంది ఉన్నచోట మాట్లాడి వెళ్లిపోతున్నారు. ఇంటింటి ప్రచారం పలచబడింది. -
రైల్వే లైన్ సాధనకు కృషి
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికల్లో ఆశీర్వదిస్తే వనపర్తి ప్రజల చిరకాల వాంఛ అయిన రైల్వే లైన్ సాధనకు కృషి చేస్తానని నాగర్కర్నూల్ భాజపా ఎంపీ అభ్యర్థి భరత్ప్రసాద్ పేర్కొన్నారు. -
కమనీయం శ్రీనివాసుడి కల్యాణం
[ 02-05-2024]
అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడు.. ఆపద మొక్కులవాడైన శ్రీవేంకటేశ్వరస్వామి నామస్మరణతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. -
న్యాయవాదులు ఆలోచించి ఓటేయాలి : డీకే అరుణ
[ 02-05-2024]
మేధావి వర్గమైన న్యాయవాదులు లోక్సభ ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలని భాజపా లోక్సభ అభ్యర్థి డీకే అరుణ కోరారు. -
సైబర్ నేరాలపై అవగాహన అవసరం
[ 02-05-2024]
సైబర్ నేరాల పట్లపై అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా సైబర్ సెక్యూరిటీ విభాగం డీఎస్పీ సత్తయ్య పేర్కొన్నారు. -
నాలుగు ప్రాంతాల్లో రెడ్జోన్
[ 02-05-2024]
జోగులాంబ గద్వాల జిల్లాలో గతంలో ఎన్నడూ లేనంతగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జిల్లాలోని నాలుగు ప్రాంతాలు రెడ్జోన్ పరిధిలోకి వెళ్లాయి. -
పొరుగుసేవల దరఖాస్తులపై అనుమానాలెన్నో !
[ 02-05-2024]
గద్వాల మెడికల్ కళాశాలలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో వివిధ విభాగాలలో పనిచేయడానికి సిబ్బంది నియామకానికి అర్హత గల వ్యక్తుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఇందులో స్థానిక అభ్యర్థులకు మాత్రమే అవకాశం కల్పించారు. -
సామాజిక మాధ్యమాలపై నిఘా
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా అభ్యర్థుల నామపత్రాల దాఖలు గడువు పూర్తి కావడంతో ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. -
తెలుగులోనూ తప్పారు!
[ 02-05-2024]
పదోతరగతి వార్షిక ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో నాగర్కర్నూల్ జిల్లా 21వ స్థానంలో నిలువడం నిరాశ కలిగించింది. విద్యార్థులు వార్షిక పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించడానికి జిల్లా విద్యాశాఖాధికారులు చొరవ చూపలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
భాజపాతోనే ఎస్సీ వర్గీకరణ సాధ్యం
[ 02-05-2024]
కేంద్రంలో భాజపా మూడోసారి అధికారం చేపడితేనే ఎస్సీ వర్గీకరణ సాధ్యమవుతుందని కేంద్ర ప్రసార, సమాచారశాఖ సహాయమంత్రి మురుగన్ అన్నారు. -
మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి : ఎస్పీ
[ 02-05-2024]
యువత గంజాయికి బానిసలుగా మారి తమ భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని, మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని ఎస్పీ యోగేశ్గౌతం అన్నారు. -
సార్వత్రిక పరీక్షలకు 804 మంది హాజరు
[ 02-05-2024]
సార్వత్రిక పదో తరగతి, ఇంటర్ పరీక్షలకు 804 మంది విద్యార్థులు హాజరైనట్లు టాస్ కో ఆర్డినేటర్ శ్రీనివాస్ తెలిపారు. -
పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయండి
[ 02-05-2024]
పెండింగ్లో ఉన్న కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని ఎస్పీ రక్షితకృష్ణమూర్తి ఆదేశించారు. వనపర్తి సర్కిల్ పరిధిలో వనపర్తి పట్టణం, గ్రామీణం, రేవల్లి, వీపనగండ్ల పోలీస్స్టేషన్లకు సంబంధించి పెండింగ్ కేసులపై బుధవారం ఎస్సైలతో ఎస్పీ సమీక్ష సమావేశం నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
చెన్నైకి షాక్ తప్పదా.. ఐదుగురు బౌలర్ల గైర్హాజరీపై ఫ్లెమింగ్ ఏమన్నాడంటే?
-
4 కంటైనర్లలో రూ.2వేల కోట్లు పట్టివేత!
-
సిద్ధార్థ్తో నిశ్చితార్థం.. అందుకే వెల్లడించాల్సి వచ్చింది: అదితిరావు
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణపై లుక్అవుట్ నోటీసు
-
హైదరాబాద్.. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారా? 300 కొట్టేస్తారా?
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇకపై ఈవెంట్ ప్లాన్ చేయొచ్చు!